అమెరికా-ఇరాన్ మధ్య వార్నింగ్ల పరంపర కొనసాగుతోంది. మొన్నటిదాకా ట్రంప్ పదే పదే ఇరాన్ను హెచ్చరిస్తూ వచ్చారు. ఇప్పుడు అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డిసెంబర్ 28 నుంచి పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
గ్రీన్లాండ్ విషయంలో మిత్ర దేశాల మధ్య రగడ మొదలైటట్టు కనిపిస్తోంది. గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో ట్రంప్ కలలు కంటున్నారు. ప్రస్తుతం ఆ ఒత్తిడి మరింత పెంచుతున్నట్లు కనిపిస్తోంది.
నిన్నామొన్నటి దాకా ఇరాన్ను పదే పదే అధ్యక్షుడు ట్రంప్ బెదిరిస్తూనే ఉన్నారు. నిరసనకారుల్ని చంపడం ఆపకపోతే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇస్తూ వచ్చిన ట్రంప్.. ఇప్పుడు స్వరం మారింది.
వెనిజులా సంక్షోభం తర్వాత వైట్హౌస్లో కీలక సమావేశం జరిగింది. అధ్యక్షుడు ట్రంప్ను వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో కలిశారు. ఈ సందర్భంగా నోబెల్ శాంతి బహుమతిని ట్రంప్కు అందజేశారు.
ఇరాన్పై అమెరికా సైనిక చర్యలకు దిగబోతుందున్న వార్తల నేపథ్యంలో ట్రంప్ హత్యా బెదిరింపులను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ‘‘అప్పుడు బుల్లెట్ మిస్ అయింది.. ఈసారి గురి తప్పదు’’ అంటూ ఇరాన్ టీవీ బహిరంగంగా ప్రసారం చేసింది. అంటే అమెరికా దాడికి దిగితే.. ప్రతి దాడి ఉంటుందని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది.
గత కొద్దిరోజులుగా ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇక భద్రతా దళాల కాల్పుల్లో ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును భారత్లో అమెరికా రాయబారి సెర్గియా గోర్ కలిశారు. ఈ సందర్భంగా రాయబారిగా నియమితులైన పత్రాలను అందజేశారు. సెర్గియో గోర్ నుంచి అక్రిడిటేషన్ పత్రాలను ద్రౌపది ముర్ము స్వీకరించారు.
ఇరాన్లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. నగరాలు రక్తసిక్తంగా మారాయి. వందలాది మంది నిరసనకారులు శవాలు రోడ్లపై పడి ఉన్నాయి. దాదాపు వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
గత కొద్దిరోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు కారణంగా తీవ్ర నష్టాలు చవిచూసింది. గత వారం లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దీంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.