(జూన్ 30న అల్లరి నరేశ్ పుట్టినరోజు) మొదట్లో పెన్నూ, పేపర్ పట్టుకొని స్క్రిప్ట్ రాయాలి, డైరెక్షన్ చేయాలి అంటూ ఇ.వి.వి.సత్యనారాయణ చిన్న కొడుకు నరేశ్ ఆరాటపడేవాడు. అయితే అప్పటికే తండ్రి దర్శకత్వం వహించిన ఒకట్రెండు సినిమాల్లో బాలనటునిగా దర్శనమిచ్చాడు. కానీ, ఇ.వి.వి. మాత్రం తన పెద్దకొడుకు రాజేశ్ ను హీరోని చేయాలని ఆశించారు. కానీ, తొలుత తెరపై కనిపించిన నరేశ్ నే నటన ఆవహించింది. నటునిగా సక్సెస్ దరి చేరింది. ఈ తరం హీరోల్లో అతివేగంగా యాభై…
(జూన్ 30న నటదర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బర్త్ డే) తెలుగు సినిమా రంగంలో ఎవరికైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అప్పట్లో మదరాసులోని యన్టీఆర్ ఇంటి తలుపు తట్టేవారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు మారిన తరువాత ఆ స్థానాన్ని దాసరి నారాయణరావు ఆక్రమించారు. ఏ సమయంలో దాసరి ఇంటి తలుపు తట్టినా, తమకు న్యాయం జరుగుతుందని సినిమా రంగంలో ఎంతోమంది ఆశించేవారు. దాసరి ఉన్న రోజుల్లోనే అదే తీరున నేనున్నానంటూ చిత్రపరిశ్రమలోని కార్మికులను ఆదుకున్నవారిలో…
టాలీవుడ్ తార నివేథా థామస్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన అవకాశాలతో టాలీవుడ్ లో తన మార్క్ అందంతో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించిన ఆమెకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకిని ఢాకిని’చిత్రంలో రెజీనా కసాండ్రతో కలిసి నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుంటే, తాజాగా నివేథా థామస్ గాయనిగా గీటార్…
తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందం, అభినయంతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా ఈషా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్తో సందడి చేసే ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే తాజాగా ఈషా భుజంపై ఎర్రగా కందిన గాయం నెటిజన్స్ కి కనిపిస్తుంది. ఇంకేముంది.. తెగ కామెంట్స్ తో ఏమైంది అంటూ అడుగుతున్నారు. వ్యాక్సినేషన్ కారణంగా గాయం అయ్యి…
అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని…
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’.. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఓ గాఢమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన పోషిస్తున్న ‘ధనుంజయ్’ పాత్రను తెలియజేస్తూ…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు నిజానికి టాలీవుడ్ లో పెద్దంత క్రేజ్ లేదు. సూర్య, కార్తీకి మొదటి నుండి ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో వారి సినిమాలన్నీ తెలుగులో డబ్ అవుతున్నాయి. వాటితో పాటే ధనుష్ సినిమాలు కొన్ని తెలుగులో డబ్ అయినా ‘రఘువరన్ బి.టెక్’ మాత్రమే ఇక్కడ మంచి విజయం సాధించింది. అయితే ధనుష్ తో పాన్ ఇండియా మూవీ తీస్తే కనక వర్షం కురవడం ఖాయం. అందుకే తెలుగు నిర్మాతలు ధనుష్ తో…
(జూన్ 25న సాయిచంద్ పుట్టినరోజు) నటుడు సాయిచంద్ ప్రస్తుతం కేరెక్టర్ రోల్స్ లో అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరో కావాలనే చిత్రసీమలో అడుగుపెట్టారు. ఆరంభంలో ‘మాభూమి’ వంటి సంచలనాత్మక చిత్రంలో ప్రధాన భూమిక పోషించి మెప్పించారు. ఆ తరువాత ‘మంచు పల్లకి’లో చిరంజీవి స్నేహితునిగా, ‘ఈ చరిత్ర ఏ సిరాతో’, ‘ఈ దేశంలో ఒక రోజు’ వంటి చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రలూ పోషించారు. బాపు ‘పెళ్ళీడు పిల్లలు’లో ఓ హీరోగా నటించారు. ‘ఈ చదువులు మాకొద్దు’లోనూ కీలక…