తిరుమలకు భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో భక్తులు ఏడుకొండల స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. నిన్న 31 వేల మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదిలా వుంటే టీటీడీ ఉదయాస్తమాన సేవా టికెట్లు విడుదల చేసింది టీటీడీ. తిరుపతిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి విరాళమిచ్చిన దాతలకు ప్రివిలేజ్ గా ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయించింది. అర్ధగంటలో చిన్న పిల్లల ఆసుపత్రికి రూ.58 కోట్ల విరాళం వచ్చింది. టీటీడీ వెబ్ సైట్ లో…
ఇవాళ్టి నుంచి మేడారంలో మహాజాతర. నాలుగురోజుల పాటు జరగనున్న జాతరకు కోటిన్నరమంది భక్తులు వస్తారని అంచనా. హెలికాప్టర్ లోనూ మేడారం వెళ్ళే అవకాశం. ఇవాళ తిరుమలలో మాఘమాస పౌర్ణమి సేవ నిర్వహిస్తున్న టీటీడీ. రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై మాఢ వీధులలో విహరించనున్న మలయప్పస్వామి. తిరుమలలో ఉదయాస్తమాన సేవా యాప్ ని ప్రారంభించనున్న టీటీడీ. ప్రాణదాన పథకానికి కోటి రూపాయలు విరాళంగా అందించిన భక్తులకు ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు కేటాయించనున్న టీటీడీ. తిరుమల అంజనాద్రిలో…
నేటి నుంచి టీటీడీ సర్వదర్శనం టోకెన్లను ఆఫ్లైన్లో జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ కాంప్లెక్స్లో ప్రత్యేక కౌంటర్లను టీటీడీ ఏర్పాటు చేసింది. రోజుకు 15 వేల చొప్పున టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. మరోసారి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం నేడు ఇన్పుట్ సబ్సిడీని అందజేయనుంది. ఈ రోజు రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీని సీఎం జగన్ జమ చేయనున్నారు. ఏపీలో నేటి నుంచి జెన్కో సంస్థల్లో ఉద్యోగుల సహాయ నిరాకరణ చేయనున్నారు.…
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. త్వరలో తిరుమల దర్శన టికెట్లను పెంచుతున్నట్టు ప్రకటించింది. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. దేశంలో స్వల్పంగా గడిచిన 24 గంటల్లో 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 1,241 మరణాలు నమోదు కాగా ప్రస్తుతం దేశంలో 7,90,789 యాక్టివ్ కరోనా కేసులు వున్నాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో ఈ నెల 16వ తేదీ నుంచి తిరుపతిలో…
కలియుగ వైకుంఠం తిరుమల రథ సప్తమి వేడుకలకు సిద్ధమయింది. కరోనా దృష్ట్యా ఏకాంతంగా వేడుకలు నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది.రథ సప్తమి నాడు ఏటా భక్తులతో తిరుమల సందడిగా వుంటుంది. అయితే తాజా పరిస్థితుల్లో భక్తులకు తిరుమల వెళ్ళి స్వయంగా వేడుకలను చూసే అవకాశం లేదు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సప్త వాహనాలపై భక్తులకు మలయప్పస్వామి దర్శనమివ్వనున్నారు. సూర్యప్రభ వాహనంతో ప్రారంభమై.. చంద్రప్రభ వాహనంతో వేడుకలు ముగియనున్నాయి.
కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది. 8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ.…
కొన్ని వేల పాములను పట్టుకుని తిరిగి అడవుల్లో విడిచి.. వాటికి ప్రాణం పోశాడు.. అయితే అదే పాము కాటుకు గురై నేడు.. ప్రాణాల కోసం పోరాడుతున్నాడు. ఆరు రోజుల క్రితం ఓ కళాశాలలో పామును పడుతుండగా పాముకాటుకు గురైన టీటీడీ స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఓ వైపు పాము కాటు.. మరోవైపు డెంగ్యూ కూడా సోకడంతో భాస్కర్ నాయుడు ఆరోగ్యం పరిస్థితి…
తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 26,401 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన వారు 12,401 మంది భక్తులు. హుండి ఆదాయం రూ.2.18 కోట్లుగా టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెల 8వ తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరగనున్నాయి. ఏకాంతంగా రథసప్తమి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది టీటీడీ. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి దేవుని కడప వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అక్కడ కూడా ఏకాంతంగా…
కోవిడ్ కారణంగా తిరుమలకు వెళ్ళే భక్తులు తగ్గారు. ఇప్పుడిప్పుడే వారి సంఖ్య పెరుగుతోంది. సామాన్య భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేలా త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారీ ప్రకియ ప్రారంభిస్తాం అని టీటీడీ చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ కారణంగా విధిలేని పరిస్థితిలో ఆన్ లైన్ ద్వారా ప్రస్తుతం సర్వదర్శన టోకేన్లు జారీ చేస్తున్నాం అన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందుతుంది అన్న ఆందోళనతో తిరుపతిలో ఆఫ్ లైన్ ద్వారా టోకేన్లు జారి చేసే విధానాన్ని గత…
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు గుడ్న్యూస్.. ఫిబ్రవరి మాసానాకి సంబంధించిన దర్శనం టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది టీటీడీ.. ఎల్లుండి ఆన్లైన్లో ఫిబ్రవరి నెలకు సంబంధిచిన కోటా టికెట్లను ఉంచనున్నారు.. ఎల్లుండి ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను బుక్చేసుకునే అవకాశం కల్పిస్తోంది టీటీడీ.. ఇక, ఫిబ్రవరి మాసంలో రోజుకి 12 వేల చొప్పున టికెట్లను విడుదల చేయనున్నారు.. మరోవైపు.. ఈ నెల 29వ తేదీన సర్వదర్శనం టోకెన్లు విడుదల చేయనుంది టీటీడీ.. రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనం…