తెలంగాణను గుజరాత్ మోడల్ లో అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ. తెలంగాణ మోడల్ దేశానికీ ఆదర్శంగా ఉంది.. అనేక పథకాలను చూసేందుకు గుజరాత్ వాళ్ళు తెలంగాణకు వచ్చారన్నారు. గుజరాత్ మోడల్ అని రేవంత్ అనడం వెనుక కారణాలు ఏంటి..? ఆరెస్సెస్ మూలాల ఉన్నాయి కాబట్టే రేవంత్ అలా అన్నారని సుంకె రవి శంకర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ…
ప్రస్తుతం జరుగు (2024) సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో.. చేనేత వర్గాలైన కుర్నీ (నేసే), పద్మశాలిల పూర్తి మద్దతు స్వర్గీయ పద్మశ్రీ మాచాని సోమప్ప ముని మనవడు మాచాని సోమనాథ్కు ఉంటుందని ఎమ్మిగనూరు చేనేతల ఐక్యవేదిక నాయకులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పర్యటన రెండో విడత మంగళవారం ప్రారంభమయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సందర్శించి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి సికింద్రాబాద్లోని జనరల్ బజార్కు వెళ్లి ఆలయంలో ప్రార్థనలు చేశారు. ప్రధాన మంత్రి అమ్మవారికి పట్టు చీర , ఇతర నైవేద్యాలను సమర్పించారు. ఆ తర్వాత, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO) ను ప్రారంభించేందుకు బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరిన మోడీ,…
బెంగళూరు సెంట్రల్ జైలు నుంచి లష్కరే తోయిబా తీవ్రవాదులు పరారీ కేసులో దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేస్తోంది. ఢిల్లీ, ముంబయి, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణతో పాటు మరో రెండు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఎన్ఐఏ బృందాలు సోదాలు చేస్తున్నాయి.
పాకిస్థాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్కు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. ఓట్ల రిగ్గింగ్ ఆరోపణలతో అసంపూర్తిగా జరిగిన ఎన్నికల తర్వాత దాదాపు ఒక నెల తర్వాత, నగదు కొరతతో ఉన్న దేశం పగ్గాలను రెండవసారి స్వీకరించిన షరీఫ్ సోమవారం పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.
శుక్రవారం(మార్చి 1) జార్ఖండ్లోని దుమ్కాలో సామూహిక అత్యాచారానికి గురైన స్పానిష్ మహిళ భర్తకు జార్ఖండ్ పోలీసులు రూ.10 లక్షల పరిహారం అందజేశారు. అత్యాచారానికి గురైన స్పానిష్ పర్యాటకురాలికి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రూ.10 లక్షల (11,126.20 యూరోలు) పరిహారం అందించింది. ఆమె ఖాతాకు డబ్బు బదిలీ అయింది. చెక్కు కాపీని, నగదు బదిలీకి సంబంధించిన లేఖను బాధితురాలి భర్తకు దుమ్కా డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు దొడ్డే, ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖేర్వార్ అందించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ మహబూబ్నగర్, నాగర్కర్నూల్ నేతలతో సమావేశం కానున్నారు. అలాగే నేడు మరో రెండు సీట్లకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి నామ నాగేశ్వర్రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో దిగనున్నారు. Multi-Starrer Movie: టాలీవుడ్లో మరో మల్టీస్టారర్..…
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్షాలు కాలు దువ్వుకుంటున్నాయి. టీడీపీ-జనసేన కూటమి ఆధ్వర్యంలో ఇవాళ జయహో బీసీ సభ జరగనుంది.
పసిడి ప్రియులకు భారీ ఊరట.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు .. ఎంతంటే? పసిడి ప్రియులకు భారీ ఊరట… ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి .. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గాయి.. పది గ్రాముల బంగారంపై 10 రూపాయలు, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర…