మధ్యప్రాచ్యంలో మరో భీకర యుద్ధం జరగబోతుందా? సుదీర్ఘ కాలం ఉద్రిక్తలు తలెత్తబోతున్నాయా? క్షిపణి, రాకెట్, డ్రోన్ దాడులతో దద్దరిల్లబోతుందా? అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
మధ్యప్రాచ్యంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన రెండో విడత అణు చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో రెండు దేశాల మధ్య సవాళ్లు-ప్రతి సవాళ్లు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ సెక్స్ స్కామ్కు సంబంధించిన ఎప్స్టీన్ ఫైల్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా రక్షణ శాఖ పత్రాలను విడుదల చేస్తోంది. ఈ పత్రాల్లో ఇప్పటికే అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. బిల్ క్లింటన్, బిల్ గేట్స్, డెమొక్రాటిక్ నేతల సహా ఎందరో ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ప్రపంచ అధినేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య మంగళవారం కీలక చర్చలు జరగనున్నాయి. మరోసారి అణు ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఇరు దేశాల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య అణు చర్చల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పాలన మార్పు ఉత్తమ చర్యగా స్పష్టం చేశారు. నార్త్ కరోలినాలో అమెరికా దళాలను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు.
ఇరాన్-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధపడుతున్నట్లు కనిపిస్తోంది. భారీ స్థాయిలో అమెరికా సైన్యం మోహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక అరేబియా సముద్రంలో మోహరించింది.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అగ్ర రాజ్యంలో పర్యటన ఆసక్తి రేపుతోంది. బుధవారం వైట్హౌస్లో 3 గంటల పాటు ట్రంప్-నెతన్యాహు రహస్యంగా సమావేశం అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
భారత్-అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందంపై అధికారికంగా ముసాయిదా విడుదలైంది. ఒప్పందంపై ఫ్రేమ్వర్క్కు రెండు దేశాలు అంగీకారం తెల్పాయి. ఇక రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై విధించిన 25 శాతం సుంకాన్ని ట్రంప్ ఎత్తేశారు. సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తూ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
బరాక్ ఒబామా.. రెండు పర్యాయలు అగ్ర రాజ్యం అమెరికాను పరిపాలించిన అధ్యక్షుడు. ప్రపంచ దేశాలతో మంచి సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు పొందారు. అలాంటి నేతపై ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుచిత చర్యకు పాల్పడ్డారు.
భారత్-అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. గత వారం భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చుతోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంపై తాత్కాలిక ముసాయిదాను అమెరికా విడుదల చేసింది.