కాదేదీ లీకులకు అనర్హం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా అంటే కోట్లతో కూడిన వ్యాపారం! కొన్ని వేల కుటుంబాలకు జీవనాధారం!! అందుకే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతోందంటే థియేటర్లలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ సినిమా సక్సెస్ మీద లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉంటాయి. సక్సెస్ అయితే ఓకే… కానీ మూవీ ఫెయిల్ అయితే మాత్రం కొన్ని వందల కుటుంబాలు రోడ్డున పడిపోయినట్టే. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయిన ఈ సమయంలో సినిమాను మేకింగ్ నుండి థియేటర్ వరకూ జాగ్రత్తగా తీసుకు రావడం నిర్మాతలకు పెద్ద టాస్క్ గా మారిపోయింది. గతంలో థియేటర్ కు వచ్చిన సినిమాలను కొంతమంది పైరసీ చేసేవారు. ఇప్పుడు విడుదలకు ముందే పైరసీ చేసేస్తున్నారు.
స్టార్స్ తో సినిమాలు తీసే నిర్మాతలు తమ కంటెంట్ ను కాపాడుకోవడానికి ఇవాళ చాలా తిప్పలు పడాల్సి వస్తోంది. నిర్మాతలు ప్రచారాస్త్రాలుగా పెట్టుకున్న వాటిని కొందరు కావాలని, మరికొందరు శాడిజమ్ తో లీక్ చేస్తున్నారు. గతంలో ‘బాహుబలి, అత్తారింటికి దారేది’ సినిమాలకు సంబంధించిన విజువల్స్ ఇలానే లీక్ అయ్యాయి. అదే పరిస్థితి మళ్ళీ ఇంతకాలానికి ఇప్పుడు టాలీవుడ్ ను కుదిపేస్తోంది. గత వారం రోజుల నుండి ఏదో ఒక సినిమాకు సంబంధించిన ఫుటేజ్ లీకైపోతోంది. మొన్నటికి మొన్న ‘సర్కారు వారి పాట’ మూవీ బ్లాస్టర్ ను నిర్మాతలు విడుదల చేస్తామని ప్రకటించిన సమయానికి కంటే ముందే సోషల్ మీడియాలో ఎవరో లీక్ చేశారు. పవన్ కల్యాణ్ ‘భీమ్లానాయక్’ టీజర్ ను కొందరు కొన్ని గంటల ముందే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. తాజాగా అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఫైటింగ్ సీన్స్ ను సోషల్ మీడియాలో కొందరు పెట్టేశారు. ఆ మధ్య ‘రాధేశ్యామ్’ సాంగ్ షూటింగ్ జరుగుతుండగా, దానిని సెల్ ఫోన్ లో చిత్రీకరించి, యూనిట్ లోని వ్యక్తులే ఎవరో పోస్ట్ చేశారు. ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ పరిస్థితి కూడా అంతే… ఆ పాట రికార్డింగ్ థియేటర్ నుండే లీకైపోయింది. ఇలా ఫిల్మ్ మేకింగ్ నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకూ కాదేదీ లీకులకు అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది.
Also Read
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ మీట్లో భావోద్వేగానికి గురైన భాగ్యశ్రీ.. 'వాళ్ల ప్రేమే నా అతిపెద్ద అవార్డు'!
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
Read Also : “సర్కారు వారి పాట” తగ్గేదే లే !
స్టార్ హీరోల సినిమాలు ఇలా లీకుల బారిన పడితే, మూవీ మీద ఏర్పడిన క్రేజ్ చప్పున చల్లారిపోతుంది. దాంతో ప్రొడ్యూసర్స్ పోస్ట్ ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టకుండా… ఈ లీకులను ఎలా కంట్రోల్ చేయాలా అని బుర్ర బద్దులు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల పరిస్థితి అలానే అయ్యింది. లీకులకు గురైన ‘పుష్ప, సర్కారు వారి పాట’ చిత్రాలను వారే నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన కంటెంట్ లీక్ అయ్యిందని తెలియగానే, సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ దృష్టికి దానిని తీసుకెళ్ళారు. దయచేసి సినిమా లీక్ ఫుటేజీలను ఫార్వర్డ్ చేయవద్దని, లీకులను ఎంకరేజ్ చేయవద్దని ప్రజలను కోరుతున్నారు.
చిత్రం ఏమంటే… ఆ మధ్య కృతీసనన్ నటించిన హిందీ చిత్రం ‘మిమి’ అధికారికంగా విడుదల కావాల్సిన దానికంటే నాలుగు రోజుల ముందే సోషల్ మీడియాలో లీకైపోయింది. దాంతో గత్యంతరం లేక ఓటీటీ సంస్థ దాన్ని ముందే స్ట్రీమింగ్ చేసేసింది. ఇటీవల ‘నారప్ప’ సినిమా నిర్మాతల్లో ఒకరైన కలైపులి ఎస్. థాను పైరసీ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా తొలి కాపీని సిద్ధం చేసుకుని తమ దగ్గర ఉంచుకోవడానికి భయపడుతున్నామని, థియేటర్లు తెరచుకుని, జనం వచ్చే వరకూ కంటెంట్ పైరసీకి గురి కాకుండా భద్రపరచడం పెద్ద టాస్క్ గా మారిందని అన్నారు. ‘నారప్ప’ మూవీని ఓటీటీలో విడుదల చేయడానికి ఇది కూడా ఓ కారణమే అని చెప్పారు. కరోనా కారణంగా సినిమాల విడుదలలో జరుగుతున్న తీవ్ర జాప్యం కూడా ఇలాంటి లీకులకు ఆస్కారం ఇస్తోంది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టంలో ఇటీవల కీలకమైన సవరణలు చేసింది. సినిమా కంటెంట్ ను లీక్ చేసే వారికి కూడా ఆ చట్టం వర్తించేలా చేస్తే కొంతలో కొంత భయం అనేది ఏర్పడుతుంది. ఆకతాయి తనంతోనో, తెలిసో తెలియకో ఇలాంటి పనులు చేసే వారు కఠిన చట్టాలకు భయపడి అయినా ఇలాంటి పిచ్చి పనులకు దూరంగా ఉంటారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!