TTD: భక్తులకు శుభవార్త.. ఆర్జితసేవా టిక్కెట్లు రేపే విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రేపు ఆన్ లైన్ లో సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. మొత్తం 46470 సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చెస్తామని టీటీడీ తెలిపింది. లక్కీ డిప్ విధానంలో 8070 టిక్కెట్లు, ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపాదికన 38,400 టికెట్లను విడుదల చెయ్యనుంది. సుప్రభాతం,తోమాల,అర్చన,అష్టదళ పాద పద్మారాధన సేవా టిక్కెట్లను లక్కీ డిప్ విధానంలో కేటాయించనుంది టీటీడీ.
మరో వైపు తిరుమల కొండకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఇవాళ 28 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,597 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 37,759 మంది. హుండీ ఆదాయం రూ.4.47 కోట్లుగా టీటీడీ తెలిపింది. ఇదిలా వుంటే.. దేశవిదేశాల్లోనూ శ్రీవారి కల్యాణాలు కనుల పండువగా సాగుతున్నాయి. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు.
Also Read
- CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
- Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
- Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
- CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖపట్నం ఎంపి ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఐ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వై ఎస్ ఆర్ జిల్లా జెడ్ పి చైర్మన్ అమర్నాథ రెడ్డి, తెలుగుభాషా సంఘం చైర్మన్ యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఉత్తర అమెరికా లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, ప్రతాప్ భీమ్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ మేడపాటి వెంకట్, నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, రఘువీర్ బండారు, రమేష్ వల్లూరు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Dalbir Kaur: సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్నుమూత
- Tags
- america
- ap
- Dallas
- kalyanam
- seva tickets
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!