తిరుమలలో స్వామి వారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపేశారు.. దీంతో, హిందూ మనోభావాలను కించ పరుస్తున్నారు.. వేంకటేశ్వర స్వామి భక్తుల హృదయాలు గాయపడుతున్నాయని మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. నెల్లూరులో బీజేపీ రాష్ట్ర కార్యవర్గా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయన్నారు. కర్నూల్ జిల్లా ఆత్మకూరు, శ్రీశైలంలో, కాకినాడ జేఎన్టీయూలో, ఎమ్మెల్యే ద్వారంపూడి సహకారంతో మసీదు నిర్మాణం లాంటి పరిణామాలు చూస్తే ప్రభుత్వ తీరు అర్థం అవుతుందన్నారు.…
హనుమాన్ జయంతి వేడుకల్ని తిరుమలలో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి అలయం ఎదుట ఉన్న బేడీ అంజనేయ స్వామి అలయం..ఆకాశగంగ తీర్ధంలో వున్న బాలహనుమాన్ దేవాలయాలలో టీటీడీ…జపాలిలో కొలువైన భక్తాంజనేయస్వామి ఆలయంలో దేవాదాయశాఖ…ధర్మగిరి వద్ద వున్న ఆభయ ఆంజీనేయస్వామి ఆలయంలో తిరుమల స్ధానికులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. టీటీడీ తరపున ఆలయ అధికారులు బాలహనుమాన్ తో పాటు జపాలి హనుమంతుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామదూతగా… సేవాతత్పరుడిగా…అఖండబలశాలైన హనుమంతుడిని పూజించని వారుండరంటే అతిశయోక్తికాదు.అంజనీ తనయుడి జయంతి వేడుకల్ని తిరుమల కొండ…
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం.. ఆగస్టు నెలకు సంబంధించిన అన్ని టికెట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.. ఆన్లైన్లో టికెట్ల బుకింగ్కు భారీ డిమాండ్ ఉండగా.. నిమిషాల వ్యవధిలోనే అని టికెట్లు బుక్అవుతున్న విషయం తెలిసిందే.. ఇక, ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్లను రేపు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల కాబోతున్నాయి.. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టిక్కెట్లను కూడా రేపే విడుదల చేయనుంది…
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ అందించింది. జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను మే 21న ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్లో ముందస్తుగా దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది. GVL Narasimha Rao: విజయవాడ- ఢిల్లీ విమానాలు పెంచాలి మరోవైపు వేసవిలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జూన్ 30 వరకు అష్టదళపాద…
తిరుమలలో స్వధర్మ వాహిని ట్రస్ట్ లోగో ఆవిష్కరించారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలో హిందూ ధార్మిక ప్రచారానికి కొత్త ఒరవడి సృష్టించాలన్నారు స్వామీజీ. తెలుగు రాష్ర్టాలలోని హరిజన,గిరిజన వాడలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని గట్టిగా నిర్వహించాలన్నారు. హరిజన, గిరిజన వాడలలో ఇతర మతస్థులు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. స్వధర్మ వాహిని ద్వారా తెలుగు రాష్ర్టాలలో….అటు తరువాత దక్షిణాది రాష్ట్రాలలో హిందూ ధార్మిక ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు స్వరూపానంద స్వామీజీ. టీటీడీకి విశాఖ పీఠానికి…
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతర…
కలియుగ వైకుంఠం తిరుమలలో ఇకనుంచి సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. సామాన్య భక్తులుకు దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చేలా శుక్ర,శని,ఆదివారాలలో సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని ఆయన తెలిపారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం అన్నారు. భక్తులు సౌకర్యార్ధం యాత్రికులు వసతి సముదాయంలో అన్నప్రసాద వితరణ పున:ప్రారంభించాం. ఏప్రిల్ 24వ తేది నుంచి వయోవృద్దులు,వికలాంగులుకు ప్రత్యేక దర్శనాలు ప్రారంభించాం అని ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి…
ఎస్వీ వేదిక్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ సుదర్శన శర్మ పై వేటు వేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్దంగా ఇప్పటికే మూడు పర్యాయాలు వైస్ ఛాన్సలర్ గా కొనసాగారు సుదర్శన శర్మ. ఎట్టకేలకు ఆయనపై వేటు వేసింది. గత ఏడాది నవంబర్ లోనే వీసీ సుదర్శన శర్మ పదవీకాలం ముగిసింది. ఇన్ ఛార్జి వైస్ ఛాన్సలర్ నిబంధనలకు వ్యతిరేకంగా పదవిలో కొనసాగారు సుదర్శనశర్మ. నూతన వైస్ ఛాన్సలర్ నియామకం జరగకుండా సేర్చ్ కమిటీకి సుదర్శనశర్మ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు…