కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆగస్ట్ లో సినిమాలు థియేటర్లలో విడుదల కావడం మొదలైంది. ఆ నెలలో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’, ‘రాజ రాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాలను ప్రేక్షకులు కాస్తంత ఆదరించారు. అయితే…. అసలైన ఊపు సెప్టెంబర్ మాసంలో వచ్చిందని చెప్పాలి. ఈ నెలలో అనువాద చిత్రాలతో కలిసి ఏకంగా 31 సినిమాలు జనం ముందుకు వచ్చాయి. ఇందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు 20 కాగా, వివిధ భాషల…
ఈ నెల 10న జరుగబోతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి బరిలోకి దిగుతానని చెప్పిన బండ్ల గణేశ్… ఆ ప్యానెల్ నుండి జీవితా రాజశేఖర్ జనరల్ సెక్రటరీ అభ్యర్థిగా నిలబడటంతో కినుక వహించాడు. అంతేకాదు… ఆ ప్యానెల్ నుండి బయటకు వచ్చేసి, స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తానని చెప్పాడు. అన్నమాట ప్రకారం… సెప్టెంబర్ 27న ప్రధాన కార్యదర్శి పదవికి నామినేషన్ వేశాడు.…
రాజమండ్రి హోమియోపతి మెడికల్ కళాశాలలో అల్లు రామలింగయ్య విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్ల్లాడుతూ.. నటుడిగా తాను జన్మించింది రాజమండ్రిలోనేనని.. తన మొదటి మూడు సినిమాలు రాజమండ్రి ప్రాంతంలో చిత్రీకరణ జరిగాయని వెల్లడించారు. తనది అల్లు రామలింగయ్యగారిది గురు – శిష్యుల సంబంధమన్నారు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తనకు కడుపులో మంట వచ్చేదని… ఎన్ని యాంటాసిడ్లు వాడినా కడుపులో మంట తగ్గలేదన్నారు. అల్లు రామలింగయ్యగారు ఒకసారి ఇచ్చిన హోమియో మందుతో నొప్పి…
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ను తెలుగు సినిమా నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డీవివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై నిర్మాతలు పవన్తో చర్చించారు. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్నది. సినిమా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాతలు రంగంలోకి దిగారు.…
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాటల మంటలు రేపారు.. సినిమా సమస్యలతోపాటు రాజకీయ అంశాలను లేవనెత్తారు. వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ సంధించిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ మంత్రులు, నేతలు, సానుభూతి పరులు రంగంలోకి దిగారు. ప్రతీగా జనసైనికులు సైతం నిరసనలకు దిగడంతో తెలుగు రాజకీయం రంజుగా సాగింది. దీంతో జనసేన వర్సెస్…
ట్రాజెడీ, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్… ఇలా సినిమాల్లో పలు తెగలు ఉన్నాయి. అయితే అన్నీ కలిపి రెండే రెండుగా విభజించారు. అవే సుఖాంతం, దుఃఖాంతం. బాధతో ముగింపు కనిపించే ఏ సినిమా అయినా ట్రాజెడీయే. ఇక సంతోషంగా ముగిసే ఏ చిత్రమైనా హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ చివరలో మరణిస్తే అది ట్రాజెడీయే, హీరో, హీరోయిన్ కలుసుకోక పోయినా దానినీ విషాదాంతం అనే చెప్పాలి. ఇలా సినిమా తొలినుంచీ సాగుతూ, ప్రేక్షకుల ముందు…
అక్టోబర్ లో బాక్స్ ఆఫీస్ పండగ జరగబోతోంది. ఈ రోజు మొదలుకుని దసరా బరిలో ఫైట్ కు వరుస సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ దసరాకు బాక్స్ ఆఫీస్ వార్ గట్టిగానే జరగబోతోంది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ తరువాత తెలుగు రాష్ట్రాలలో ఎగ్జిబిషన్ పరిశ్రమ తిరిగి ట్రాక్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్ని రికార్డు స్థాయిలో కలెక్షన్లను కూడా రాబట్టాయి. ఆంధ్రప్రదేశ్లో టికెట్ ధరల సమస్య అడ్డంకిగా ఉన్నప్పటికీ టాలీవుడ్…
మన సొసైటీలో ఓ జంట విడిపోతే భార్యకు భర్త భరణం ఇవ్వాల్సి ఉంటుంది. అసలు పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు నమ్మకంతో చేసుకునేది. వారికి వారి కుటుంబాల అండ దండ అదనపు బలంగా ఉంటాయి. అయినా ఎన్నో జంటలు ఆ నమ్మకాలను నిలుపుకోలేక విడిపోతుంటారు. అలా విడిపోయినపుడే భార్య భరణం కోరుతుంది. భర్తకు ఉన్న ఆస్తిని బట్టి తను చెల్లించటానికి ఒప్పుకుంటాడు. అయితే పెళ్ళి పెటాకులు అయినా తర్వాత భరణం వంటివి కోరకూడదని పెళ్ళికి…
హైదరాబాద్ ఫిల్మ్నగర్లో ఈవెంట్ మేనేజర్ అనురాధ ఆత్మహత్య చేసుకుంది.. ప్రేమ పేరుతో మోసపోయిన ఆమె.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిల్మ్నగర్ జ్ఞానిజైల్సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్న ఈవెంట్ మేనేజర్ అనురాధకి.. కిరణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.. అది కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా కిరణ్ తనను పెళ్లి చేసుకుంటాడని భావించిన ఆమె.. ఆ యువకుడితో సహజీవనం చేస్తోంది.. కానీ, ఇటీవలే మరో యువతితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం ఆమెకు…
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్… వైసీపీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఏపీ సర్కార్ తీసుకువచ్చిన ఆన్లైన్ టికెట్ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ… పవన్ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది. అయితే….ఇలాంటి తరుణంలో మచిలీ పట్నంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య,సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆంధ్ర రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. మంగళవారం మంత్రి నానికి ఫోన్ చేసి..…