స్వతంత్ర భారత్ కు తొలి ఒలింపిక్ పతకం రెజ్లింగ్ లోనే వచ్చింది. వ్యక్తిగత విభాగంలో ఇది తొలిపతకం.అప్పటి నుండే దేశంలో రెజ్లింగ్ పై ఆసక్తి పెరిగింది. గత మూడు ఒలింపిక్స్ క్రీడల్లో రెజ్లర్లు భారత్కు పతకాలు సాధించారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సుశీల్ కుమార్ సాధించిన కాంస్య పతకం భారత రెజ్లింగ్ ముఖచిత్రాన్ని మార్చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్లో సుశీల్ మళ్లీ తన పట్టు నిలబెట్టుకొని రజతం సంపాదించగా… యోగేశ్వర్…
రెజ్లింగ్ పై ఆశలు గట్టిగానే ఉన్నాయి. షూటింగ్ గురి తప్పదనే నమ్మకం ఉంది..అథ్లెటిక్స్ లో అంతంత మాత్రంగానే ఉన్నా, హాకీలో అద్భుతాలు జరుగుతాయనే అంచనాలున్నాయి. ఓవరాల్ గా భారత క్రీడాకారులు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారని భావిస్తున్నారు. భారత్ ఖాతాలో ఎన్ని పతాకాలొస్తాయనే అంశంపై చాలా అంచనాలున్నాయి. నిజానికి ప్రతి నాలుగేళ్లకొకసారి ఈ చర్చ నడుస్తూనే ఉంటుంది. గతాన్ని పరిశీలిస్తే భారత్కు లభించిన పతకాల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అయితే, టోక్యోలో భారత్ డబుల్ డిజిట్…
కరోనావైరస్ వ్యాప్తి నడుమ కొత్త నిబంధనలు స్పష్టంగా తెలియజేసేందుకు 33 పేజీల పుస్తకాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు విడుదల చేశారు. అంతర్జాతీ ప్రేక్షకులు కేవలం టీవీల్లోనే ఒలింపిక్స్ను చూడాల్సి ఉంటుంది. కేవలం స్థానికులకు మాత్రమే వీటిని చూసేందుకు అనుమతి ఉంది. వారు కూడా కరోనా కట్టడికి ప్రోటోకాల్స్ పాటించాల్సి ఉంటుంది. పాటలు, డ్యాన్సులతో స్టేడియంలలో హంగామా చేయడంపైనా ఆంక్షలు అమలులో ఉన్నాయి. అటు అంతర్జాతీయ వాలంటీర్లు కూడా టోక్యో రావడానికి వీల్లేదు. జపాన్లో అడుగుపెట్టిన వెంటనే క్రీడాకారులంతా 14…
ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున అతిపెద్ద బృందం టోక్యోలో ఉంది.కోచ్లు, సహాయక సిబ్బంది, అధికారులతో కలిపి మొత్తం 228 మంది ఒలంపిక్స్ లో భాగమయ్యారు. ఐదేళ్ల క్రితం భారీ అంచనాలతో రియో ఒలింపిక్స్లో పాల్గొన్న భారత బృందం కేవలం రెండు పతకాలతో తిరిగి వచ్చింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్లో పీవీ సింధు రజతం సాధించగా… మహిళల రెజ్లింగ్లో సాక్షి మలిక్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. రియో క్రీడల్లో భారత్ నుంచి 15 క్రీడాంశాల్లో 117 మంది…
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ.. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. క్రీడా గ్రామంలో పలువురు అథ్లెట్లు వరుసగా వైరస్ బారిన పడుతున్నారు. దీంతో విశ్వక్రీడల నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, ఒలింపిక్స్ నిర్వాహకులు అలాగే ముందుకు సాగుతున్నారు. ఇద్దరు దక్షిణాఫ్రికా ఫుట్బాల్ టీమ్ కి చెందిన ఇద్దరి ఆటగాళ్లు వైరస్ బారిన పడగా.. చెక్ రిపబ్లిక్కు చెందిన బీచ్ వాలీబాల్ ప్లేయర్కు పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఇక మెగా ఈవెంట్లో ఇప్పటివరకు…
టోక్యో ఒలింపిక్స్లో కరోనా కలవరం పెడుతుంది. ఒలింపిక్స్ నిర్వహించే విలేజ్లో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య పెరుగుతుంది. తాజాగా మరో ఇద్దరికి పాజిటివ్ నిర్థారణ అయ్యింది. స్క్రీనింగ్ టెస్ట్లో మరో ఇద్దరు అథ్లెట్లకు కరోనా సోకింది. ఒలింపిక్ విలేజ్లో మొన్న తొలి కేసు నమోదయ్యింది. ఇకపై ప్రతిరోజు క్రీడాకారులకు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించనున్నారు. read also : పార్లమెంట్ సమావేశాలు : ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతండటంతో…
ఢీల్లి నుంచి ప్రత్యేక విమానంలో టోక్యోకు వెళ్లారు భారత అథ్లెట్లు. ఈనెల 23 నుంచి ఒలింపిక్స్ ప్రారంభమవుతుండటంతో భారత అథ్లెట్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దిల్లీ నుంచి బయలుదేరుతుండంగా పతకాలతో తిరిగి రావాలని అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు భారత షూటర్లు నిన్న ఉదయమే టోక్యోకు చేరుకున్నారు. క్రొయేషియా నుంచి భారత షూటర్లు వెళ్ళడంతో క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇక ఢీల్లి నుంచి బయలుదేరిన భారత అథ్లెట్ల బృందం మాత్రం మూడు రోజులు పాటు క్వారంటైన్లో…
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సూపర్ స్టార్ పీవీ సింధుకి అరుదైన గౌరవం దక్కనుంది. వచ్చేనెలలో ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత జాతీయ పతాకాన్ని చేత పట్టుకుని భారత బృందాన్ని నడిపించే అవకాశం లభించనుంది. ఈ సారి బిన్నంగా పతాకాదారులుగా ఇద్దరిని ఎంపిక చేయనున్నారు. ఇద్దరు పతాకదారుల్లో సింధు ఒకరు అని భారత ఒలింపిక్ సంఘం వర్గాలు తెలిపాయి. దీనిపై ఈ నెలాఖారులోగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశంఉంది.