ఇండియన్ ఎయిర్ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. మార్చి 6 నుంచి 27 వ తేదీ వరకు యూకేలోని వడ్డింగ్టన్లో కోబ్రా వారియర్ 2022 జరుగనున్నది. ఈ కోబ్రా వారియర్ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన తేజాస్ లైట్ వెయిటెడ్ యుద్ద విమానాలు పాల్గొనాల్సి ఉన్నది. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఈ కోబ్రాస్ వారియర్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యుద్ధ విమానాల ప్రదర్శనలో పాల్గొనడం వలన యుద్ధ సంక్షోభం…
ప్రపంచంలో అత్యధిక స్టీల్ ను ఉత్పత్తి చేసే దేశాల మధ్య వార్ జరుగుతుండటంతో ప్రపంచ దేశాల్లో స్టీల్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రపంచంలో ఎక్కువశాతం స్టీల్ను రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఉత్పత్తి చేస్తుంటాయి. అక్కడి నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా రెండు దేశాల నుంచి స్టీల్ ఉత్పత్తి, ఎగుమతులు ఆగిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రపంచంలో స్టీల్ సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. Read:…
ఉక్రెయిన్-రష్యా వివాదంతో అక్కడ వేలాదిమంది భారతీయులు వందలాదిమంది తెలుగు రాష్ట్రాల వారు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఏపీ ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణ బాబు చెప్పారు. ఉక్రెయిన్లో ఉన్న రాష్ట్ర ప్రజలను వెనక్కి తీసుకుని రావటానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపడం పై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీలో అధికారులతో సమీక్షా…
ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేయడం ప్రారంభించి మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతున్నది. ఉక్రెయిన్ వాసులతో పాటు ఆ దేశంలో ఉన్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఇప్పటికే పోలెండ్, హంగేరీ, రొమేనియా సరిహద్దుల్లో విమానాలను ఉంచి అక్కడి నుంచి భారతీయులు తరలించారు. ఉక్రెయిన్లో విమానాలకు ప్రవేశం నిషేదించడంతో దేశంలోని నలుమూలల ఉన్న భారతీయులను వివిధ…
బీజేపీ కార్యాలయంలో ఫొటోగ్రాఫర్ల రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా హాజరయ్యారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. వివిధ జిల్లాల నుంచి సమావేశానికి హాజరయ్యారు ఫొటో గ్రాఫర్లు. ఫొటోగ్రాఫర్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదు. ఆత్మనిర్భర్ భారత్ లో చేతి వృత్తుల వారిని ప్రోత్సహించాలని మోడీ చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూసేందుకు మోడీ పాలనే కారణం. రష్యా, ఉక్రెయిన్ యుద్దం పెద్ద ఎత్తున జరుగుతుంది. వారి మధ్యలో మధ్యవర్తిత్వం నిర్వహించే…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా బలగాలు ఇప్పటికే ఉక్రెయిన్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని పుతిన్ ఆదేశాలు జారీ చేయడంతో పోరును పెద్ద ఎత్తున చేస్తున్నారు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్కూడా పోరాటం చేస్తున్నది. ఇప్పటికే దాదాపు 3500 మంది రష్యన్ బలగాలను హతమార్చినట్టు ఉక్రెయిన్ చెబుతున్నది. అయితే, దీన్ని రష్యా దృవీకరించడం లేదు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ కు…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలోపడిపోయాయి రష్యా దళాలు.. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్ను కాపాడుకుంటా.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్ వీధుల్లో తిరుగుతూ చేశారు.. ఆయుధాలు వీడొద్దు అని కోరారు..…
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులు, భారతీయులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు.. సురక్షితంగా వారిని స్వదేశానికి తీసుకొస్తాం అన్నారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా యుద్ధం చేస్తోంది.. యుద్ధం ప్రారంభం కాక ముందే 4 వేల మందిని స్వదేశానికి తరలించాం.. ప్రస్తుతం గగనతలం మూసివేయడంతో 19 – 20 వేల మంది అక్కడ చిక్కుకున్నారని తెలిపారు.. అయితే, భారతీయులను ఎలా రక్షించుకోవాలని వివిధ ప్లాన్లను రూపొందించింది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. అందరి వివరాలు సేకరించాం.. వారిని…
ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి… ఉక్రెయిన్ రాజధాని కీవ్లో భారీగా పేలుళ్లు జరుగుతున్నాయి.. భూతలం, గగనతలం నుంచి విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు.. ఇప్పటికే చెర్నోబిల్ పవర్ ప్లాంట్ను, కీవ్ ఎయిర్పోర్ట్ సహా పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంది చైనా.. మరోవైపు, ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను, విద్యార్థులను స్వదేశానికి రప్పించేపనిలో పడిపోయింది భారత ప్రభుత్వం.. దీని కోసం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తోంది.. ఇక, తెలుగు రాష్ట్రాలు సహా.. ఉక్రెయిన్లో తమ విద్యార్థులుఉన్న ఆయా రాష్ట్రాలు…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రాజధాని కీవ్ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకునేలా ముందుకు కదులుతున్నాయి రష్యా బలగాలు.. ఇప్పటికే కీవ్ ఎయిర్పోర్ట్ను స్వాధీనం చేసుకుంది రష్యా.. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది… రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో ఓటింగ్ కూడా నిర్వహించారు.. అయితే, ఓటింగ్కు మాత్రం భారత్, చైనా దూరంగా ఉన్నాయి.. భద్రతా మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఖండిస్తూ ఓటు వేయగా.. భద్రతా…