సీఎం పేషీలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, రేవు ముత్యాల రాజు, నారాయణ్ భరత్ గుప్తాలను ప్రభుత్వం బదిలీ చేసింది.
వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్మాణమవుతున్న రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. శిలాఫలకంపై వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ భరత్ రామ్ పేరుతో పాటు బీజేపీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరు ఉన్నా పట్టించుకోకండా టీడీపీ శ్రేణులు విరుచుకుపడ్డాయి.
గత ఏడాది కవాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) నుండి 94 కుటుంబాలను తరలించిన రాష్ట్ర అటవీ శాఖ ఇప్పుడు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) నుండి దాదాపు 415 కుటుంబాలను తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు సార్లపల్లి, కుడిచింతలబైలు, కొల్లంపేట, తాటిగిండాల గ్రామాలకు చెందిన 415 కుటుంబాలను తరలించేందుకు ఏటీఆర్ అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ కుటుంబాలను నాగర్ కర్నూల్-కొల్లాపూర్ మార్గంలోని బాచారం తదితర ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంది. ATR పరిమితుల…
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎం ధ్వంసం సహా మరో మూడు కేసులు పిన్నెల్లిపై పల్నాడు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
మోడీ, అమిత్ షాపై సంచలన ఆరోపణలు మోడీ, అమిత్ షాపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్టాక్ మార్కెట్ల కుంభకోణానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. స్టాక్ మార్కెట్ల స్కామ్పై జేపీసీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జూన్3న స్టాక్ మార్కెట్లు పెరుగుతాయని హోంమంత్రి చెప్పారని.. ఈ విషయం ఆయనకు ఎలా తెలుసని ప్రశ్నించారు. ఇది స్టాక్ మార్కెట్లో అత్యంత పెద్ద స్కామ్ అని చెప్పుకొచ్చారు.…
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని వైసీపీ నిర్ణయించింది. ప్రస్తుతం జగన్ క్యాంపు కార్యాలయమును వైసీపీ పార్టీ కార్యాలయంగా మార్చాలని నిర్ణయం తీసుకుంది.
అమరావతి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ బయలుదేరారు. తన పర్యటన సందర్భంగా పోలీసు ట్రాఫిక్ ఆంక్షలపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తన పర్యటన సందర్భంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేలా ట్రాఫిక్ ఆపొద్దని నిన్ననే(బుధవారం) చంద్రబాబు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలును నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం, శనివారం హైదరాబాద్ లో ఇంటర్నేషనల్ రైస్ సమ్మిట్ జరుగుతోందని, 22 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సదస్సులు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ కమిడిటీ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ జరుగుతోంద ఆయన వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొట్టమొదటి సారిగా భారతదేశంలో మన హైదరాబాదులో ఈ సమ్మిట్ నిర్వహించటానికి నిర్ణయించుకున్నారని, ఇది తెలంగాణకు గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 150 ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారని, వివిధ దేశాల వరి…