Jangaon: జనగాంలో దారుణం.. మైనర్ బాలికల శరీరంపై కారం చల్లి..
Atrocity in Janagam: ఇంట్లో నుంచి నగదు దొంగలించారన్న కారణంతో ఇద్దరు బాలికలను ఓ ఇంటి యజమాని, ఆయన కుటుంబసభ్యులు చితకబాదిన ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం చెన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఈనెల 3 న ఈ సంఘటన జరిగితే మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read also: Jailer: రజనీ ర్యాంపేజ్… 500 కోట్లు
Also Read
చెన్నూరులో మధుకర్ కుటుంబం నివాసం ఉంటుంది. అయితే వారి ఇంట్లో ఇద్దరు అమ్మాయిలను పనిచేయడానికి పెట్టుకున్నారు. రోజు రావడం మధుకర్ ఇంట్లో పనిచేయడం వంటి పనులు చేసుకునేవారు. అయితే 15 రోజలు క్రితం యజమాని మధుకర్ ఇంట్లో రూ.35వేల వరకు డబ్బులు మాయమయ్యాయి. మధుకర్ ఇంట్లో వారు ఆ ఇద్దరి అమ్మాయిలను అడగ్గా డబ్బులు తీయలేదని సమాధానం ఇచ్చారు. అయితే తీవ్ర ఆగ్రహానికి గురైన యజమాని మధుకర్ ఆ ఇద్దరు మైనర్ బాలికపై పైశాచికంగా వ్యవహరించాడు. పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసి కళ్ళలో కారం పెట్టి దొంగతం చేశారంటూ వేధించారు. దీంతో వారు లేదు దొంగతనం చేయలేదని, ప్రాధేయపడ్డా కనికరించాలేదు యజమాని. పైగా పంచాయితీ కార్యాలయం వద్ద చెట్టుకు కట్టేసిన అందరూ చూస్తు ఉండిపోయారే తప్పా ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వారిద్దరి శరీరంపై కారం చల్లి చితకబాదారు. ఓ బాలిక తల్లిదండ్రులను సైతం తీవ్రంగా కొట్టారు. స్థానిక సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎస్సై శ్రీకాంత్ను వివరణ కోరగా సమాచారం మాత్రం తెలిసిందని సమాధానమిచ్చారు. కేసు నమోదు చేసుకున్నామని, దొంగతనం జరిగిందా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అయితే మరికొందరు మైనర్ బాలికలపై ఏంటీ ఈ అరాచకం అని మండిపడుతున్నారు. పోలీసులకు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మైనర్ బాలికలపై ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Instagram Reels: ఇన్స్టా రీల్స్ మోజు… బండరాళ్ల మధ్య చిక్కుకుని నరకం చూసిన యువకుడు
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో