శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం… మరోసారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాంది… జులై మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది.. 25వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు టీటీడీ అధికారులు.. కాగా, శ్రీవారి దర్శన టికెట్లతో పాటు సేవా టికెట్లను భక్తుల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది.. ఆన్లైన్లో పెట్టిన కొన్ని గంటల్లోనే…
కోవిడ్ అనంతరం కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఈ నెల 11వ తేది నుంచి 17వ తేది వరకు భారీసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 7 రోజులలో 5.30 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. 24.38 లక్షల లడ్డూలు విక్రయిస్తే….హుండీ ద్వారా రూ.32.5 కోట్లు ఆదాయం లభించిందన్నారు. 46 వేల 419 వాహనాలలో భక్తులు తిరుమలకు తరలివచ్చారన్నారు. మే 1వ తేది నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులను…
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ శుభవార్త అందించారు. మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని నడక భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది. దీంతో మెట్లు మరమ్మతులకు గురికావడంతో ఐదు నెలలుగా నడక మార్గం మూతపడింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మరమ్మతుల పనులు పూర్తి చేసినట్లు టీటీడీ మెంబర్ పోకల అశోక్ కుమార్…
శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ దగ్గర తోపులాట కలకలం రేపింది.. పెద్ద ఎత్తున భక్తుల తరలిరావడం.. ఒక్కసారిగా అంతా ఎగబడడంతో తోపులాట జరిగింది.. అయితే, మూడు రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఈ తోపులాటపై స్పందించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ప్రతిపక్షాలు దేవున్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నాయని మండిపడ్డారు.. సర్వదర్శనం స్లాటెడ్ టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో కొంత మేరకు తోపులాట జరిగినా దేవుడి దయవల్ల ఎవరికీ ప్రాణా పాయం జరగలేదన్న ఆయన.. ఈ సంఘటన…
చిన్నపాటి తప్పిదాలు TTD కొంప ముంచాయా? అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులపాలిట శాపమైందా? అందివచ్చిన అవకాశాన్ని TTD చేజేతులా జారవిడుచుకుందా? సర్వదర్శనం భక్తులకు మళ్లీ ఇక్కట్లు తప్పవా? టీటీడీ వైఫల్యం.. భక్తులకు చుక్కలు తిరుమల తిరుపతి దేవస్థానం అతిపెద్ద హిందు ధార్మిక సంస్థ. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. సాధారణ భక్తుడికి కూడా VIP భక్తుల తరహాలోనే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. కానీ.. కొన్ని విషయాల్లో TTD వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.…
సర్వదర్శన భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నిన్న శ్రీవారిని 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. కోవిడ్ తరువాత నిన్న రికార్డ్ స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని దర్శించుకున్న 46,400 మంది భక్తులు దర్శిచుకున్నారు. దీంతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు దర్శించుకోగా, వర్చువల్ సేవా టిక్కేట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపులు ద్వారా 16,529 మంది…
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానేవచ్చింది. ఇవాళ 11 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ మాసానికి సంబంధించిన వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. నిజానికి వారం క్రితమే విడుదల చేయాల్సి వున్నా సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. రోజుకి వెయ్యి చోప్పున టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. వారిని రేపటి నుంచి దర్శనానికి అనుమతించనుంది. ఇవాళ తిరుపతిలో ఎల్లుండికి సర్వదర్శన టోకెన్లు జారీ చేయనుంది. ఎల్లుండి శ్రీవారి…
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో…
శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.…
కరోనా మహమ్మారి విజృంభణతో భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా వికలాంగులు, వయో వృద్ధులకు శుభవార్త చెప్పింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకీ 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక…