Vijayawada Cyber Crime: వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబు ఫోటో పెట్టి ఫోన్లు.. కేటుగాళ్ల కొత్త వ్యూహం
- విజృంభిస్తున్న సైబర్ నేరగాళ్లు
- కోట్లు నొక్కేస్తున్న కేటుగాళ్లు
- సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శినంటూ పలువురు ఉన్నతాధికారులకు ఫోన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada Cyber Crime: సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని తెలివిగా వాడుకుంటూ కోట్లు నొక్కేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. పదే పదే నేరాలు జరగడం తీవ్రతకు అద్ధం పడుతోంది. బెజవాడలో గత 10 రోజుల్లో 5గురు సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో డబ్బుల్లో పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించారు. విజయవాడ భవానీపురానికి చెందిన మహిళను కొరియర్ పేరుతో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. మీకు వచ్చిన పార్సిల్లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదరగొట్టారు. ముంబై క్రైం పోలీసుల పేరుతో ప్రశ్నలతో భయపెట్టారు. భయపడిన బాధితురాలు రెండు దఫాలుగా రూ.32 లక్షలు సమర్పించుకుంది.
Read Also: Crime News: కట్టుకున్నోడే కడతేర్చాడు.. రఘునాథపాలెం రోడ్డు ప్రమాద ఘటనలో వీడిన మిస్టరీ
Also Read
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
ఈకేవైసీ పేరుతో బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని నందిగామకు చెందిన మహిళను మోసం చేశారు కేటుగాళ్లు. బ్యాంక్ నుంచి లింక్ పంపుతున్నామని చెప్పగా.. ఆ లింక్ను క్లిక్ చేసిన వెంటనే రూ.5లక్షలు పోగొట్టుకుంది. మరో ఘటనలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శినంటూ పలువురు ఉన్నతాధికారులకు గత వారంలో ఫోన్లు వెళ్లాయి. వాట్సాప్ డీపీగా సీఎం చంద్రబాబుతో దిగిన ఫోటో పెట్టి కాల్స్ చేశారు. ఈ విషయం గతంలో సీఎం చంద్రబాబుకు కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాసరావు దృష్టికి వెళ్లడంతో ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
క్రిప్టో కరెన్సీ , బ్లాక్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తులను నిలువు దోపిడీ చేశారు సైబ నేరగాళ్లు. పెట్టుబడికి అధిక ఆదాయమని చెప్పడంతో గుణదల నర్సయ్య వీధికి చెందిన వెంకటేశ్వరరావు రూ.1.21 కోట్లు విడతల వారీగా పెట్టుబడి పెట్టారు. పెట్టుబడి ఖాతాలో కనబడుతోంది తప్ప విత్డ్రా చేయడానికి అవకాశం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే తరహాలో విద్యాధరాపురానికి చెందిన భాను ప్రకాష్ కూడా మోసపోయారు. రూ.11 లక్షల వరకూ పెట్టుబడి పెట్టి మోసపోయారు. ఈ వ్యవస్థ అంతా సైబర్ నేరగాళ్ల చేతిలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వారు 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. అయితే విచారణకు కాస్తా సమయం పడుతుంది పోలీసులు వెల్లడిస్తున్నారు.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
-
Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
-
Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
-
Lakshmi Narayana Yoga: తులారాశిలో లక్ష్మీనారాయణ యోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!