తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నాడు వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల తర్వాత నిత్యసేవలు, కైంకర్యాల అనంతరం వేకువజామున 1:45 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది. తొలుత ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీలను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం పలువురు వీఐపీలు తిరుమలకు వస్తున్నారు. మొత్తం 11 మంది మంత్రులు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు రానున్నట్లు టీటీడీ అధికారులు…
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానుంది.. అంటే ఈ నెల 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.. కాగా, శ్రీవారి ఆలయంలో 1863లో వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనాన్ని అప్పటి మహంతు సేవాదాస్ ప్రారంభించారు.. ఇక, 1949లో వైకుంఠ ద్వాదశికి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. మరోవైపు వైకుంఠ ద్వార…
కలియుగ వైకుంఠం తిరుమల వెళ్ళే భక్తులకు టీటీడీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండవ ఘాట్ రోడ్డులో రాకపోకలు పునరుద్ధరించారు. రెండవ ఘాట్ రోడ్డులో పూర్తిస్థాయిలో వాహనాల అనుమతి ప్రారంభించింది టీటీడీ. జెండా ఊపి వాహనాలను అనుమతించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. రెండవ ఘాట్ రోడ్డు ప్రారంభం కావడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది వర్షాల వల్ల ఘాట్ రోడ్లు దెబ్బతిన్నాయి. డిసెంబర్ 1వ తేదిన 16వ కిలోమీటర్ వద్ద కొండచరియలు విరిగిపడడంతో…
తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్ నరేంద్ర, లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్ రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు మధ్యప్రదశ్కు చెందిన ముగ్గురు భక్తులకు నకిలీ దర్శన టిక్కెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శనం టిక్కెట్లను రూ.21వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. Read Also: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు…
దశాబ్దాల నాటి భక్తుల కల త్వరలో నెరవేరబోతోంది. ఏళ్ళ తరబడి శిథిలావస్థలో ఉన్న వకుళామాత ఆలయం శరవేగంగా పునర్నిర్మాణమవుతోంది.తిరుపతిలోని వకుళామత దేవాలయం పనులని పరిశీలించారు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. త్వరలో జరిగే వకుళామత దేవాలయం ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ హాజరవుతారని మంత్రి అన్నారు. భారీ వర్షాల కారణంగా పేరూరు చెరువులో నీరు నిండి పనులు ఆగాయన్నారు. ఇప్పుడే పనులు తిరిగి ప్రారంభమయ్యాయని, కోనేరు పని పూర్తి చేసి,…
తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు భక్తులకు వైకుంఠద్వార దర్శనం ఉంటుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు వైకుంఠద్వార దర్శనానికి సిఫార్సు లేఖలు అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. స్వయంగా తిరుమల వచ్చిన వీఐపీలకే దర్శనం కల్పిస్తామన్నారు. చైర్మన్ కార్యాలయంలో కూడా సిఫార్సు లేఖలు స్వీకరించేది లేదన్నారు. Read Also: దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తిరుమలలో గదుల మరమ్మతుల కారణంగా ఏకాదశి…
డిసెంబర్ 31వ తేదీన ఫుల్గా ఎంజాయ్ చేసి.. మరునాడు.. అంటే జనవరి 1వ తేదీన గుడి ముందు బారులు తీరుతుంటారు.. తెలుగు సంవత్సరంగా చూస్తే.. జనవరి 1వ తేదీకి ప్రాధాన్యత లేకపోయినా.. ఆంగ్ల క్యాలెండర్లోని జనవరి 1న మాత్రం ఆలయాలకు భక్తులకు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు.. ఇక, వారికి కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది. ఈ నేపథ్యంలో.. తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.. శనివారం రోజు నూతన సంవత్సరం సందర్భంగా సిఫార్సు లేఖలు…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి నిత్యం పూజలు అందుకుంటారు.. కొలిచిన వారికి కొంగుబంగారం అయిన శ్రీవారికి రకరాల పూజలు, అభిషేకలు, ఊరేగింపులు.. కల్యాణాలు.. ఒక్కటేంటి.. శ్రీవారి వైభోగం మాటలకు అందదు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ ఏడాది మరో రోజుతో ముగియనుంది.. వచ్చే ఏడాది అంటే జనవరిలో శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాలను ప్రకటించింది తిరుమల తిరుపతి దేవస్థానం.. Read Also: గోరటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.. టీటీడీ…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ముఖ్యంగా సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు అలెర్ట్ కావాల్సిన సమయం వచ్చింది.. ఎందుకంటే.. సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.. జనవరి 1వ తేదీన సిఫార్సు లేఖల స్వీకరణ ఉండదని స్పష్టం చేసింది టీటీడీ.. అదే విధంగా జనవరి 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు కూడా సిఫార్సు లేఖల…
ఒకప్పుడు యాజమాన్యాన్ని శాసించారు ఆ ఉద్యోగులు. ఇప్పుడు భయం.. బలహీనం. ఏం జరిగినా నోరెత్తలేని ధైన్యం. ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు? ఏమా కథ? బలంతగ్గి టీటీడీలో వాయిస్ లేని ఉద్యోగులు..! కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉద్యోగమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామి వారిని క్షణకాలం దర్శించుకునే భాగ్యం లభిస్తేనే చాలు.. తమ జీవితం ధన్యమని అనుకుంటారు భక్తులు. అటువంటిది స్వామి సన్నిధిలో నిరంతరం భక్తులకు సేవ చేసుకుంటూ.. ఆ సన్నిధిలోనే ఉద్యోగమంటే ఎంతో…