చిన్నపాటి తప్పిదాలు TTD కొంప ముంచాయా? అధికారుల మధ్య సమన్వయ లోపం భక్తులపాలిట శాపమైందా? అందివచ్చిన అవకాశాన్ని TTD చేజేతులా జారవిడుచుకుందా? సర్వదర్శనం భక్తులకు మళ్లీ ఇక్కట్లు తప్పవా? టీటీడీ వైఫల్యం.. భక్తులకు చుక్కలు తిరుమల తిరుపతి దేవస్థానం అతిపెద్ద హిందు ధార్మిక సంస్థ. నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోంది. సాధారణ భక్తుడికి కూడా VIP భక్తుల తరహాలోనే శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. కానీ.. కొన్ని విషయాల్లో TTD వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.…
సర్వదర్శన భక్తులకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. నిన్న శ్రీవారిని 88,748 మంది భక్తులు దర్శించుకున్నారు. కోవిడ్ తరువాత నిన్న రికార్డ్ స్థాయిలో శ్రీవారిని భక్తులు దర్శించుకున్నారు. సర్వదర్శన క్యూ లైను ద్వారా స్వామివారిని దర్శించుకున్న 46,400 మంది భక్తులు దర్శిచుకున్నారు. దీంతో పాటు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైను ద్వారా 25,819 మంది భక్తులు దర్శించుకోగా, వర్చువల్ సేవా టిక్కేట్లు, సేవా టికెట్లు, టూరిజం శాఖ కేటాయింపులు ద్వారా 16,529 మంది…
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానేవచ్చింది. ఇవాళ 11 గంటలకు ఆన్ లైన్ లో ఏప్రిల్ మాసానికి సంబంధించిన వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. నిజానికి వారం క్రితమే విడుదల చేయాల్సి వున్నా సాఫ్ట్ వేర్ సమస్యల వల్ల ఇవాళ్టికి వాయిదా పడింది. రోజుకి వెయ్యి చోప్పున టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. వారిని రేపటి నుంచి దర్శనానికి అనుమతించనుంది. ఇవాళ తిరుపతిలో ఎల్లుండికి సర్వదర్శన టోకెన్లు జారీ చేయనుంది. ఎల్లుండి శ్రీవారి…
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవడానికి దేశ,విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు ఘాట్ రోడ్డు ద్వారా తిరుమలకు చేరుకుంటుండగా, నడక మార్గం భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే అత్యంత ప్రాచీనమైన శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ఇప్పట్లో కష్టాలు తీరేలా లేవు. కలియుగ శ్రీనివాసుడు పై అపారమైన భక్తిభావంతో గోవిందనామాలు స్మరించుకుంటూ మొక్కుబడిగా మెట్టుమెట్టుకు నమస్కరించుకుంటూ వేల సంఖ్యలో భక్తులు పురాతన మార్గమైన నడకదారిలో…
శ్రీవారి భక్తులకు టీటీడీ (Tirumala Tirupati Devasthanams) మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్దరిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతిరోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నారు. శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 10 గంటలకు, శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా ప్రత్యేక దర్శనాలను(Special Darshan) టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే.…
కరోనా మహమ్మారి విజృంభణతో భక్తులకు దూరమైన సేవలను, దర్శనాలను క్రమంగా పునరుద్ధరిస్తూ వస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)… కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా వికలాంగులు, వయో వృద్ధులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేసిన టీటీడీ.. మళ్లీ పునరుద్ధరించాలని నిర్ణయానికి వచ్చారు.. అందులో భాగంగా వికలాంగులు, వయో వృద్ధులకు శుభవార్త చెప్పింది.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు, వికలాంగుల దర్శనాలను పునరుద్ధరిస్తున్నట్టు వెల్లడించింది.. వచ్చే నెల 1వ తేదీ నుంచి రోజుకీ 1,000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక…
కరోనా మహమ్మారి కారణంగా శ్రీవారిని దర్శించుకోవడం భక్తులకు కష్టంగా మారింది.. ఆ తర్వాత పరిస్థితులు అన్నీ అదుపులోకి రావడంతో.. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్యను క్రమంగా పెంచుతూ వస్తోంది టీటీడీ.. సాధారణ రోజుల్లో మాదిరిగానే ప్రస్తుతం రోజుకు దాదాపు 70వేల మందికి పైగా భక్తులు నిత్యం శ్రీవారిని దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సిఫార్సులు, ఆన్లైన్ సేవలు, శ్రీవాణి ట్రస్ట్, టీటీడీ ఛైర్మన్, పాలక మండలి కోటాలో ప్రతిరోజూ టోకెన్లు జారీ చేస్తోంది టీటీడీ..…
కలియుగ వైకుంఠం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 50 వేలమందికి పైగానే దర్శనాలు చేసుకుంటున్నారు. దీంతో ఘాట్ రోడ్లు భక్తుల వాహనాలతో బిజీఅయిపోతున్నాయి. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. హఠాత్తుగా ఓ కారులో మంటలు వ్యాపించాయి. క్షణాల్లోనే ఆ కారు అగ్నికి ఆహుతైంది. కర్నూలుకు చెందిన భక్తులు కారులో తిరుమల కొండపైకి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. రెండో ఘాట్ రోడ్డు ఆఖరి మలుపు వద్ద కారులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.…
అనంతపురం జిల్లాకు రానున్న మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీతారామమూర్తి. విజయనగర న్యాయకళాశాలలో జరిగే విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొననున్న ఛైర్మన్. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు. కర్నూలు ఎస్టీ బీసీ కళాశాల మైదానంలో అఖండ సినిమా శత దినోత్సవ వేడుక. హాజరుకానున్న హీరో బాలకృష్ణ, చిత్ర యూనిట్ సభ్యులు నేడు శ్రీశైలంలో అరుద్రోత్సవం సందర్భంగా మల్లికార్జునస్వామికి…
కరోనా మహమ్మారి విజృంభణ ప్రభావం శ్రీవారి దర్శనాలపైనే కాదు.. ఆర్జిత సేవలు సహా వివిధ సేవా కార్యక్రమాలపై కూడా పడింది.. అయితే, క్రమంగా కరోనా కేసులు తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం.. శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి ఆర్జిత సేవలు తిరిగి ప్రారంభించనుంది.. ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ,…