ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం.. ఇలా వరుసగా ఇప్పటి వరకు మూడు శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు మరో శ్వేత పత్రం విడుదల చేశారు. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల…
రైతు రుణమాఫీకి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రైతు రుణమాఫీ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు (ఉమ్మడిగా “బ్యాంకులు” అని పిలువబడుతాయి) వాటి బ్రాంచ్ ల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. 12-12-2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరయిన లేక రెన్యువల్ అయిన రుణాలకు 09-12-2023 తేదీ నాటికి…
వివాదాస్పద భోజ్శాల-కమల్ మౌలా మసీదు సముదాయం యొక్క శాస్త్రీయ సర్వే నివేదికను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మధ్యప్రదేశ్ హైకోర్టులోని ఇండోర్ బెంచ్కు సోమవారం సమర్పించింది. ASI తరపు న్యాయవాది హిమాన్షు జోషి 2000 పేజీల నివేదికను హైకోర్టు రిజిస్ట్రీకి సమర్పించారు. కాగా.. ఈ కేసును జులై 22న హైకోర్టు విచారణ జరుపుతుందని తెలిపారు.
ఏపీలో కేఎల్ రావు జయంతిని ఘనంగా సీఎం చంద్రబాబు మొదలుపెట్టారని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం కేఎల్ రావు జయంతి నిర్వహించలేదన్నారు. అక్రమ ఇసుక తరలించడం మీదే గత ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు, గంజాయి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరంలో జరిగిన ఘటనలు అత్యంత హేయం, దారుణమని మంత్రి వ్యాఖ్యానించారు. విజయనగరంలో మైకంలో తాత వరుస వ్యక్తి చిన్నారిపై అత్యాచారం చేశాడని.. ముచ్చుమర్రిలో బాలికను హత్య చేసి రాయి కట్టి మరీ రిజర్వాయర్లోకి తోసేశారని ఆమె తెలిపారు.
రేవంత్ కు పరిపాలన చేత కావడం లేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసాం వెంకటేశ్వర్లు విమర్శలు చేశారు. ఇవాళ ఆయన బీజేపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడ్ పల్లి లైబ్రరీ లో మోకాళ్ళ మీద నిలబడి నిరుద్యోగుల దగ్గర ఓట్లు అడిగారన్నారు. రేవంత్ కి జాబ్ క్యాలెండర్ దొరకలేదా? అని ఆయన ప్రశ్నించారు. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ లు చేస్తున్నారని, ఏటా 3 నుంచి 5శాతం ఉద్యోగులు రిటైర్డు అవుతారని…
పూరీ జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. బయటి రత్న భాండాగారంలోని అన్ని ఆభరణాలు తరలించామని ఆలయ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపారు. లోపల రత్న భాండాగారం తెరుచుకోకపోవడతో తాళాలు పగలగొట్టి తెరిచినట్లు పేర్కొన్నారు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నీ అల్మారాలు, లాకర్లలో పెట్టారు.
సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని తెలివిగా వాడుకుంటూ కోట్లు నొక్కేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. పదే పదే నేరాలు జరగడం తీవ్రతకు అద్ధం పడుతోంది. బెజవాడలో గత 10 రోజుల్లో 5గురు సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో డబ్బుల్లో పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించారు.
జింబాబ్వేతో జరిగిన చివరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 42 పరుగుల తేడాతో ఇండియా సూపర్ విక్టరీ సాధించింది. టీమిండియా బౌలర్లు మరోసారి అదరగొట్టడంతో గెలుపొందారు. 168 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.