Ukraine Russia War: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయక చర్యలు వేగవంతం చేశాయి. రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి రెండో ఎయిరిండియా విమానం ఢిల్లీకి చేరుకుంది. ఇందులో మొత్తంగా 250 మంది విద్యార్థులున్నారు. శనివారం 219 మంది విద్యార్థులతో తొలి ఎయిర్ఇండియా విమానం ముంబైకి చేరుకుంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న విద్యార్థులకు… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్వాగతం పలికారు. కొందరు విద్యార్థులు… ఆయనకు కృతజ్ఞతలు తెలపగా… మరికొందరు కేంద్ర మంత్రితో సెల్ఫీలు దిగారు. విద్యార్థులు ఇండియాకు రావడానికి సహకరించిన రోమేనియా ఎంబసీ అధికారులకు కేంద్రం తరపున పీయూష్ కృతజ్ఞతలు చెప్పారు.
Read Also: Astrology: ఫిబ్రవరి 27, ఆదివారం దినఫలాలు
Also Read
ఇక, ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా ఇండియా చేరుకుంటున్నారు. ఉక్రెయిన్ వెళ్లిన ఎయిరిండియా ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ ప్రత్యేక విమానంలో ఏపీ, తెలంగాణకు చెందిన కొంతమంది తెలుగు విద్యార్థులు మొదటి విడతలో భారత్కు చేరుకున్నారు. తెలుగు విద్యార్థులను ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ రిసీవ్ చేసుకున్నారు. ఈ విమానంలో ఏపీకి చెందిన రాజుల పాటి అనూష, సిమ్మ కోహిమ వైశాలి, వేముల వంశి కుమార్, అభిషేక్ మంత్రి, జయశ్రీ ,హర్షిత కౌసర్, సూర్య సాయి కిరణ్ ఉండగా.. తెలంగాణకు చెందిన వివేక్, శ్రీహరి, తరుణ్, నిదిష్, లలితా, దేవి, దివ్య, మనీషా, రమ్య, ఐశ్వర్య, మాన్య, మహిత, ప్రత్యూష, గీతిక, లలిత, తరణి ఉన్నారు.
ఉక్రెయిన్ లో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 550 మంది వైద్య విద్యార్థులు వెళ్లినట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి 260, తెలంగాణ నుంచి 275 మంది వైద్య విద్యార్థులు ఉక్రెయిన్లో చదువుతున్నట్లు సమాచారం. జఫ్రోజియా వర్సిటీలోనే 1400 మంది భారతీయ వైద్య విద్యార్థులు ఉన్నారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్కు 800 కి.మీ రైలులో తీసుకొచ్చి..అక్కడ నుంచి విమానంలో తరలించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ నుంచి వచ్చే తెలంగాణ విద్యార్థులను హైదరాబాద్ కు చేరవేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు. విద్యార్థులను హైదరాబాద్ కు చేరవేయడానికి ప్రభుత్వం ఉచితంగా టికెట్లను అందిస్తుందన్నారు.
తాజావార్తలు
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
-
Praggnanandhaa: తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నార్వే చెస్ 2026 టైటిల్కైవసం
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!