Minister AppalaRaju: తిరుమలలో అనుచరులతో మంత్రి హల్ చల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు నిత్యం వార్తల్లో వుంటుంటారు. గతంలో అనేకసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు మంత్రి అప్పలరాజు. తాజాగా మంత్రి అప్పలరాజు కలియుగ వైకుంఠం తిరుమలలో హల్ చల్ చేశారు. భారీగా అనుచరులతో తిరుమల చేరుకున్నారు మంత్రి అప్పలరాజు. తన అనుచరులందరికి ప్రోటోకాల్ దర్శనం కల్పించాలటూ టీటీడీ అధికారులపై వత్తిడి తెచ్చారు. అసలే మంత్రి.. ఆయన వత్తిడికి టీటీడీ తలొగ్గాల్పిందే మరి. అప్పలరాజు ఒత్తిడితో టీటీడీ అధికారులు తలవంచకతప్పలేదు. నిబంధనలు ప్రక్కన పెట్టి 140 మంది అనుచర వర్గానికి ప్రోటోకాల్ దర్శన కల్పించింది టీటీడీ. నిబంధనల ఉల్లంఘనపై సామాన్య భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మంత్రివర్గంలో రెండవసారి మంత్రి పదవి పొందారు సీదిరి అప్పలరాజు.

Also Read
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
- Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
గతంలోనూ జగన్ పర్యటనలో శారదా పీఠం దగ్గర పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన సందర్భాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో శారదాపీఠంలో సీఎం జగన్ పర్యటించారు. జగన్ విశాఖ పర్యటన సందర్బంగా పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు శారదాపీఠం ద్వారం వద్ద పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి తన అనుచరులతో కలిసి చినముషిడివాడలోని శారదా పీఠం వార్షిక మహోత్సవానికి హాజరయ్యారు. అప్పటికి ఇంకా సీఎం జగన్ రాలేదు. మంత్రి అప్పలరాజు పీఠం ముఖద్వారం నుంచి లోపలికి వెళ్లేటప్పుడు ఆయనతో పాటు ఉన్న పలాస పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ పూర్ణచంద్రరావు, ఆయన అనుచరులను సీఐ రాజుల్ నాయుడు అడ్డుకున్నారు. దీంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు.
సీఐపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. చేయి వేసి ముందుకు తోశారు. అక్కడ కొద్దిపాటు వివాదం చెలరేగింది. అనంతరం ఆ సీఐని వీఆర్ కి పంపారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు కొన్ని నిబంధనలు పాటిస్తారని, ఎక్కువమంది అనుచరులతో వచ్చిన మంత్రిని సీఐ అడ్డుకున్నారని పోలీసులు అన్నారు. ఈ విషయంలో మంత్రిని క్షమాపణ చెప్పాలని పోలీసు అధికారులే కోరారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని మంత్రి సీదిరి అప్పలరాజు పరుష పదజాలంతో దుర్భాషలాడి.. దౌర్జన్యం చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ఖండించింది.
అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. తాజాగా మంత్రి అంతమంది అనుచరులతో తిరుమలకు రావడం, వారికి ప్రోటోకాల్ దర్శనం కోసం పట్టుబట్టి టీటీడీపై వత్తిడి తేవడం ఏంటని భక్తులు మండిపడుతున్నారు. దీనిపై టీటీడీ అధికారులేమంటారో చూడాలి. తిరుమలకు నిత్యం 70 నుంచి 80 వేలమంది భక్తులు వస్తుంటారు. రాజకీయ వత్తిడుల వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడతారనే వాదన వినిపిస్తోంది.
Gold Rates Today: స్వల్పంగా తగ్గిన పసిడి.. హైదరాబాద్లో ఎంతంటే..?
తాజావార్తలు
-
RJ Balaji: థియేటర్లో త్రిషను హగ్ చేసుకుని ఏడ్చేసిన RJ బాలాజీ.. వీడియో వైరల్
-
Moto G37 Power, Moto G37: మోటో జి37 పవర్, మోటో జి37 రిలీజ్ డేట్ ఫిక్స్.. డైమెన్సిటీ 6400, 7,000mAh భారీ బ్యాటరీ
-
Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
-
Peddi : ‘పెద్ది’ కోసం జాన్వీ రిస్క్..
-
Best Flour for Roti: ఏ పిండి రొట్టె ఆరోగ్యానికి మంచిది..? గోధుమ, రాగి, జొన్నల్లో సరైన ఎంపిక ఏది..?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..