దేశ రాజధాని ఢిల్లీలోని జంగ్పురాలోని భోగల్లో ఓ భారీ చోరీ జరిగింది. ఢిల్లీలోని భోగల్లోని ఉమ్రావ్ జ్యువెలర్స్ షోరూంలో అర్థరాత్రి దొంగలు చొరబడి సుమారు రూ.25 కోట్ల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
కర్ణాటకలో గేదెల దొంగతనానికి పాల్పడిన 78 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 58 ఏళ్ల క్రితం రెండు గేదెలు, ఒక దూడను దొంగిలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1965లో గణపతి విఠల్ వాగూర్ అతని సహచరులలో మరొకరు దొంగతనం ఆరోపణలపై మొదటిసారిగా అరెస్టయ్యారు. అప్పటికి గణపతి విఠల్ వయసు 20 ఏళ్లు. ఆ సమయంలో ఇద్దరికీ బెయిల్ వచ్చినప్పటికీ.. వాగూర్ పరారీ అయ్యాడు.
ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వచ్చి మేకల దొంగతనానికి పాల్పడ్డాడు.
Atrocity in Janagam: ఇంట్లో నుంచి నగదు దొంగలించారన్న కారణంతో ఇద్దరు బాలికలను ఓ ఇంటి యజమాని, ఆయన కుటుంబసభ్యులు చితకబాదిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది.
దొంగల పనేంటి..? బెదిరించామా, దోపిడీ చేశామా, వెళ్లిపోయామా, అంతే. అవతల వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి ధనవంతులా, కాదా? అనేది దొంగలకు అనవసరం. దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ.. అందరూ దొంగలు ఇలాగే ఉండరని, అప్పుడప్పుడు కొందరు మంచి దొంగలు కూడా వెలుగు చూశారు.
AC Theft From SBI ATM in Punjab: ఇటీవలి కాలంలో దొంగలు ‘ఏటీఎం’ మిషన్లను ఎత్తుకెళ్లడం సర్వసాధారణం అయింది. డబ్బుల కోసం ఏకంగా ఏటీఎం మిషన్లను పగలకొట్టేస్తున్నారు. అది కుదరకపోతే ఏకంగా మిషన్నే ఎత్తుకెళుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికి చాలానే జరిగాయి. అయితే తాజాగా ఓ వింత దొంగతనం జరిగింది. ఏటీఎం మెషిన్, డబ్బు వదిలేసి.. ఏసీని ఎత్తుకెళ్లారు. ఈ ఫన్నీ ఘటన (ATM AC Robbery) పంజాబ్లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పంజాబ్లోని…
గుంటూరు జిల్లాలో తెనాలి వైకుంఠపురంలో మహిళా ఉద్యోగ చేతివాటం బయటపడింది. దేవాలయంలోని కానుకల హుండి లెక్కింపు సందర్భంగా స్వామివారికి వచ్చిన కానుకల్లోని ఉంగరాన్ని దొంగతనం చేసింది మహిళా ఉద్యోగి.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఆలయంలోనే దొంగతనం చేసేందుకు దుండగులు తెగబడ్డారు. ఆరుళ్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Women Lingerie : అహ్మదాబాద్లోని ధంధూకా జిల్లాలో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలో మహిళల లోదుస్తులు చోరీకి గురవుతున్నాయి. గత ఎనిమిది నెలలుగా ఇదే జరుగుతోంది.
Chennai: అది మామూలు గ్యాంగ్ కాదు.. కంత్రీ.. కంజర భట్ గ్యాంగ్. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూరు, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్ లో ఏకకాలంలో కంటైనర్లను ధ్వంసం చేస్తున్న ఈ హైజాక్ గ్యాంగ్ ఖాకీలకు సవాల్ గా మారింది.