Kerala man-eater tiger: వయనాడ్లో మనుషులను చంపి తింటున్న పులి మృతి
- మహిళను చంపి తిన్న పులి
- మ్యాన్ ఈటర్ ను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు
- వయనాడ్లో మనుషులను చంపి తింటున్న పులి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవులు అంతరించిపోతుండడంతో వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పశువులను పీక్కుతింటున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. జనావాసాల్లో పులుల సంచారంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పులి ఓ మహిళపై దాడి చేసి చంపేసింది. కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే మహిళ పైన పులి దాడి చేసింది.
పెద్దపులి దాడిలో రాధ మరణించింది. రాధ మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసింది. పులి మనుషులను చంపి తింటుండడంతో ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పులి నుంచి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆ పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించింది. మనుషులను చంపి తింటున్న పులిని చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పులి జాడ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మ్యాన్ ఈటర్ మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని గుర్తించినట్లు తెలిపారు. కళేబరంపై గాయాలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మెడపై లోతైన గాయాలు ఉండడంతో పోస్టుమార్టం అనంతరం పులి మరణానికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకరియా వెల్లడించారు. మ్యాన్ ఈటర్ మృతి చెందడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!