గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు బీజేపీ అమలు చేయలేదని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న నల్ల ధనం నోట్ల రద్దీతో వైట్ మనీ గా మారిపోయిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కు చట్ట బద్ధత కల్పించాలన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ రంగాలను నిర్వీర్యం చేశారని, క్రూడాయిల్ దరలు తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్…
సాగునీటి సదుపాయం లేకపోవడం, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. పంట నష్టానికి ఎకరాకు రూ. 25,000 పరిహారం అందించాలని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా.. కనీస మద్దతు ధరతో పాటు క్వింటాల్కు రూ. 500 బోనస్, రైతు భరోసా పెట్టుబడి మద్దతు మరియు రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయాలని కోరింది. ఆపదలో ఉన్న…
ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో.. పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్ అధికారులు, ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం ఐదు గంటల్లోగా బదిలీ కావాలని ఈసీ పేర్కొంది. అంతేకాకుండా.. తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలన్న ఈసీ తెలిపింది.
వైజాగ్ ఎంపీ సీటుపై కూటమిలో కుంపటి అంటుకుంది. ఆ సీటు.. బీజేపీకి కేటాయించాలని కమలం పార్టీలో డిమాండ్ ఊపందుకుంది. ఈ క్రమంలో.. వివిధ మోర్చాల ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో.. ఓట్ బ్యాంక్, గతంలో గెలిచిన సీటును పొత్తుల పేరుతో వదలడం బీజేపీకి నష్టం చేయడమేనని అసమ్మతి వర్గం అంటోంది. కాగా.. వైజాగ్ నుంచి పోటీ చేసేందుకు రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ ఆశ పెట్టుకున్నారు. ఇతర పార్టీల కుటుంబ అవసరాల కోసం సీటును బీజేపీ…
కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్ ను తలపిస్తున్నాయన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి. ఇవాళ ఆయన గాంధీ భవన్లో మీడియతో మాట్లాడుతూ.. ఆ దర్బార్ మాటలు వినివిని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన సిగ్గు రావడం లేదని ఆయన విమర్శించారు. పోలీసుల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్ పెంచి పోషించారని, ఆ సైన్యంతోనే ఫోన్ ట్యాపింగ్ చేయించారన్నారు. ఆ సైన్యమే ఒక్కొక్కటి బయట పెడుతున్నా. కేటీఆర్ ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు…
ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విశాఖలో సముద్రంలో ఆరుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. నిన్న సాయంత్రం విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. వైజాగ్ హార్బర్ నుంచి V1-MO -2736 నెంబర్ గల బోట్ లో వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారు మత్య్సకారులు. అయితే వారి ఆచూకీ తెలియకపోవడంతో ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డ్ సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నారు.
ఈ నెల 6న రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంగళశారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 వ తేదీ సాయంత్రం సభ నిర్వహించనున్నట్లు.. సభకు తెలంగాణ జనజాతర పేరు ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు. జన జాతర వేదిక మీది నుండి మేనిఫెస్టో విడుదల…
ఓ వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన జర్నలిస్ట్ గున్వంత్ కలాల్ పై చిరుత దాడి చేసేందుకు ప్రయత్నం చేసింది. అతడి కాలును నోటితో కరిచి పట్టుకోవడంతో అతడు ధైర్యంగా పోరాడి చిరుతను గట్టిగా పట్టేసుకున్నాడు. దాని దవడ, మెడను గట్టిగా పట్టుకుని.. ఆ తర్వాత చిరుత పులిని బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని ఉదయగిరిని సిరుల గిరిగా చేసుకుందామని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పేర్కొన్నారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం నందు మహిళా శక్తి మహిళా నేతలతో కలిసి కాకర్ల సురేష్ సోమవారం సమావేశం నిర్వహించారు.
ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి గెలుపే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు ఉదయగిరి బిట్ టూ ఇంఛార్జి గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి, నియోజకవర్గంలోని మండల నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.