మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ గతేడాది టెర్రిబుల్ బైక్ యాక్సిడెంట్ నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తేజు బయట కనిపించింది తక్కువే.. ఇటీవల వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో కనిపిస్తున్నా ఇంకా తేజ్ ఏదో దాస్తున్నాడు అని అనిపిస్తుంది అని అభిమానులు అంటున్నారు. అయితే వారు అలా అనుకోవడానికి కూడా కారణం లేకపోలేదు. యాక్సిడెంట్ తరువాత తేజ్ ముఖం మొత్తం పాడైపోయిందని, తేజ్ పూర్తిగా తగ్గిపోయాడని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ తరవాత…
దగ్గుబాటి కుటుంబ నుంచి మరో హీరో రానున్నాడు. దగ్గుబాటి నటవారసత్వంగా వెంకటేష్ హీరోగా అడుగుపెట్టాడు.. ఆయన అన్న సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నిర్మాణ రంగంలోకి దిగాడు. ఇక తండ్రి, బాబాయ్ ల వారసత్వంగా దగ్గుబాటి రానా ఒక పక్క హీరోగా మరోపక్క నిర్మాతగా కొనసాగుతున్నాడు. తాజగా కుటుంబ వారసత్వంతో మరో దగ్గుబాటి ఇంటిపేరుతో ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. అతనే దగ్గుబాటి అభిరామ్.. సురేష్ బాబు చిన్న కొడుకు.. రానా తమ్ముడు. అభిరామ్ టాలీవుడ్ ఎంట్రీ…
నందమూరి నటవంశంలో హీరోలుగా ప్రయత్నించిన వారు కొందరే! అయితే వారిలో నటరత్న యన్టీఆర్ వారసులుగా తనయుడు బాలకృష్ణ, మనవడు జూనియర్ యన్టీఆర్ స్థాయిలో రాణించినవారు లేరు. అయితే నటరత్న మరో మనవడు నందమూరి తారకరత్న చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టడంతోనే ఓ రికార్డును తన సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే ఒకే రోజు తొమ్మిది చిత్రాల ప్రారంభోత్సవం చూశారు. ఆ తొమ్మిది చిత్రాలలో తరువాత వెలుగు చూసినవి కొన్నే! అందులో విజయాలు చూసినవి లేవనే…
నవతరం ప్రేక్షకుల భావాలకు అనుగుణంగా చిత్రాలను నిర్మించి, తొలి ‘చిత్రం’తోనే భళారే విచిత్రం అనిపించారు దర్శకుడు తేజ. ఆయన దర్శకునిగా మెగాఫోన్ పట్టకముందే చిత్ర నిర్మాణానికి సంబంధించిన పలు శాఖల్లో పనిచేశారు. లైట్ బోయ్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన తేజ, ఆ తరువాత ముంబయ్ లో పలువురు సినిమాటోగ్రాఫర్స్ వద్ద అసోసియేట్ గా ఉన్నారు. సినిమాటోగ్రఫీతోనూ అలరించారు. దర్శకునిగా, ఛాయాగ్రాహకునిగా యువతను ఆకట్టుకోవడంతోనే సాగారు తేజ. జాస్తి ధర్మతేజ 1966 ఫిబ్రవరి 22న జన్మించారు. ఆయన…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న బోళా శంకర్ చిత్రంలో చిరు చెల్లిగా నటిస్తోంది. మరోపక్క నానితో కలిసి దసరా, సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి. ఇకపోతే కీర్తి సురేష్ సరికొత్తగా గాంధారీ అవతారం ఎత్తింది. చేతికి గోరింటాకు, సాంప్రదాయ దుస్తులను ధరించి చిందులు వేస్తోంది.…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కాబోతోంది. ఇదే సమయంలో అతను దాదాపు మూడు, నాలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో ‘సమ్మతమే’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్ మూవీతో పాటు గీతా ఆర్ట్స్ 2లోనూ కిరణ్ అబ్బవరం మూవీ చేస్తున్నాడు. విశేషం ఏమంటే… కిరణ్ అబ్బవరం నటిస్తున్న ఐదో చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ స్వర్గీయ కోడి రామకృష్ణ కుమార్తె దివ్య దీప్తి నిర్మిస్తోంది. సంజనా…
వాసం నరేశ్, ఆశ ప్రమీల హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ప్యాకప్’. జివిఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ప్రారంభోత్సవం సోమవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత ఎ. ఎమ్. రత్నం ముఖ్య అతిథిగా హాజరై హీరోహీరోయిన్లపై క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్కు మంచి పేరు తీసుకురావాల’ని ఆకాంక్షించారు. ఓ మంచి కథతో హీరోగా…
బంపర్ ఆఫర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమిన బ్యూటీ బిందు మాధవి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అడపాదడపా తెలుగు సినిమాలో కనిపించి మెప్పించిన అమ్మడికి విజయాలు మాత్రం అందలేదు. తెలుగమ్మాయిగా తమిళ్ లో పరిచయమై అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలని గట్టి నిర్ణయమే తీసుకోంది. బిగ్ బాస్ ఓటిటీ ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోయింది. తాజాగా బిందుకు…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా అనగానే టక్కున తూటాలాంటి డైలాగ్స్ గుర్తొస్తాయి.. హీరో ఇంట్రడక్షన్.. ఇద్దరు హీరోయిన్లు.. మెస్మరైజ్ చేసే సాంగ్స్.. బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. మరు ముఖ్యంగా త్రివిక్రమ్ సినిమా అనగానే సీనియర్ హీరోయిన్ల ఎంట్రీ ఉంటుంది. ఆయన సినిమాలో చిన్న పాత్రలకైనా సరే బాగా పాపులారిటీ ఉన్న నటులను ఎంపిక చేసుకుంటాడు. ఇక్కడ దొరక్కపోతే పరభాష నటులను దింపుతాడు.. అందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన ‘అత్తారింటికి దారేది’లో నదియా ..…