వైకుంఠ ఏకాదశిలోపు ఘాటు రోడ్ పనులు పూర్తిచేస్తామంటోంది టీటీడీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామంటోంది. తుఫాన్ కారణంగా ఏర్పడిన భారీ వర్షాలకు ఘాట్ రోడ్డు పాడైంది. తిరుమల రెండో ఘాట్ మరమ్మతులు ఈ నెలాఖరులోపు పూర్తిచేసి, వైకుంఠ ఏకాదశిలోపు వాహన రాకపోకలకు అనుమతివ్వాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. 7,8,9,14,15వ కిలోమీటర్ల వద్ద త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఐఐటీ…
అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి సేవలో తరించేందుకు మరోసారి టీటీడీ అవకాశం కల్పించింది. ఏడుకొండల వేంకటేశ్వర స్వామి వారి ఉదయాస్తమాన సేవల టికెట్ ధర నిర్ణయిస్తూ టీటీడీ ప్రకటన చేసింది. సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ.కోటి ఉండగా.. శుక్రవారం నాడు మాత్రం రూ.కోటిన్నరగా నిర్ణయించింది. ఈ టికెట్పై 6గురు స్వామి వారి సేవలో పాల్గొనవచ్చు. జనవరి రెండో వారం నుంచి 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను అందుబాటులో ఉంచనుంది. అయితే ఈ టికెట్ల ద్వార రూ.600…
ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజులో ఉదయాస్తమాన సేవా టిక్కెట్టు కోటి రూపాయలుగా… శుక్రవారం రోజున కోటిన్నరాగా నిర్ణయించింది. ప్రస్తుతం టీటీడీ వద్ద అందుబాటులో 531 ఉదయాస్తమాన సేవా టిక్కెట్లు ఉన్నాయి. ఉదయాస్తమాన సేవా టిక్కెట్ల పై 25 సంవత్సరాల పాటు స్వామి వారి ఆర్జిత సేవలో పాల్గోనే అవకాశం పోందనున్నారు భక్తులు. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు భక్తులు పాల్గొనే సౌలభ్యం ఉంది.…
ఇవాళ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు.. 500 మంది రైతులకు దర్శన సౌకర్యం కల్పించనుంది టీటీడీ.. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో శ్రీవారిని దర్శించుకోనున్నారు అమరావతి రైతులు… కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు. కాగా, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే.. నవంబర్ 1వ తేదీన తుళ్లూరు నుంచి మహా పాదయాత్ర ప్రారంభించిన…
తిరుమల తిరుపతి దేవస్థానం మూడో ఘాట్ రోడ్డు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నది. ఈరోజు టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకున్నది. తిరుమలకు రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. కాగా, ఇప్పుడు మూడో ఘాట్ రోడ్డును ఏర్పాటు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తున్నది. పదకవితా పితామహుడిగా పేరుగాంచిన అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న అన్నమయ్య మార్గాన్ని అభివృద్ధి చేయబోతున్నది. ఈ మార్గంలో ప్రయాణం చేస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుతారు. Read:…
వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజులు పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తాం అని వైవి సుబ్బారెడ్డి అన్నారు. జనవరి 13 న వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారా దర్శనం ప్రారంభమవుతుంది. కోవిడ్ నిభందనలు సడలిస్తే…పండుగ తరువాత సర్వదర్శనం పెంపు ,ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడం ప్రారంభిస్తాం. 11 మంది చిన్నపిల్లలుకు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు. చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విరాళాలు అందించిన భక్తులుకు ఉదయాస్తమాన సేవకు అనుమతించేలా అవకాశం…
కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తిరుపతి వెళ్లామంటే.. వెంటనే లడ్డూ తెచ్చారని అడుగుతుంటారు.. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ, తెలంగాణలోని అన్ని టీటీడీ ఆలయాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.. మరోవైపు.. శ్రీనివాసమంగాపురంలోనూ లడ్డూ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది టీటీడీ.. రేపటి నుంచి శ్రీనివాసమంగాపురంలో లడ్డూ విక్రయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.. మొదటి రోజు ప్రయోగాత్మకంగా 3వేల లడ్డూలను…
తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేసింది. జనవరి 11 నుంచి 14 వరకు నాలుగు రోజుల పాటు సిఫారసులపై గదుల కేటాయింపు ఉండదని టీటీడీ ప్రకటించింది. జనవరి 13న వైకుంఠ ఏకాదశి, 14న వైకుంఠ ద్వాదశి వేడుకలు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో జనవరి 11 నుంచి 14 వరకు వసతి గదుల అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆయా తేదీలలో తిరుమల వచ్చే భక్తులు కరెంట్ బుకింగ్ ద్వారా మాత్రమే…
తిరుమలలో కొండ చరియలు విరిగిపడడం వల్ల స్వామివారిని దర్శనం చేసుకోలేని భక్తులకు మరో అవకాశం కల్పించింది టీటీడీ. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు అదనపు ఇఓ ధర్మారెడ్డి. భక్తులకు భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని ఆయన చెప్పారు. నవంబర్ 18 నుంచి డిసెంబరు 10వ తేది వరకు దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆయా తేదీల్లో దర్శనం టికెట్లు వున్న భక్తులు రీ షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు.…
భారీ వర్షాలతో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇక, తిరుపతి, తిరుమలలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు.. శ్రీవారి భక్తులను ఇబ్బందులకు గురిచేశాయి.. తిరుమల ఘాట్ రోడ్డులు కోతకు గురయ్యాయి.. ఏకంగా 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడడం, నాలుగు ప్రాంతాల్లో రోడ్డు దెబ్బతినడంతో.. తిరుమలకు రాకపోకలపై ఆంక్షలు కూడా విధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, ఇవాళ తిరుమల ఘాట్ రోడ్డును పరిశీలించనుంది ఢిల్లీ ఐఐటీ నిపుణుల బృందం. Read Also: జవాద్ తుఫాన్ ఎఫెక్ట్..…