పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో నేలకోట కొండపై తిష్ట వేసిన పెద్దపులి స్థానికుల కంటపడింది. ప్రస్తుతం రామదుర్గం కొండ పైన మకాం వేసిన పెద్దపులిని స్థానికులు వీడియో తీశారు. మనుషుల్ని చూసిన పెద్దపులి ఎలాంటి దాడి చేయకుండా వెనుకడుగు వేసింది. పాపికొండల అభయారణ్యం నుంచి బయటికి వచ్చిన తర్వాత గత 40 రోజులుగా సంచారం చేస్తూ దేవీపట్నం, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఖాళీ చేసిన గ్రామాల వద్దకు పెద్దపులి చేరుకుంది. నాలుగు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోకి…
పోలవరం పరిధిలోని దేవీపట్నం మండలం రామదుర్గం కొండల్లో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గత ఐదు రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో తిరుగుతున్న పులి.. తాజాగా రామదుర్గం కొండ పరిసరాల్లో కనిపించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో రాజానగరం మండలంకు చెందిన సుమారు 50 మంది సందర్శకులు యాత్ర నిమిత్తం రామదుర్గం కొండకు వెళ్లి చిక్కుకుపోయారు. పులి సంచారం విషయం తెలియక వెళ్లిన వీరు.. ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు. Also Read: APSPDCL Scam:…
పోలవరం జిల్లాలోని దేవీపట్నం మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల వద్ద పులి కదలికలు గుర్తించడంతో.. గిరిజనులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బోడిగూడెం, డి. రావి లంక–దండంగి గ్రామాల మధ్య పులి తిరిగినట్లు సమాచారం రావడంతో ప్రజలు అప్రమత్తమయ్యారు. పులి కదలికలను పర్యవేక్షించేందుకు అటవీశాఖ అధికారులు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. టెలికాలర్ సాయంతో పులి ఎక్కడ సంచరిస్తోందో ట్రాక్ చేస్తున్నారు. ట్రాన్స్మీటర్, వీఎచ్ఎఫ్ యాంటెన్నా ద్వారా…
గత నెల రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో హల్చల్ సృష్టించిన పెద్దపులి కథ చివరకు సుఖాంతమైంది. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం, గంగవరం, గోకవరం, జగ్గంపేట, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల వరకు తిరుగుతూ పశువులపై దాడులు చేసి ప్రజలను భయాందోళనకు గురిచేసిన పులి.. ఇప్పుడు మళ్లీ తన అసలు నిలయం అయిన పాపికొండల అభయారణ్యానికి చేరుకుంది. ఇకపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పులి పూర్తిగా అడవిలోకి వెళ్లిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఇంతకుముందు పట్టుబడిన పులిని విశాఖకు తరలించి..…
కాకినాడ జిల్లా అటవీ ప్రాంతాల నుంచి కదిలిన ఒక పెద్దపులి ప్రస్తుతం పోలవరం జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లు అటవీ శాఖ అధికారులు అధికారికంగా ధృవీకరించారు. రాజవొమ్మంగి మండలం ఉర్లకులపాడు గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పులి సంచారం గుర్తించబడింది. బవురువాక, తడువాయి అడవుల మీదుగా ప్రయాణించిన ఈ పులి నాగులకొండ పర్వత శ్రేణి వరకు చేరినట్లు సమాచారం. అక్కడ సుమారు 10 కిలోమీటర్ల మేర పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. Also Read: Kandhalapalli News: అంబేద్కర్…
హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లో పులి వరుస దాడులకు తెగబడుతుండటంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ముఖ్యంగా పశువుల కాపరులు, రైతులు తమ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పొలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. యాదాద్రి జిల్లాలోని దత్తాయపల్లి, ఇబ్రహీంపూర్ , బేగంపేట అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు ధృవీకరించారు. జనవరి 26వ తేదీన…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. చిట్యాల మండలం జడల పేట గ్రామ శివారులో ఎద్దును చంపి 100 మీటర్ల దూరం లాక్కెళ్ళింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్ద పులి సంచారంతో జడల్ పేట గాంధీనగర్ భీష్మ నగర్ రామచంద్రపూర్ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పెద్దపులి సంచారం పైనా అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఎద్దు మరణానికి పెద్ద పులి దాడే కారణమా అని సమాచారాన్ని…
ఎంత చనువుగా మెదిలినా పులి పిల్లి అవ్వదుగా. చనువిచ్చింది కదా అని అతి చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఫారిన్ లో కొన్ని జూపార్క్ లలో పులులతో ఫొటోలు తీసుకుంటుంటారు. సరదాగా వాటి పక్కన నడుస్తుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ పైత్యం మరింత ముదిరింది. రీల్స్ కోసం ఏకగాం పెద్ద పులితోనే పరాచికాలు ఆడుతున్నారు. ఇలాగే ఓ యువకుడు పెద్దపులితో రీల్స్ చేస్తూ దాడికి గురయ్యాడు. ఈ ఘటన థాయిలాండ్ లో చోటుచేసుకుంది.…
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. నస్తూరుపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా.. మహదేవపూర్ దిశగా వెళ్తున్న పెద్దపులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. మహదేవపూర్ పరిసరాల్లో పెద్దపులి కనిపించిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం…
అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు.. కొన్ని సార్లు ఓ అసత్యం కూడా.. సత్యంగా ప్రచారంలోకి వస్తుంది.. అలాంటి పరిస్థిత ఏలూరు జిల్లాలో వచ్చింది.. పిల్లి పిల్లలను చూసి.. అవి పులి పిల్లలు అని భావించిన స్థానికికులు భయాందోళనకు గురయ్యారు.. ఆ తర్వాత నిజం తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు.