ఉక్రెయిన్లో రష్యా విధ్వంసం కొనసాగుతోంది. యుద్ధం నాల్గో రోజుకు చేరుకోగా..మూడోరోజు ప్రధాన నగరాలే టార్గెట్గా రష్యా సైన్యం… మిస్సైల్స్తో విరుచుకుపడింది. సిటీల్లోకి ట్యాంకులు చొచ్చుకెళ్తున్నాయి. ముఖ్యంగా జనావాసాలపైనా బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఉన్నది కొద్ది పాటి సైన్యం. రష్యాకున్నంత ఆయుధ సంపత్తి లేదు. అయినా ఉక్రెయిన్ సైనికులు వెన్నుచూపడం లేదు. ప్రపంచంలోనే ఓ అమేయశక్తి నేరుగా దాడి చేస్తున్నా.. మాతృభూమిని రక్షణలో ప్రాణాలర్పిస్తున్నారు. మా ప్రాణమున్నంతవరకూ మా మాతృభూమిని ఆక్రమించలేరంటూ… పోరాట…
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులకు… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. కొందరు విద్యార్థులు… ఆయనకు కృతజ్ఞతలు తెలపగా… మరికొందరు కేంద్ర మంత్రితో సెల్ఫీలు దిగారు.…
విద్యార్ధులు విద్యకోసం విదేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు అందరికి గుర్తుకు వచ్చే దేశం ఉక్రెయిన్. ఉక్రెయిన్లో విద్యను అభ్యసించేందుకు పెద్ద సంఖ్యలో ఇండియా నుంచి వెళ్తుంటారు. ముఖ్యంగా మెడికల్ విద్యను అభ్యసించేందుకు వెళ్తుంటారు. ఉక్రెయిన్లో విద్యను అభ్యసించేందుకు వెళ్లడం వెనుక కారణం లేకపోలేదు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. సాంకేతిక, వైద్య విద్య కోర్సులను అక్కడి స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్లో కూడా బోధన ఉండడం మరో కారణం. దీంతో…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ట్యాంకర్లలో కొన్నింటిపై జెడ్ అనే అక్షరం రాసున్నది. ఆ అక్షరం ఏంటి? ఎందుకు జెడ్ అక్షరాన్ని దానిపై రాస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.…
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్నది. రష్యా సేనలు ఇప్పటికే ఉక్రెయిన్లోని రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించాయి. అయితే, రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రయత్నించారు. అందులోనూ క్రిమియా నుంచి ఉక్రెయిన్లోకి ప్రవేశించాలంటే ఓ బ్రిడ్జి మీద నుంచి ఉక్రెయిన్లోకి ప్రవేశించాలి. ఈ బ్రిడ్జిని కూల్చివేస్తే రష్యా సేనలకు అడ్డుకట్ట వేయవచ్చని ఉక్రెయిన్ భావించింది. ఆ బ్రిడ్జిని కూల్చివేసేందుకు బాంబులు అమర్చింది. Read: Crazy News: విజయ్…
ఇండియన్ ఎయిర్ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. మార్చి 6 నుంచి 27 వ తేదీ వరకు యూకేలోని వడ్డింగ్టన్లో కోబ్రా వారియర్ 2022 జరుగనున్నది. ఈ కోబ్రా వారియర్ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన తేజాస్ లైట్ వెయిటెడ్ యుద్ద విమానాలు పాల్గొనాల్సి ఉన్నది. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఈ కోబ్రాస్ వారియర్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యుద్ధ విమానాల ప్రదర్శనలో పాల్గొనడం వలన యుద్ధ సంక్షోభం…
ప్రపంచంలో అత్యధిక స్టీల్ ను ఉత్పత్తి చేసే దేశాల మధ్య వార్ జరుగుతుండటంతో ప్రపంచ దేశాల్లో స్టీల్ కొరత ఏర్పడే అవకాశం ఉన్నది. ప్రపంచంలో ఎక్కువశాతం స్టీల్ను రష్యా, ఉక్రెయిన్ దేశాలు ఉత్పత్తి చేస్తుంటాయి. అక్కడి నుంచి వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. అయితే, రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా రెండు దేశాల నుంచి స్టీల్ ఉత్పత్తి, ఎగుమతులు ఆగిపోయే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రపంచంలో స్టీల్ సంక్షోభం ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. Read:…
ఉక్రెయిన్-రష్యా వివాదంతో అక్కడ వేలాదిమంది భారతీయులు వందలాదిమంది తెలుగు రాష్ట్రాల వారు చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఏపీ ఉక్రెయిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణ బాబు చెప్పారు. ఉక్రెయిన్లో ఉన్న రాష్ట్ర ప్రజలను వెనక్కి తీసుకుని రావటానికి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు పంపడం పై దృష్టి సారించింది ఏపీ ప్రభుత్వం. ఢిల్లీలో అధికారులతో సమీక్షా…
ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేయడం ప్రారంభించి మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతున్నది. ఉక్రెయిన్ వాసులతో పాటు ఆ దేశంలో ఉన్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఇప్పటికే పోలెండ్, హంగేరీ, రొమేనియా సరిహద్దుల్లో విమానాలను ఉంచి అక్కడి నుంచి భారతీయులు తరలించారు. ఉక్రెయిన్లో విమానాలకు ప్రవేశం నిషేదించడంతో దేశంలోని నలుమూలల ఉన్న భారతీయులను వివిధ…