Pakistan: పాకిస్తాన్ భారీ దాడి.. 400 మందికి పైగా మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆఫ్ఘానిస్తాన్పై పాకిస్తాన్ భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కాబూల్లోని ఒక రిహాబిటేషన్ ఆస్పత్రిపై దాడులు చేసింది. ఈ ఘటనలో 400 మందికి పైగా మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాత్ మంగళవారం తెల్లవారుజామున తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స చేసే ఆస్పత్రిపై పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. సోమవారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ దాడిలో ఆస్పత్రిలోని చాలా భాగాలు నాశనమయ్యాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 400 మంది మరణించారని, దాదాపు 250 మంది గాయపడ్డారని ఆయన అన్నారు. భవనంలో మంటలను అదుపు చేయడానికి మరియు శిథిలాల నుండి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయని ఫిత్రాత్ తెలిపారు.
అయితే.. కాబూల్, తూర్పు ఆఫ్ఘనిస్తాన్ లలో జరిపిన దాడుల్లో తాము పౌరుల్ని లక్ష్యంగా చేసుకోలేదని, ఏ ఆస్పత్రిపై దాడులు చేయలేదని పాకిస్తాన్ పేర్కొంది. ఆఫ్ఘాన్పై జరిగిన ఈ దాడిని తాలిబాన్ అధికారులు తీవ్రంగా ఖండించారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారే ఉన్నారని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. స్థానిక టెలివిజన్ ఆస్పత్రి శిథిలాల నుంచి వెలువడుతున్న మంటల్ని చూపించింది.
Also Read
- Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
- Trump: యుద్ధంపై ట్రంప్ మరోసారి కీలక ప్రకటన.. ఇరాన్ రియాక్షన్ ఇదే!
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- Sheikh Hasina: షేక్ హసీనా వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు.. బంగ్లాదేశ్కు స్పష్టం చేసిన భారత్..
Read Also: Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్తో 24 లక్షలు ఫట్..!
ఆఫ్ఘాన్ చేస్తున్న వాదనల్ని పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. తాము ఏ పౌరస్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని చెప్పింది. ఈ ఆరోపణల్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రతినిధి మోషారఫ్ జైదీ తోసిపుచ్చారు. తాము సైనిక, ఉగ్రవాద మద్దతు కలిగిన మౌలిక సదుపాయాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ను చాలా జాగ్రత్తగా నిర్వహించిట్లు పాక్ మంత్రిత్వ శాఖ చెప్పింది.
పాకిస్తాన్, ఆఫ్ఘన్ దళాలు తమ సరిహద్దులో కాల్పులు జరిపాయని ఆఫ్ఘన్ అధికారులు చెప్పిన కొన్ని గంటల తర్వాత ఆరోపించిన వైమానిక దాడి జరిగింది. పాకిస్తాన్ నుంచి రాత్రిపూట మోర్టార్ షెల్స్తో ఆగ్నేయ ఖోస్ట్ ప్రావిన్సులోని గ్రామాలపై దాడి చేశారని, ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించినట్లు ఆఫ్ఘాన్ ఆరోపించింది. రెండు దేశాల సరిహద్దు ‘‘డ్యూరాండ్ లైన్’’ వద్ద పోరాటం తీవ్రమైంది. పాకిస్తాన్ లోపల దాడి చేస్తున్న పాకిస్తాన్ తాలిబన్లతో సహా అనేక ఉగ్రవాద గ్రూపులకు ఆఫ్ఘాన్లోని తాలిబాన్ ప్రభుత్వం సహకరిస్తుందని పాకిస్తాన్ ఆరోపించింది. అయితే, ఆఫ్ఘాన్ పాక్ ఆరోపణల్ని ఖండించింది.
BREAKING: More videos from tonight's Pakistani airstrikes which hit a drug rehabilitation hospital in Kabul, killing or wounding an unspecified number of people, according to an Afghan Taliban spokesperson.
Pakistan’s government rejects this, claiming they targeted "military… pic.twitter.com/GtRmnicTLW
— Yalda Hakim (@SkyYaldaHakim) March 16, 2026
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!