తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. జనవరి నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను నేడు టీటీడీ విడుదల చేయనుంది. శ్రీవారి భక్తులు సులువుగా దర్శించుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ప్రతి నెల టీటీడీ రిలీజ్ చేస్తుంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి తిరుపతి చేరుకున్నారు. ఆమె నేడు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం తమ స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లనున్నారు. నారావారిపల్లెలో తమ కులదేవతకు పూజలు చేయనున్నారు. నారా భువనేశ్వరి రేపటి నుంచి 'నిజం గెలవాలి' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. భక్తులు శ్రీవారి దర్శనానికి 12 కంపార్టుమెంట్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,187 మంది భక్తులు దర్శించుకున్నారు. 29, 209 మంది తలనీలాలు సమర్పించారు.
తిరుమలలో నకిలీ ఈడీ కమీషనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన సార్ట్ వేర్ ఇంజినీర్ వేదాంతం శ్రీనివాస భరత్ భూషణ్ గా పోలీసులు గుర్తించారు.
Tirumala Brahmotsavam 2023 ends on Monday: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదోవ రోజు కొనసాగుతోంది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి వారికి విశేష సమర్పణ చేసిన అనంతరం స్వర్ణ రథంలో ఊరేగించారు. గరుడ సేవ తర్వాత రథోత్సవానికే అంతటి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఉదయం స్వర్ణ రథంపై అధిష్ఠించిన స్వామికి భక్తులు నీరాజనాలు పలికారు. నేడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య వాహన…
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లోభాగంగా ఇవాళ(శనివారం) ఏడో రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో తిరుమల మూడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సాలకు మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశామని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 1800 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నారు.. గరుడ సేవ రోజు 1253 మంది పోలీసులు అదనంగా బందోబస్తులో పాల్గొంటారు.
భారత దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.. ప్రతి ఆలయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో జరుగుతున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 16 రాష్ట్రాలకు చెందిన బృందాలు తమ కళారూపాలను ప్రదర్శిస్తాయని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి సదా భార్గవి సోమవారం తెలిపారు.. భార్గవి మాట్లాడుతూ.. పండుగ మొత్తంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి యాత్రికులకు విజువల్ ట్రీట్ను అందజేస్తామన్నారు. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ ఫెస్ట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా,…
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను అలరించేలా 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు విచ్చేస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి వెల్లడించారు.