Robbery: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామంలో ఆలయంలోనే దొంగతనం చేసేందుకు దుండగులు తెగబడ్డారు. ఆరుళ్ల గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయంలో చోరీకి యత్నించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
Also Read: Police Harassment: స్టేషన్లో ఎస్సై వికృత చేష్టలు.. మైనర్ దుస్తులు విప్పించి, ఫోటోలు తీసి..
శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు గునపం లాంటి ఆయుధాలతో ఆలయంలోకి ప్రవేశించి ఆలయద్వారాలను పగలగొట్టడానికి విఫలయత్నం చేశారు. తలుపులు తెరచుకోకపోవడంతో దొంగలు వెనుదిరిగారు. ఉదయం ఆలయానికి వచ్చిన ఆలయ సిబ్బంది తాళాలు తెరిచారు. దొంగలు చోరీకి యత్నించారని సీసీ కెమెరాలో చూసిన ఆలయ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీలో రికార్డయిన విజవల్స్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. దొంగలను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.