2018లో జరిగిన అంకిత్ సక్సేనా హత్య కేసులో తీస్ హజారీ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురు దోషులకు తీస్ హజారీ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మహ్మద్ సలీం, అక్బర్ అలీ, అతని భార్య షహనాజ్ బేగంలకు కోర్టు శిక్ష విధించింది. దీంతో పాటు ముగ్గురు నిందితులకు ఒక్కొక్కరికి రూ.50,000 జరిమానా కూడా విధించింది. ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ.. దోషుల వయస్సు, నేర చరిత్రను పరిగణనలోకి తీసుకుని వారికి మరణశిక్ష విధించడం లేదని కోర్టు పేర్కొంది. ముగ్గురు దోషులకు విధించిన జరిమానా మొత్తాన్ని అంకిత్ సక్సేనా కుటుంబానికి ఇవ్వనున్నారు.
HanuMan OTT: హనుమాన్ ఓటీటీ ఎంట్రీ కోసం వెయిట్ చేసే వారికి బాడ్ న్యూస్?
సమాచారం ప్రకారం.. హంతకులు అతని వివాహాన్ని ఆపాలనుకున్నందున అంకిత్ను హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2018 ఫిబ్రవరి 1న అంకిత్ చివరిసారిగా తన ప్రియురాలితో ఫోన్లో మాట్లాడాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో.. రాత్రి 8.30 గంటల సమయంలో అంకిత్ ను కలవడానికి వెళ్లింది. తన తల్లిదండ్రులను ఇంట్లో ఉంచి తాళం వేసి.. అంకిత్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్లింది. అంకిత్ తన ప్రియురాలిని ఠాగూర్ గార్డెన్ మెట్రో స్టేషన్లో కలవాల్సి ఉండగా నిర్ణీత సమయానికి అక్కడికి చేరుకోలేకపోయాడు.
Ajith: హాస్పిటల్ లో తాలా.. అసలు ఆయనకు ఏమైంది.. ?
ఇదిలా ఉంటే.. బాలిక తల్లిదండ్రులు ఇరుగుపొరుగు వారి సహాయంతో ఇంటి తలుపులు తెరిచారు. ఆ తర్వాత వారు అంకిత్ ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యలో అంకిత్ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు గుర్తించి యువతి తల్లిదండ్రులు అంకిత్ పై దాడి చేశారు. ఈ విషయాన్ని స్థానికులు అంకిత్ తల్లిదండ్రులుకు సమాచారం అందించారు. దీంతో వెంటనే.. అంకిత్ కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని.. గొడవ ఆపేందుకు ప్రయత్నించగా వారిపై కూడా దాడి చేశారు. అంకిత్ తల్లిని కొడుతుండగా.. ఆపేందుకు ప్రయత్నించగా, అమ్మాయి తండ్రి మెడపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అంకిత్ అక్కడికక్కడే మృతి చెందాడు.