Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్.. మరో టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ రకరకాల ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా ఐఆర్సీటీసీ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉండే వారి కోసం మార్చి నెలలో ‘తిరుపతి దేవస్థానం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీ టూ డేస్, వన్ నైట్ ఉంటుంది. మార్చి 5, 12, 26 తేదీల్లో ఈ ప్యాకేజీ భక్తులకు అందుబాటులో ఉంటుంది. వీకెండ్లో శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల వెళ్లాలనుకునే భక్తులకు ఈ టూర్ ప్యాకేజీ ఉపయోగపడుతుంది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు పద్మావతి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయాలు కవర్ అవుతాయి.
అంతేకాకుండా ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ కూడా కలిపే ఉంటుంది. ఇప్పటికే ఐఆర్సీటీసీ టూరిజం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి తిరుమలకు టూర్ ప్యాకేజీలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న శ్రీవారి భక్తుల కోసం మరో ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీలో భాగంగా తొలిరోజు ఉదయం 8:35 గంటలకు పర్యాటకులు ఢిల్లీ విమానాశ్రయంలో విమానం ఎక్కితే ఉ.11:30 గంటలకు చెన్నై చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకుంటారు. చెన్నై నుంచి తిరుపతి వెళ్లే మార్గంలోనే శ్రీకాళహస్తి ఆలయ సందర్శన ఉంటుంది. తిరుపతి చేరుకున్నాక హోటల్ గది కేటాయిస్తారు. ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి తిరుపతిలో బస చేయాలి.
Also Read
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రెండో రోజు ఉదయం భక్తులను తిరుమలకు తీసుకెళ్తారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత తిరుపతిలోని హోటల్కు చేరుకోవాలి. అనంతరం చెన్నై విమానాశ్రయానికి బయలుదేరాల్సి ఉంటుంది. రాత్రి 7:45 గంటలకు చెన్నైలో విమానం ఎక్కితే రాత్రి 10:45 గంటలకు ఢిల్లీ చేరుకోవడంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీలో ముగ్గురికైతే రూ.15,660, ఇద్దరికైతే రూ.15,800, ఒక్కరికైతే రూ.17,710 చెల్లించాలి.
తాజావార్తలు
-
Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
-
Mamata Banerjee: మమతా బెనర్జీ కళ్లలో భయం.. బెంగాల్ చేజారినట్లేనా.?
-
Telangana : చలాన్ల పేరుతో వాహనాల సీజ్పై.. హైకోర్టు సీరియస్..
-
Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
-
KTR : ఎన్నికలకు ముందు దానవీరశూరకర్ణ, ఎన్నికల తర్వాత కుంభకర్ణ..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!