TTD: భక్తులకు శుభవార్త.. ఆర్జితసేవా టిక్కెట్లు రేపే విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. రేపు ఆన్ లైన్ లో సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. మొత్తం 46470 సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చెస్తామని టీటీడీ తెలిపింది. లక్కీ డిప్ విధానంలో 8070 టిక్కెట్లు, ముందు వచ్చినవారికి ముందు ప్రాతిపాదికన 38,400 టికెట్లను విడుదల చెయ్యనుంది. సుప్రభాతం,తోమాల,అర్చన,అష్టదళ పాద పద్మారాధన సేవా టిక్కెట్లను లక్కీ డిప్ విధానంలో కేటాయించనుంది టీటీడీ.
మరో వైపు తిరుమల కొండకు భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. ఇవాళ 28 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు. సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 76,597 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తులు 37,759 మంది. హుండీ ఆదాయం రూ.4.47 కోట్లుగా టీటీడీ తెలిపింది. ఇదిలా వుంటే.. దేశవిదేశాల్లోనూ శ్రీవారి కల్యాణాలు కనుల పండువగా సాగుతున్నాయి. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీనివాస కళ్యాణాల్లో భాగంగా భారతీయ కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున డల్లాస్ నగరంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించి తరించారు.
Also Read
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
- Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
కళ్యాణోత్స క్రతువులో భాగంగా పుణ్యహవచనం, విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ,మహా సంకల్పం, కన్యాదానం, మాంగల్యధారణ, వారణ మాయిరం, హారతితో అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించారు. డల్లాస్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు, విశాఖపట్నం ఎంపి ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ఎన్ ఆర్ ఐ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు వై ఎస్ ఆర్ జిల్లా జెడ్ పి చైర్మన్ అమర్నాథ రెడ్డి, తెలుగుభాషా సంఘం చైర్మన్ యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్, ఉత్తర అమెరికా లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రత్నాకర్, ప్రతాప్ భీమ్ రెడ్డి, ఏపీ ఎన్నార్టీ చైర్మన్ మేడపాటి వెంకట్, నాటా అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, రఘువీర్ బండారు, రమేష్ వల్లూరు, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Dalbir Kaur: సరబ్జిత్ సింగ్ సోదరి దల్బీర్ కౌర్ కన్నుమూత
- Tags
- america
- ap
- Dallas
- kalyanam
- seva tickets
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!