PM Modi to Visit Tirumala: తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ.. పర్యటన షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi to Visit Tirumala: ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు.. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. ఇక, ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు.. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6:50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 గంటలకు తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకోనున్నారు.. రాత్రికి శ్రీరచనా అతిథి గృహంలో బస చేయనున్న ఆయన.. 27వ తేదీ ఉదయం 7:55 గంటలకు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు.. ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుని.. ఆలయంలో గడపనున్నారు.. ఇక, 8:55 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ముగించుకోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకుంటారు.. ఉదయం 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకుని.. తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
Read Also: Elephants Died: జార్ఖండ్లో విషాదం.. 33000 వోల్టేజ్ వైర్ తగిలి 5 ఏనుగులు మృతి
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ.. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.. ఈ పర్యటన మధ్యలోనే తిరుమలకు వెళ్లిరానున్నారు.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం అందుకున్న జిల్లాలోని అధికారులు.. భద్రతపై దృష్టి సారించారు. ప్రధాని బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుమలకు రానున్నట్టుగా తెలుస్తోంది.. గతంలో తిరుమలకు వచ్చిన మోదీకి ముఖ్యమంత్రి స్వాగతం పలికి, ఇరువురు నేతలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు కూడా మోడీకి స్వాగతం పలికేందుకు జగన్ 26వ తేదీన తిరుపతికి వస్తారని అంచనా వేస్తున్నారు. మోడీ తిరుమలలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మరియు ప్రధాని మధ్య ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. అయితే సాంప్రదాయకంగా, అటువంటి పర్యటనల సమయంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ప్రధానితో చర్చించడానికి అవకాశాన్ని తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?