అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన భట్టి విక్రమార్క తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఇందులో ఉద్యోగాల సంఖ్య ఉండదని, నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే ప్రకటిస్తామని తెలిపారు. ఇది కేవలం ప్రకటన మాత్రమేనని దీనిపై చర్చ ఉండదని అసెంబ్లీలో భట్టి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని వివరించారు. గ్రూప్ 2 పరీక్షను ఆగస్టు 7 8 తేదీల్లో…
ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీలో పొంగులేటి ధరణి పై మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది అని విశ్వాసంలో ఉన్నారు ప్రజలు అన్నారు. ధరణి నీ ఐఎల్ ఎఫ్ కంపనీకి అప్పగించారని మండిపడ్డారు. కంపనీ నీ కొన్ని కారణాలతో.. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆగ్రహం…
ఎక్సైజ్శాఖలో సంస్థాగత మార్పులు చేసేలా ఏపీ సర్కార్ చర్యలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ పని తీరు మెరుగు పరిచే విషయమై కసరత్తు చేస్తుంది. స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో- సెబ్ రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులు చేసేలా చర్యలు చేపట్టింది. ఎక్సైజ్ శాఖలో సంస్థాగత మార్పులపై అధ్యయనం చేసేందుకు అంతర్గత కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. 19 మంది సభ్యులతో కూడిన కమిటీని…
5న కలెక్టర్ల కాన్ఫరెన్స్.. వీటిపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కలెక్టర్ల కాన్ఫరెన్స్కు సిద్ధం అవుతున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ నెల 5వ తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.. ఈ సమావేశానికి మంత్రులు హాజరుకానున్నారు.. సచివాలయంలో ఈ నెల ఐదో తేదీన జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణ ఏర్పాట్లపై రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా…
మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చాము.. కంటతడి పెట్టుకున్న సబితారెడ్డి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు గందరగోళంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను విమర్శించారని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి దొంగలా రేవంత్ పారిపోయారని ఆమె మండిపడ్డారు. భట్టి మాటలు బాధకరమని, భట్టి గారు మీ పక్క సీటు ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. మా కర్మకాలి అసెంబ్లీకి వచ్చామని కంటతడి పెట్టుకున్నారు సబితా ఇంద్రారెడ్డి.…
సర్వేపల్లిలో జరిగిన అక్రమాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం.. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట, వీరంపల్లి ప్రాంతాల్లోని పలు పనులను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపఅ హయాంలో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ కు సంబంధించి 200 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగింది అని ఆరోపించారు. ఒక మొక్క కొట్టకుండా.. రోడ్డు వేయకుండానే కోట్ల రూపాయలలో నిధులు స్వాహా…
ఏపీ హైకోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఊరట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కు ఊరట లభించింది. వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలపై గుంటూరులో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసు క్వాష్ చేయాలని పవన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. కేసు విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు మాత్రమే కాకుండా ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని…
రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది.. లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు…
మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండవ స్థానంలో నిలిచిన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర పోలీసులు 2024 జనవరి 1 నుండి 2024 జూలై 25 వరకు 21,193 మొబైల్ పరికరాలను విజయవంతంగా రికవరీ చేసి, దేశంలో రెండవ స్థానంలో నిలిచారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డి ఓ టి) సి ఈ ఐ ఆర్ పోర్టల్ను అభివృద్ధి చేసింది. ఈ పోర్టల్ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించారు. తెలంగాణ…
ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు చిన్నారులు సహా 8 మంది మృతి జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంత్నాగ్ జిల్లా సమీపంలోని సింథాన్-కోకెర్నాగ్ రహదారిపై వాహనం కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. కారులో ఉన్నవాళ్లంతా కిష్త్వార్ నుంచి వస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము రీజియన్లోని కిష్త్వార్ నుంచి వస్తున్న…