Kerala man-eater tiger: వయనాడ్లో మనుషులను చంపి తింటున్న పులి మృతి
- మహిళను చంపి తిన్న పులి
- మ్యాన్ ఈటర్ ను చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు
- వయనాడ్లో మనుషులను చంపి తింటున్న పులి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవులు అంతరించిపోతుండడంతో వన్య మృగాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. జనావాసాల్లో తిరుగుతూ మనుషులపై దాడి చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పశువులను పీక్కుతింటున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ పనుల కోసం వెళ్లిన వ్యక్తిపై పులి దాడి చేసి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. జనావాసాల్లో పులుల సంచారంతో జనం ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో పులి ఓ మహిళపై దాడి చేసి చంపేసింది. కాఫీ తోటలో పనిచేస్తున్న రాధా అనే మహిళ పైన పులి దాడి చేసింది.
పెద్దపులి దాడిలో రాధ మరణించింది. రాధ మృతదేహంలో కొంత భాగాన్ని పులి తినేసింది. పులి మనుషులను చంపి తింటుండడంతో ప్రజల నుంచి పెద్దఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పులి నుంచి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఆ పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించింది. మనుషులను చంపి తింటున్న పులిని చంపేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పులి జాడ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే మ్యాన్ ఈటర్ మృతి చెందినట్లు అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు.
Also Read
- Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
- School Holiday: విద్యార్థులకు శుభవార్త.. రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Hyderabad: ఉద్యోగం పేరుతో చిత్రహింసలు.. ఒమన్లో చిక్కుకున్న హైదరాబాద్ మహిళ..
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
అటవీ ప్రాంతంలో పులి కళేబరాన్ని గుర్తించినట్లు తెలిపారు. కళేబరంపై గాయాలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. మెడపై లోతైన గాయాలు ఉండడంతో పోస్టుమార్టం అనంతరం పులి మరణానికి గల కచ్చితమైన కారణం తెలుస్తుందని చీఫ్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ అరుణ్ జకరియా వెల్లడించారు. మ్యాన్ ఈటర్ మృతి చెందడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
-
Iran Political Crisis: ఇరాన్లో తిరుగుబాటు.. ఆ దేశ రాజకీయాల్లో కలకలం!
-
Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
-
Congress: డీలిమిటేషన్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా? క్లారిటీ ఇచ్చిన జైరాం రమేష్.
-
Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!