ట్రంప్ అన్నట్టుగానే మరొక దేశంపై సైనిక దాడి ప్రారంభించారు. తాజాగా మెక్సికోపై దాడి చేస్తున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. మెక్సికోలో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత శనివారం వెనిజులాను స్వాధీనం చేసుకోగా.. ఇప్పుడు గ్రీన్ల్యాండ్పైన కన్నేశారు. ఇప్పటికే గ్రీన్ల్యాండ్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారో.. లేదో వెనిజులా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు వాణిజ్య యుద్ధంతో ఇంకొన్ని దేశాలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ మధ్య పదే పదే ట్రంప్ మాట్లాడుతూ తాను సంతోషంగా లేనని ప్రధాని మోడీకి తెలుసు అని చెప్పుకుంటూ వస్తున్నారు. గత ఏడాదంతా వాణిజ్య యుద్ధంతో ప్రపంచ దేశాలపై ట్రంప్ యుద్ధం చేయగా.. ఈ ఏడాది అందుకు భిన్నంగా వెళ్తున్నారు.
అమెరికాలో దారుణం జరిగింది. ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు మారణహోమం సృష్టించారు. వలసదారులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
వెనిజులాకు ట్రంప్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. తక్షణమే చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
వెనిజులా చమురుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మార్కెట్ ధరకే వెనిజులా నుంచి 30 మిలియన్ల నుంచి 50 మిలియన్ల బ్యారెళ్ల చమురు కొనుగోలు చేస్తామని తెలిపారు. చమురు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రెండు దేశాల ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని తెలిపారు.
ప్రధాని మోడీతో సంబంధాలపై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు కారణంగా ప్రధాని మోడీ తనతో అంత సంతోషంగా లేరని.. తాను మాత్రం మోడీతో బాగానే ఉన్నానని పేర్కొన్నారు.
గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. అనంతరం పాకిస్థాన్పై ప్రతీకారంగా మే 7న భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దాదాపు నాలుగు రోజులు తర్వాత కాల్పుల విరమణ జరిగింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో 100 మంది ఉగ్రవాదులు చనిపోగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు దెబ్బతిన్నాయి.
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంపై ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత మారియా మచాడో హర్షం వ్యక్తం చేసింది.