2018లో “ఆర్ఆర్ఆర్” సినిమాను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి విడుదల తేదీ హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఇప్పటికే మూడు సార్లు మార్చారు. మొదట్లో 30 జూలై 2020 అన్నారు. ఆ తర్వాత సినిమా 8 జనవరి 2021కి మారింది. ఈ తేదీ నుండి ఇప్పుడు 2021 అక్టోబర్ 13కి మార్చారు. ఇప్పటికి కూడా “ఆర్ఆర్ఆర్” అక్టోబర్ 13న విడుదలవుతుందనే నమ్మకం లేదు.…
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులు శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడు విజయ్. ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో… ఈ సినిమా తర్వాత తన మార్కెట్ బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు దేవరకొండ. దానికి తగినట్లు తన తదుపరి సినిమాలను కూడా పాన్-ఇండియా మార్కెట్ లక్ష్యంగా చేయాలనుకుంటున్నాడట. సుకుమార్తో సినిమా అయితే తెలుగుతో పాటు ఇతర భాషల్లో రూపొందే…
మన హీరోలు ఓటీటీలో సినిమాలు విడుదలపై ఆందోళనకు గురి అవుతున్నట్లు వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలను బట్టి అర్థం అవుతోంది. ఇటీవల నాని తన సినిమా ‘టక్ జగదీశ్’ను థియేటర్ లో విడుదల చేయాలా? లేక ఓటీటీ రిలీజ్ చేయాలా? అనే కన్ఫ్యూజన్ లో క్రాస్ రోడ్స్ లో ఉన్నానని లేఖను విడుదల చేస్తూ తనకు మాత్రం థియేటర్స్ లో విడుదల అంటేనే మక్కువ అని స్పష్టం చేశాడు. అలాగే అంతకు ముందు వెంకటేశ్ నటించిన ‘నారప్ప’…
తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ తెలుగు నిర్మాతలందరినీ అక్టోబర్ వరకూ తమ చిత్రాలను ఓటీటీలో విడుదల చేయవద్దంటూ కొంతకాలం క్రితం కోరింది. కానీ వారి మాటను కాదని ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు ‘నారప్ప’ చిత్రాన్ని ఓటీటీలోనే విడుదల చేశారు. తాజాగా నాని సినిమా ‘టక్ జగదీశ్’ సైతం అతి త్వరలోనే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోందని వార్తలు వచ్చాయి. విశేషం ఏమంటే… నాగ చైతన్య హీరోగా నటించిన ‘లవ్ స్టోరీ’ మూవీని ఆ చిత్ర…
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల బండ్లగణేష్ తాను సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. కానీ తాజాగా ఆయన ఓ వెబ్ సైట్ లో ప్రచురితమైన కథనాన్ని రీ ట్వీట్ చేయడంతో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు కనిపిస్తోంది. అందులో బండ్ల ఒక జర్నలిస్టు సలహా మేరకు ట్విట్టర్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు ఉంది. దీన్ని రీట్వీట్ చేసి ఆ విషయం నిజమేనని బండ్ల గణేష్ నిర్ధారించారు. దీంతో…
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బండ్ల గణేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అనే సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ను దేవుడిగా భావిస్తుంటారు. బండ్ల గణేష్ ఏ కార్యక్రమానికి వెళ్లిన తన దేవుడు పవన్ నామస్మరణ చేస్తూనే ఉంటాడు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్గా ఉంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ…
“వెంకటాద్రి ఎక్స్ప్రెస్”తో 2013లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అప్పటి నుండి ఆమె టాలీవుడ్లోనే కాకుండా అనేక ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో కూడా బిజీ అయిపోయింది. రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు.రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది.…
వెంకటేష్ దగ్గుబాటి డిజిటల్ ప్రపంచంలోకి అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సురేష్ ప్రొడక్షన్స్ సరైన స్క్రిప్ట్ కోసం వేటను ప్రారంభించింది. ఈ వెబ్ డ్రామాలో వెంకటేష్, రానా దగ్గుబాటితో కలిసి పని చేస్తారని టాక్ వినబడుతోంది. ఈ మల్టీస్టారర్ ను ముందుగా హిందీలో చిత్రీకరించి, తరువాత అన్ని భారతీయ భాషల్లోకి డబ్ చేస్తారు. రాబోయే హిందీ వెబ్ డ్రామాను నెట్ఫ్లిక్స్తో కలిసి సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. దీని గురించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడే…
సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం…