Al-Aqsa Mosque: రంజాన్ మాసంలో పవిత్ర ‘‘అల్-అక్సా మసీదు’’ మూసివేత.. ముస్లిం దేశాల ఆగ్రహం..
- రంజాన్ మాసంలో ‘‘అల్-అక్సా’’ మసీదు క్లోజ్..
- ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ నిర్ణయం..
- ఇజ్రాయిల్పై ముస్లిం దేశాల ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Al-Aqsa Mosque: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్ గత 16 రోజులుగా ముస్లింలకు పవిత్రమైన మసీదుల్లో ఒకటైన ‘‘అల్ అక్సా మసీదు’’ను మూసేసింది. రంజాన్ మాసంలో ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నాయి. రంజాన్ సందర్భంగా మసీదు మూసివేయాలని ఇజ్రాయిల్ తీసుకున్న నిర్ణయంపై అరబ్ దేశాల కూటమి ‘‘అరబ్ లీగ్’’ ఆదివారం తీవ్రంగా విమర్శించింది.
ముస్లింల ప్రార్థనా స్థలాలను మూసేసి, అక్కడ ప్రార్థనలు చేయకుండా చేసే హక్కు ఇజ్రాయిల్కు లేదని అరబ్ లీగ్ పేర్కొంది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఇజ్రాయిల్ చర్యలు ప్రాంతీయ, ప్రపంచశాంతి, భద్రతలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పింది. జెరూసలేం పవిత్ర స్థలాలపై ఇజ్రాయిల్ చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలను ఆపాలని, ఇజ్రాయిల్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ లీగ్ ప్రపంచదేశాలను విజ్ఞప్తి చేసింది. ఆరాధనా స్వేచ్ఛను గౌరవించేలా దేశాలు చూసుకోవాలని అరబ్ లీగ్ పిలుపునిచ్చింది.
Also Read
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
- China halts J10CE Delivery: భారత్ రఫేల్పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
Read Also: Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?
అరబ్ లీగ్తో పాటు అనేక సంస్థలు, దేశాలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఖతార్, జోర్డాన్, ఇండోనేషియా, టర్కీ, పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా ఎనిమిది అరబ్-ఇస్లామిక్ దేశాలు మసీదు మూసివేతను సంయుక్తంగా ఖండించాయి.ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC), ముస్లిం వరల్డ్ లీగ్ (MWL), అల్-అజార్, ఆఫ్రికన్ యూనియన్, అరబ్ పార్లమెంట్ కూడా ఇజ్రాయిల్ నిర్ణయంపై మండిపడుతున్నాయి. ఇది ప్రార్థనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి. 1967 తర్వాత, ఇలా ఇన్ని రోజులు మసీదును మూసేయడాన్ని పాలస్తీనియన్ అథారిటీ ఖండించింది. హమాస్ దీనిని ‘‘యుద్ధ ప్రకటన’’గా అభివర్ణంచింది.
ఫిబ్రవరి 28న ఇరాన్తో మొదలైన యుద్ధంతో ఆక్రమిత జెరూసలేంలోని అల్ అక్సా మసీదును ఇజ్రాయిల్ మూసేసిన సమయంలో అరబ్ లీగ్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లోని ఇబ్రహీమి మసీదులో కేవలం 50 మంది మాత్రమే ప్రార్థన చేయడానికి అనుమతిస్తున్నారు. 1967లో ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంను ఆక్రమించినప్పటి నుండి ఇది అతి పొడవైన రంజాన్ షట్డౌన్గా మారింది. భద్రతా కారణాలు, ఇరాన్ నుంచి క్షిపణి దాడులు జరుగాయనే కారణంతోనే మూసివేసినట్లు ఇజ్రాయిల్ చెబుతోంది.
తాజావార్తలు
-
Delimitation: దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే నిర్ణయం.. డీలిమిటేషన్పై కేంద్రం ఫోకస్
-
Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
-
LPG Users Alert: ఎల్పీజీ వినియోగదారులకు షాక్.. మారిన గ్యాస్ నిబంధనలు..
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!