Russia-Ukraine War: ఖేర్సన్ నగరంపై రష్యా బాంబు దాడులు.. 15 మంది మృతి
Russia-Ukraine War: దక్షిణ ఉక్రేనియన్ నగరమైన ఖేర్సన్పై రష్యా బాంబు దాడుల్లో శుక్రవారం 15 మంది పౌరులు మరణించారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇంజినీర్లు ప్రధాన నగరాలకు విద్యుత్, నీటి సరఫరాను పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. ఉక్రెయిన్లో ఉష్ణోగ్రతలు గడ్డకట్టే స్థాయికి చేరుకోవడంతో పాటు ఆరోగ్య సంక్షోభం, వలసలు భయాలను రేకెత్తిస్తుండగా.. ఈ దాడులు ఉక్రెయిన్ను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలపై లక్ష్యంగా చేసుకుని రష్యా దాడుల వల్ల దేశంలోని ఆరు మిలియన్ల కుటుంబాలు ఇప్పటికీ విద్యుత్ కోతల కారణంగా ప్రభావితమయ్యాయని ఆ దేశ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్స్కీ అన్నారు.
ఉక్రెయిన్ బలగాలు ఇటీవల తిరిగి స్వాధీనం చేసుకున్న తూర్పులోని కీలక నగరమైన ఖేర్సన్పై రష్యా బాంబు దాడి చేసినట్లు ఆ నగర అధికారి గలినా లుగోవా వెల్లడించారు. శత్రువుల దాడి ఫలితంగా మొత్తం 15 మంది నివాసితులు మరణించారని.. ఒక చిన్నారితో సహా 35 మంది గాయపడ్డారని ఆమె తెలిపారు. అనేక ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు. “రష్యన్ ఆక్రమణదారులు బహుళ రాకెట్ లాంచర్లతో నివాస ప్రాంతంపై కాల్పులు జరిపారు. ఒక పెద్ద భవనంలో మంటలు చెలరేగాయి” అని ఖేర్సన్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ యారోవ్స్లావ్ యానుషోవిచ్ చెప్పారు. ఇతర ప్రాంతాలకు పౌరులను తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఖేర్సన్ సిటీ కౌన్సిల్ తెలిపింది. ఉక్రెయిన్ అంతటా పవర్ స్టేషన్లు, ఇతర అవస్థాపన వనరులపై దాడులు మాస్కో బలగాలు ప్రభుత్వాన్ని పడగొట్టి, కీవ్ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైన తర్వాత ఉక్రెయిన్ను లొంగదీసుకునేందుకు రష్యా ఈ తాజా ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం కీవ్ను సందర్శించిన బ్రిటన్ విదేశాంగ మంత్రి ఉక్రెయిన్కు కొత్త సహాయాన్ని ప్రకటించారు. ఇందులో అంబులెన్స్లు, రష్యా సైనికుల లైంగిక హింస బాధితులకు మద్దతు కూడా ఉన్నాయి.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
Brazil Shootings: స్కూళ్లలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు.. ముగ్గురు మృతి
ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్లో పోరాడుతున్న సైనికుల తల్లులను కలుసుకున్నాడు. తాను వ్యక్తిగతంగా ఈ బాధను పంచుకుంటానని తెలుసుకోవాలని తాను కోరుకుంటున్నానని ఆయన వారికి చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!