PM Modi to Visit Tirumala: తిరుమలకు ప్రధాని నరేంద్ర మోడీ.. పర్యటన షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi to Visit Tirumala: ప్రధాని నరేంద్ర మోడీ తిరుమలకు విచ్చేయనున్నారు.. కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.. ఇక, ప్రధాని మోడీ తిరుమల పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదల చేశారు పీఎంవో అధికారులు.. రెండు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6:50 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు ప్రధాని మోడీ.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాత్రి 7:50 గంటలకు తిరుమలలోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకోనున్నారు.. రాత్రికి శ్రీరచనా అతిథి గృహంలో బస చేయనున్న ఆయన.. 27వ తేదీ ఉదయం 7:55 గంటలకు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకుంటారు.. ఉదయం 8 గంటల నుంచి 8:45 గంటల వరకు శ్రీవారిని దర్శించుకుని.. ఆలయంలో గడపనున్నారు.. ఇక, 8:55 గంటలకు శ్రీవారి దర్శనాన్ని ముగించుకోని శ్రీరచనా అతిధి గృహానికి చేరుకుంటారు.. ఉదయం 9:30 గంటలకు తిరుమల పర్యటన ముగించుకుని.. తిరుపతి ఎయిర్పోర్ట్కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.
Read Also: Elephants Died: జార్ఖండ్లో విషాదం.. 33000 వోల్టేజ్ వైర్ తగిలి 5 ఏనుగులు మృతి
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
కాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బిజీబిజీగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న నరేంద్ర మోడీ.. ఈ నెల 25, 26, 27 తేదీల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.. ఈ పర్యటన మధ్యలోనే తిరుమలకు వెళ్లిరానున్నారు.. ఇప్పటికే ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ అధికారులకు కూడా సమాచారం ఇచ్చారు. మోడీ పర్యటనకు సంబంధించిన సమాచారం అందుకున్న జిల్లాలోని అధికారులు.. భద్రతపై దృష్టి సారించారు. ప్రధాని బస చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తిరుమలకు రానున్నట్టుగా తెలుస్తోంది.. గతంలో తిరుమలకు వచ్చిన మోదీకి ముఖ్యమంత్రి స్వాగతం పలికి, ఇరువురు నేతలు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇప్పుడు కూడా మోడీకి స్వాగతం పలికేందుకు జగన్ 26వ తేదీన తిరుపతికి వస్తారని అంచనా వేస్తున్నారు. మోడీ తిరుమలలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రి మరియు ప్రధాని మధ్య ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. అయితే సాంప్రదాయకంగా, అటువంటి పర్యటనల సమయంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ సమస్యలపై ప్రధానితో చర్చించడానికి అవకాశాన్ని తీసుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!