ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో జరిగే ఇండియా టుడే ఎడ్యుకేషన్ సమ్మిట్లో సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. ఇవాళ ఆన్లైన్లో టికెట్లను విడుదల చేయనుంది. నేడు ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అంగప్రదక్షణ టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ. ఏప్రిల్ నెలకు సంబంధించి అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది.
Top 10 richest temples: అయోధ్యలో రేపు రామ మందిర ప్రారంభోత్సవ వేడుక జరగబోతోంది. దాదాపుగా రూ.1800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది విరాళాలు ఇచ్చారు. రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్టకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హాజరవుతున్నారు. 7000 మందికి పైగా అతిథులు, లక్షల్లో ప్రజలు హాజరుకానున్నారు. రామ మందిరానికి వేడుక వేళ భారతదేశంలో 10 అంత్యంత ధనిక దేవాలయాలు ఇవే.. 1) తిరుమల తిరుపతి దేవస్థానం,…
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది.
ఈ ఏడాది చివరి నాటికి అయోధ్య, వారణాసి, తిరుపతి, కత్రా-వైష్ణో దేవి వంటి ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాలలో 400 ప్రాపర్టీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఓయో తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది చివరి నాటికి విస్తరణను చేపట్టనున్నట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోడీ లేకపోతే ఈ పరిస్థితులు లేవు అన్నారు మోహన్బాబు.. కులాలు అనేవి లేవు, తెలిసో తెలియకో అజ్ఞానులు కులాల గురించి మాట్లాడుతున్నారు.. కానీ, మోడీ ఒక్కరే అందరూ కలిసుండాలని చెప్పారన్నారు.
తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో ఆంధ్రప్రదేశ్కు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్గా నిలిచింది.