హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం.. ఎల్లో అలర్ట్ జారీ.. నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించాయి. గురువారం భారీ వర్షాలతో రాష్ట్ర రాజధాని, పరిసర ప్రాంతాలను ముంచెత్తాయి. ఎస్,ఆర్.నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హయత్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, మలక్పేట, ఆర్టీసీ క్రాస్రోడ్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే కుండపోత వర్షం కారణంగా హైదరాబాద్ అంతటా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. భారత వాతావరణ శాఖ ప్రకారం రాత్రి వరకు చెదురుమదురు వర్షాలు…
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. చంద్రబాబు, లోకేష్, ఎన్టీఆర్ బ్యానరుకు 164 బిందెలతో పాలాభిషేకం చేశారు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు.
రేపటి నుంచి ప్రజావాణి పునఃప్రారంభం కానుంది. లోక్ సభ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల తాత్కాలిక వాయిదా పడింది. అయితే.. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసినందున తిరిగి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి వెల్లడించారు. ప్రజావాణి అర్జీల స్వీకరణ కార్యక్రమం రేపు శుక్రవారం నుంచి పునః ప్రారంభం కానున్నట్లు ప్రజావాణి ఇంచార్జీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్…
దేశంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్ భారీ పతనం నుంచి కోలుకున్నాయి. సెన్సెక్స్ 692, నిఫ్టీ 201 పాయింట్లు పెరిగాయి. ఈ వారంలో షేర్ మార్కెట్ రెండు సార్లు రికార్డులు సృష్టించింది. సోమవారం రోజున మార్కెట్ సూచీలు ఆల్ టైమ్ హై వద్ద ముగిశాయి. మంగళవారం రోజున మార్కెట్లో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ఒడిదుడుకులకు ఎన్నికల ఫలితాలే కారణం. బుధ, గురువారాల సెషన్లలో స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు కొనసాగింది. కాగా.. భారీ…
ఈ నెల 11న టీడీఎల్పీ సమావేశం జరుగుతుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. టీడీఎల్పీలో చంద్రబాబుని నేతగా ఎన్నుకుని గవర్నర్ కు నివేదిక పంపుతామన్నారు.
ఓ మహిళ ప్రయాణికురాలు రైలులో ప్రయాణిస్తున్న వేళ.. తాను పడిన బాధను రెడ్డిట్లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ భారతదేశంలో ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత గురించి మరోసారి లేవనెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. వనాంచల్ ఎక్స్ప్రెస్ స్లీపర్ కోచ్లో వెళ్తున్న తనను.. ఓ వ్యక్తి ఎలా వేధించాడో తెలిపింది. తాను.. స్లీపర్ కోచ్లో ఒంటరిగా ప్రయాణించడం ఇదే తొలిసారి అని చెప్పింది. కోచ్లో ఇద్దరు మగ ప్రయాణికులు తన ముందు సీట్లోనే కూర్చున్నారని.. అంతా బాగానే ఉందని…
జూన్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీకి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ బస్సులు నగరంలోని వివిధ ప్రాంతాలను ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు కలుపుతాయి. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి టీజీఎస్ఆర్టీసీ బస్సులు, రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్ స్టేషన్లు , విమానాశ్రయం నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. ప్రత్యేక బస్సులు కూడా ముఖ్యమైన ప్రదేశాల…
ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ భేటీ నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన టీడీపీపీ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ఎంపీలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.