Russia: పోలాండ్ హై అలర్ట్.. రష్యా మిస్సైల్ అటాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Killed As Russian Missile Lands In Poland, Near Ukraine Border: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో పోలాండ్ దేశంలో రష్యా మిస్సైల్ పేలుడు సంభవించింద. తూర్పు పోలాండ్ లోని ప్రజెవోడో అనే గ్రామంలో జరిగిన మిస్సైల్ పేలుడులో ఇద్దరు మరణించినట్లు పోలాండ్ మిలిటరీ తెలిపింది. ఈ ఘటనపై నాటో మిత్రపక్షాలు దర్యాప్తు చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించింది. అయితే ఈ దాడి గురించిన సమాచారాన్ని పెంటగాన్ నిర్ధారించలేదు.
అయితే పోలాండ్ భూభాగంలో రష్యా మిస్సైల్ తాకినట్లు వస్తున్న వార్తలను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఈ చర్యలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడమే అని అభివర్ణించింది. ఈ దాడి తరువాత జాతీయ భద్రత, రక్షణ వ్యవహారాల కమిటీతో పోలాండ్ ప్రధాని మాటెస్జ్ మొరావికీ సమావేశం అయ్యారు. ఇదిలా ఉంటే లాట్వీయా ఢిప్యూటి పీఎం ఆర్టిస్ పాబ్రిక్స్ రష్యాపై తీవ్ర ఆరోపణలు చేశారు. రష్యా ఉక్రెయిన్ పౌరులను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా పోలాండ్ లోని నాటో భూభాగంపై క్షిపణులు ప్రయోగించిందని ఆరోపించారు.
Also Read
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- UK Break-Up: యూకే విడిపోతుందా? స్వాతంత్య్రం కోసం స్కాట్కాంట్, వేల్స్, ఐర్లాండ్ రిఫరెండం!
Read Also: Syamala Devi: ప్రాణస్నేహితులు.. కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయారు.. కన్నీటిపర్యంతమైన కృష్ణంరాజు భార్య
నార్వే, లిథువేనియా, ఎస్టోనియా దేశాలు నాటో సభ్యదేశాలు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇది తీవ్రమైన సంఘటనగా నార్వే విదేశాంగ మంత్రి అన్నికెన్ హ్యట్ ఫెల్డ్ అన్నారు. నాటోని ప్రతీ భూభాగం రక్షించబడాలని లిథువేనియా అధ్యక్షడు గిటానాస్ నౌసెడా కోరారు. మిత్రదేశాలతో చర్చించి ఎలా స్పందించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఎస్టోనియన్ విదేశాంగ శాఖ మంత్రి ఉర్మాస్ రీన్సాలు అన్నారు.
రష్యా మంగళవారం ఉక్రెయిన్ పై భారీగా క్షిపణులతో విరుచుకుపడింది. రాజధాని కీవ్ తో పాటు తూర్పు ప్రాంతాలపై విరుచుకుపడింది. ఈ క్రమంలోనే పోలాండ్ భూభాగంపై క్షిపణి కూలవచ్చని తెలుస్తోంది. ఉక్రెయిన్ మరో నగరం ఎల్వీవ్ పోలాండ్ సరిహద్దుకు సమీపంలోనే ఉంది. దీనిపై దాడి చేస్తున్న సమయంలోనే మిస్సైల్ మిస్ ఫైర్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై నాటో సభ్యదేశాలు ఎలాంటి చర్య తీసుకుంటాయో చూడాలి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!