Good Thieves: మంచి దొంగలు.. వృద్ధుడి ఇంట్లో ఏం దొరకలేదని ఎదురుడబ్బుచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Good Thieves in Delhi: దొంగల పనేంటి..? బెదిరించామా, దోపిడీ చేశామా, వెళ్లిపోయామా, అంతే. అవతల వ్యక్తుల పరిస్థితి ఏంటి? వారి ధనవంతులా, కాదా? అనేది దొంగలకు అనవసరం. దోచుకోవడమే వారి ప్రధాన లక్ష్యం. కానీ.. అందరూ దొంగలు ఇలాగే ఉండరని, అప్పుడప్పుడు కొందరు మంచి దొంగలు కూడా వెలుగు చూశారు. దొంగలించిన సామాన్లు తిరిగి ఇచ్చేయడమో, ఏమీ లేవని తిరిగి దొంగలే ఆర్థిక సహాయం చేయడమో వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో తాజాగా అలాంటి వ్యవహారమే వెలుగుచూసింది. ఓ ఇంట్లో దోచుకుందామని వెళ్లిన దొంగలకు అక్కడి వారి ఆర్థిక పరిస్థితిని చూసి జాలి కలిగిందేమో.. వారే అక్కడ రూ.500 నోటు వదిలివెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Indonesia: ఇండోనేషియాలో పడవ మునిగి 15 మంది మృతి.. 19 మంది గల్లంతు
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- AI Job Fears: 'నా ఉద్యోగం సేఫ్నా?'.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
ఢిల్లీలో రోహిణిలోని సెక్టార్ 8లోని ఓ ఇంట్లో దొంగలకు చోరీకి విలువైనదేమీ దొరకకపోవడంతో రూ.500 నోటును వదిలివెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. జులై 20-21 మధ్య రాత్రి జరిగిన ఈ వింత ఘటన ఇంటి యజమాని ఫిర్యాదు చేయడంతో తెరపైకి వచ్చింది. 80 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్ రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జులై 19న సాయంత్రం రామకృష్ణ, తన భార్యతో కలిసి గురుగ్రామ్లో నివసించే తమ కొడుకు వద్దకు వెళ్లాడు. జులై 21 తెల్లవారుజామున తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఇరుగుపొరుగు వారి నుంచి కాల్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ప్రధాన గేటు తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలికి వెళ్లి చూడగా దొంగలు ఏమీ దొంగిలించలేదని తెలిసింది. ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపాడు. ప్రధాన ద్వారం వద్ద రూ.500 నోటు పడి ఉందని చెప్పాడు.
Also Read: Twitter Logo: కనుమరుగుకానున్న ట్విట్టర్ పిట్ట.. కొత్త లోగో ‘ఎక్స్’!
తన ఇంట్లో విలువైన వస్తువులేవీ ఉంచుకోలేదని పోలీసులకు రామకృష్ణ తెలిపాడు. అల్మారాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దొంగల కోసం గాలిస్తున్నారు. తదుపరి విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్కుమార్ను ప్రమోషన్స్’కి రమ్మని అడుక్కున్నా..అడుగడుగునా ఇబ్బంది పెట్టింది.. దర్శకుడు సంచలనం!
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
-
NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ – మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
-
Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
-
AI Job Fears: ‘నా ఉద్యోగం సేఫ్నా?’.. ఏఐ వల్ల సగానికి పైగా ఐటీ ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన! షాకింగ్ రిపోర్ట్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!