తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల సౌకర్యార్దం నిర్మించిన పద్మావతి నిలయాన్ని కలెక్టర్ కార్యాలయం పేరుతో ప్రభుత్వానికి అప్పగించడం మంచి పద్దతి కాదని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. గతంలో కూడా టీటీడీ ఆస్తులను తాత్కాలికంగా ప్రభుత్వానికి కేటాయిస్తే….ఇప్పటి వరకు వాటిని ఖాళీ చెయ్యలేదన్నారు. వక్స్ బోర్డ్,క్రిస్టియన్ చారిటీ భూముల నుంచి ప్రభుత్వం ఒక్క అడుగు అన్న ఇలా పొందగలదా అని ప్రశ్నించారు భాను ప్రకాష్ రెడ్డి. ఈ నిర్ణయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే త్వరలో…
తేనే తుట్టను కదిలించడం.. తేనెటీగలతో కుట్టించుకోవడం TTD పాలకమండలికి రోటీన్గా మారిపోయింది. ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు కూడా ఆ కోవలోకే చేరింది. ఆ అంశంపై ఎందుకు చర్చ ప్రారంభించారు? ఎందుకు వెనక్కి తగ్గారు? అసలేం ఏం జరిగింది? హడావిడి నిర్ణయాలు.. ఆనక వెనక్కి తగ్గడం..! తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి యూటర్న్స్ పాలకమండలిగా మారిపోతోంది. సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం.. కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడం.. చివరికి వెనక్కి తగ్గడం ఒక ప్రహాసనంలా కనిపిస్తోంది.…
సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పదిరోజులవుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని ఆయన వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు…
కోవిడ్ ఆంక్షలను TTD వినియోగించుకున్నట్టుగా ఇంకెవ్వరూ ఉపయోగించి ఉండరు. తమకు అవసరమైతే రూల్స్ను బయటకు తీస్తుంది. లేకపోతే వాటిని గాలికొదిలేస్తుంది. ఇంతకీ కరోనా నిబంధనల పేరుతో TTD చేస్తోంది ఏంటి.. చెయ్యనిది ఏంటి? కోవిడ్ పేరుతో ఏకాంతంగానే ఉత్సవాలుదేశవ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు అమలులోకి రాకముందే అప్రమత్తమైంది తిరుమల తిరుపతి దేవస్థానం. జనతా కర్ప్యూ.. లాక్డౌన్ విధించకముందే TTD వాటిని అమలు చేసి చూపించింది. ఏపీలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకముందే 2020 మార్చి 20…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం మరో రికార్డు సృష్టించింది… కరోనా మహమ్మారి కారణంగా విధించిన ఆంక్షలతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో పాటు.. హుండీ ఆదాయం కూడా తగ్గిపోయిన విషయం తెలిసిందే కాగా.. మళ్లీ అన్ని ఆంక్షలు ఎత్తివేయడంతో.. ఇప్పుడు క్రమంగా భక్తుల సంఖ్యతో పాటు.. హుండీ ఆదాయం కూడా పెరుగుతూ వస్తోంది… ఈ నేపథ్యంలో… శుక్రవారం రోజు శ్రీవారి హుండీ ఆదాయం కొత్త రికార్డు సృష్టించింది.. Read…
సామాన్య భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపత దేవస్థానం (టీటీడీ).. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది… సర్వదర్శనం భక్తులుకు ప్రాధాన్యత ఇచ్చేందుకు శుక్ర, శని, ఆదివారలలో సిఫార్సు లేఖలపై కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది… వీఐపీల కోసం కేటాయించిన సమయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించేలా నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి… ఇక, శుక్ర, శని,…
కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. అయితే, టీటీడీ నిర్ణయాల వల్ల శ్రీవారు భక్తులకు దూరం అవుతారని మండిపడుతున్నారు టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. టీటీడీ నిర్ణయాలపై పయ్యావుల కేశవ్ ఫైర్ అవుతున్నారు. భక్తులకు శ్రీవారిని దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. టీటీడీ తీసుకునే నిర్ణయాలు శ్రీవారి భక్తుల మనోభావాలకు విరుద్దంగా జరుగుతున్నాయన్నారు. తిరుమల ప్రాభవాన్ని, ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతుందా అనే అనుమానం కలుగుతోంది.సామాన్య భక్తులకు ఏడుకొండల వాడిని దూరం…
గత వారం జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలోని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంభాషణను మొబైల్ వీడియో కటింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా కట్ చేసి దుష్ప్రచారంగా వాడుకుంటున్న దుండగులపై టీటీడీ సీరియస్ అయింది. ఎవరైతే దుష్ప్రచారం లో భాగంగా సామాజిక మాధ్యమాలలో వీడియోని కట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారో వారిపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అవుతోంది టీటీడీ యాజమాన్యం. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు సిద్ధం అని టీటీడీ యాజమాన్యం హెచ్చరించింది. పాలకమండలి…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా పెద్ద సంఖ్యలో శ్రీవారిని భక్తులు దర్శించుకునే వీలు లేకుండా అయిపోయింది… ఇక, ఆన్లైన్లో పెట్టే దర్శనం టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే అయిపోవడంతో.. సాధారణ భక్తులు, ఆన్లైన్ సేవలకు దూరంగా ఉండేవారికి ఇబ్బందిగా మారింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో దర్శన టికెట్ల పెంపునకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.. Read Also: Drunk and Drive: వాహనాదారులకు ఊరట..…
టీటీడీ పాలక మండలి సమావేశంలో కొన్ని వ్యాపార లావాదేవీలు బయట పడ్డాయని తిరుపతి అసెంబ్లీ జనసేన పార్టీ ఇంఛార్జీ కిరణ్ రాయల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. టీటీడీలో పెద్దలు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఏమనుకుంటే అది జరుగుతాయా…? ఈ విషయాలు అన్ని ఎస్వీబీసీ లైవ్ ద్వారా బయటకు వచ్చాయని ఆయన అన్నారు. ఉదయస్తమాన సేవా టికెట్లను సినిమా టికెట్లు తరహాలో పాలక మండలి సభ్యులు వాటలేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. లైవ్ ద్వారా అందరూ…