ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్పై లెబనాన్ దాడి చేయడంతో ఐడీఎఫ్ దళాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి. దీంతో బీరూట్పై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. దక్షిణ బీరూట్ ప్రజలను ఇప్పటికే ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది.
తాజాగా లెబనాన్పై ఇజ్రాయెల్ భూతల దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో లెబనాన్లో 4.3 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రభావం ఇరాన్లోని గెరాష్ను కూడా కుదిపేసింది. ప్రస్తుతం లెబనాన్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనతో వణికిపోతున్నారు.
ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై దాడులను నిరోధించడానికి లెబనాన్లో అదనపు వ్యూహాత్మక స్థానాలను ముందుకు తీసుకెళ్లడానికి.. స్వాధీనం చేసుకోవడానికి ప్రధాని నెతన్యాహు ఇజ్రాయెల్ సైన్యానికి అధికారం ఇచ్చారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు.
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) హిజ్బుల్లా లక్ష్యాలపై దాడులు కొనసాగిస్తున్నాయని, ఇజ్రాయెల్పై కాల్పులు జరిపినందుకు ఆ సంస్థ భారీ మూల్యం చెల్లిస్తోంది. ఇంకా చెల్లిస్తూనే ఉంటుంది.’’ అని కాట్జ్ అన్నారు. ఉత్తర సరిహద్దు వెంబడి ఉన్న కమ్యూనిటీలను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇజ్రాయెల్ గెలీలీ నివాసితులకు భద్రతను హామీ ఇచ్చిందని.. ఆ ప్రతిజ్ఞను నెరవేర్చాలని యోచిస్తోందని అన్నారు.
ఇది కూడా చదవండి: Israel-Khamenei: ఖమేనీ జాడను ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది? వెలుగులోకి సంచలన విషయాలు