దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు.
Russia - Ukraine War : రష్యాకు యూరోపియన్ యూనియన్ షాకిచ్చింది. దీర్ఘకాలంగా ఉక్రెయిన్ దేశంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా విషయంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆగ్నేయ ఉక్రెయిన్లోని విల్నియాన్స్క్ నగరంలోని ప్రసూతి ఆసుపత్రిపై బుధవారం రష్యా క్షిపణి దాడిలో నవజాత శిశువు మరణించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ప్రసవించిన మహిళ, శిశువు, డాక్టర్ రెండస్తుల భవనంలోని ప్రసూతి వార్డులో ఉందని.. ఆ వార్డు మొత్తం ధ్వంసమైందని అధికారులు వెల్లడించారు.
2 Killed As Russian Missile Lands In Poland, Near Ukraine Border: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలాండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింద. తూర్పు పోలాండ్ లోని ప్రజెవోడో అనే గ్రామంలో జరిగిన మిస్సైల్ పేలుడులో ఇద్దరు మరణించినట్లు పోలాండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు.
ఉక్రెయిన్లోని ఖేర్సన్ నగరం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకున్న తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ' ఖేర్సన్ మాదే' అని ప్రకటించారు. దీనిని అమెరికా అసాధారణ విజయంగా ప్రశంసించింది.
ఉక్రెయిన్పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉక్రెయిన్పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Ukraine Sought Pakistan’s Help For Developing Nuclear Weapons: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు పాకిస్తాన్ సాయం చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అణ్వాయుధాలను అభివృద్ధి కోసం ఉక్రెయిన్, పాకిస్తాన్ సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఉక్రెయిన్ ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ వెళ్లినట్లు రష్యా సెనెటర్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే రష్యా, పాకిస్తాన్ ను హెచ్చరించించినట్లు తెలుస్తోంది.