Varun Tej: తిరుపతి నుంచి నిహారిక పోటీ..! క్లారిటీ ఇచ్చిన వరుణ్ తేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Tej: ఓ వైపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావిడి, ప్రచారం నడుస్తోన్న వేళ.. ‘ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మెగా హీరో వరుణ్ తేజ్.. మార్చి 1వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ సినిమా రిలీజ్ కానుండగా.. ప్రమోషన్స్లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్.. ఇక, ఈ రోజు రాజమండ్రిలో పర్యటించిన హీరో వరుణ్ తేజ్.. సినిమా విషయాలతో పాటు ఎన్నికల్లో ప్రచారం.. వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యుల పోటీపై క్లారిటీ ఇచ్చారు.
Read Also: Shanmukh Jaswanth Case: గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్, అన్నపై రేప్ కేసు… అసలు కథ ఇదే!
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
ఎన్నికల్లో పోటీపై మా కుటుంబంలో పెద్దవాళ్ల నిర్ణయమే మా నిర్ణయం అన్నారు వరుణ్ తేజ్.. ఎన్నికల్లో ప్రచారంపై మా కుటుంబంలో పెద్దవారి నిర్ణయమే ఫైనల్ అన్నారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన వరుణ్ తేజ్.. పెద్దనాన్న చిరంజీవి, నాన్న నాగబాబు, బాబాయ్ పవన్ కల్యాణ్ ఏది చెప్తే అదే చేస్తామని అన్నారు. మా అవసరం ఉన్నది అనుకుంటే ఎన్నికల ప్రచారానికి వస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు.. మా కుటుంబం అంతా బాబాయ్ పవన్ కల్యాణ్ వెంటే ఉంటామని పేర్కొన్నారు. అయితే, మేం పొలిటికల్గా ఏం చేయాలనుకున్నా పెద్దల నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని వివరణ ఇచ్చారు. ఇక, అనకాపల్లి నుండి నాన్న నాగబాబు పోటీ చేస్తే ప్రచారానికి వెళ్లడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుండి నిహారిక పోటీ చేస్తుందంటూ జరుగుతోన్న ప్రచారంపై క్లారిటీ ఇస్తూ.. ఆ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు వరుణ్ తేజ్.
ఇక, మార్చి 1న ‘ఆపరేషన్ వాలంటైన్ ‘ సినిమా రిలీజ్ చేస్తున్నాం.. మిలటరీమాధవరం వెళ్లి ఆశీస్సులు తీసుకున్నాను అని తెలిపాడు వరుణ్ తేజ్.. ప్రతి సినిమాకు రాజమండ్రి వస్తాను, మాది పక్కనే ఉన్న నిడదవోలు అని గుర్తుచేసిన ఆయన.. సీఆర్పీఎఫ్ బ్యాగ్రౌండ్ లో సినిమా స్టోరీ ఉంటుంది.. పుల్వామా, బాలకోట్ ఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించాం.. టెర్రరిస్టులను ఎలా మట్టుబెట్టారనేది, మన వారిని ఎలా కాపాడారనేది చూపించాం అని తెలిపారు. లవ్ స్టోరీ, కామెడీ, కర్షియల్ సినిమాలే కాకుండా ఆర్మీ కష్టాలపై సినిమా తీశామని వెల్లడించారు. ఇక, త్వరలో మాట్కా అనే సినిమా చేస్తున్నట్టు ఈ సందర్భంగా పేర్కొన్నారు వరుణ్ తేజ్.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!