నాగరికత పేరుతో మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడు. మనిషి మనుగడకు కారణమవుతున్న చెట్లను నరికివేస్తూ కాలుష్యాన్ని పెంచేస్తున్నాడు. దీని వల్ల వర్షాలు లేకపోవడంతో మనిషికి ఎంతో అవసరమైన, జీవనాధారమైన నీరు దొరకడం కష్టమైంది. చెట్లను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ… సంపత్ నంది టీమ్ వర్క్స్, రాజ్ దాసరి ప్రొడక్షన్స్ బ్యానర్స్పై ప్రముఖ దర్శకుడు సంపత్ నంది, రాజేందర్ రెడ్డి డి నిర్మాతలుగా తెరకెక్కుతున్న సినిమా ‘సింబా’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు భాగమయ్యారు. ఈ చిత్రంలో…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఏ తేదీన పెట్టాలనే విషయంలో కార్యవర్గం, ఎన్నికల నిర్వహణ కమిటీ ఎంతో మల్లగుల్లాలు పడ్డాయి. సెప్టెంబర్ లో ఏదో ఒక ఆదివారం పెట్టే కంటే… అక్టోబర్ 10వ తేదీ సెకండ్ సండే పెడితే, అందరికీ సౌలభ్యంగా ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చింది. ఆ ప్రకారమే మరో మూడు రోజుల్లో ‘మా’ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇప్పటి వరకూ ‘మా’ ఎన్నికలు ఎప్పుడు జరిగినా… ఫిల్మ్ ఛాంబర్ భవంతిలోనే జరిగాయి. అందులోని సెకండ్ ఫ్లోర్ లో…
‘మా’ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్న వాళ్లంతా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నటుడు, దర్శకుడు రవిబాబు కూడా దీనికి కూడా పనికిరామా ? అంటూ ఇన్ డైరెక్ట్ కౌంటర్ వేశారు. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటున్న ఆయన తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికలకు ముందు బయటకు రావడమే కాకుండా ఏకంగా స్పెషల్ వీడియోను పోస్ట్ చేసి వార్తల్లో నిలిచారు. “ఇది లోకల్, నాన్ లోకల్…
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పండగ మొదలైంది. దసరా సీజన్ దగ్గరపడుతోంది. ఈ సీజన్లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారాంతంలో ఒకేసారి నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ నటించిన “కొండపొలం”, గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వం వహించిన “కొండపొలం” వైష్ణవ్ తేజ్ కు రెండవ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా…
మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ ను తమన్ ఇదివరకే ప్రారంభించగా, తదుపరి ట్యూన్ అంశాలపై చర్చించారు. తాజాగా…
‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి…
చిత్ర పరిశ్రమ వివాదంపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటో రజనీ మూవీ ఓపెనింగ్ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ… నలుగురు ప్రొడ్యూసర్లో, నలుగురు హీరోలనో దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోరని చెప్పిన కొడాలి నాని… పవన్ కళ్యాణ్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని స్పష్టం చేశారు. ప్రభుత్వం అందరి ప్రయోజనాల కోసం ఆలోచిస్తుందన్నారు కొడాలి నాని. ఇష్టా రాజ్యంగా టికెట్ల ధరలు పెంచు కోవడాన్ని మేమ సమర్థించబోమని తెలిపారు. ఖచ్చితంగా అందరికీ…
గత కొన్ని మాసాలుగా నాగా చైతన్య, సమంత విడాకులకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో పాటు ప్రధాన వార్తా పత్రికల్లోనూ విశేషంగా చోటు చేసుకుంటున్నాయి. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో నాగచైతన్య వ్యూహాత్మక మౌనం పాటిస్తూ వచ్చాడు. సమంత మాత్రం సందర్భాను సారంగా అవుననో, కాదనో ఏదో ఒక రీతిలో హింట్ ఇస్తూ వస్తోంది. ఆమె నెట్ ఫ్లిక్స్ లో నటించబోతున్న ‘డైవోర్స్’ అనే వెబ్ సీరిస్ ప్రమోషన్ కోసమే సమంత ఇలాంటి ప్రచారాలు చేస్తోందనే వార్తలూ…
(అక్టోబర్ 2న మహాత్మ గాంధీ జయంతి) భారతీయుల మదిలో అహింసామూర్తిగా గుడికట్టుకున్నారు మహాత్మ గాంధీ. మన దేశానికి సంబంధించిన తొలి డాక్యుమెంటరీస్ లో మహాత్ముడే ఎక్కువగా కనిపించారు. ఆ రోజుల్లో బ్రిటిష్ వారు మహాత్మ గాంధీ చేస్తున్న అహింసా పోరాటాలను నిక్షిప్తం చేయాలని భావించి, ఆ దిశగా డాక్యుమెంటరీలు రూపొందించారు. అలా నిక్షిప్త పరచిన మహాత్ముని దృశ్యాలనే ఈ నాటికీ చూడగలుగుతున్నాం. ముఖ్యంగా దండి వద్ద బాపూజీ చేసిన ఉప్పు సత్యాగ్రహం సమయంలో గాంధీజీపై చిత్రీకరించిన విజువల్స్…
కరోనా కారణంగా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తోంది. దాంతో సహజంగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను తెరకెక్కించే దర్శకులు, నిర్మాతలు ఎక్కువయ్యారు. అయితే కొందరు తమలోని పేషన్ ను విస్త్రత పరిధిలో ప్రేక్షకులకు చేర్చాలనే భావనతో కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ ను సైతం థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అలా ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చిందే ‘ది రోజ్ విల్లా’ మూవీ. డాక్టర్ రవి (దీక్షిత్ శెట్టి), అతని భార్య, రచయిత్రి శ్వేత…