PM Modi to Visit Tirumala: తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ.. పర్యటన షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi to Visit Tirumala: ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు.. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. ఇక, ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు.. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6:50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 గంటలకు తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకోనున్నారు.. రాత్రికి శ్రీరచనా అతిథి గృహంలో బస చేయనున్న ఆయన.. 27వ తేదీ ఉదయం 7:55 గంటలకు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు.. ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుని.. ఆలయంలో గడపనున్నారు.. ఇక, 8:55 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ముగించుకోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకుంటారు.. ఉదయం 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకుని.. తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
Read Also: Elephants Died: జార్ఖండ్లో విషాదం.. 33000 వోల్టేజ్ వైర్ తగిలి 5 ఏనుగులు మృతి
Also Read
- Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
- Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
- Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
- OTR: వివాదాలకు కేరాఫ్గా బోనబోయిన శ్రీనివాస్..
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ.. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.. ఈ పర్యటన మధ్యలోనే తిరుమలకు వెళ్లిరానున్నారు.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం అందుకున్న జిల్లాలోని అధికారులు.. భద్రతపై దృష్టి సారించారు. ప్రధాని బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుమలకు రానున్నట్టుగా తెలుస్తోంది.. గతంలో తిరుమలకు వచ్చిన మోదీకి ముఖ్యమంత్రి స్వాగతం పలికి, ఇరువురు నేతలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు కూడా మోడీకి స్వాగతం పలికేందుకు జగన్ 26వ తేదీన తిరుపతికి వస్తారని అంచనా వేస్తున్నారు. మోడీ తిరుమలలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మరియు ప్రధాని మధ్య ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. అయితే సాంప్రదాయకంగా, అటువంటి పర్యటనల సమయంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ప్రధానితో చర్చించడానికి అవకాశాన్ని తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!