Mohammad Amir: ఛీ.. మీ వక్ర బుద్ది మారదా? భారత్ పై నోరుపారేసుకున్న పాకిస్తాన్ ప్లేయర్.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Amir: పాకిస్తాన్ ఆటగాళ్లకు వారి జట్టు సంగంతి పట్టించుకుంటారో లేదో కానీ.. అంతకంటే ఎక్కువగా భారత జట్టుపై విమర్శలు చేయడానికి రెడీ ఐపోతుంటారు. టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా ఆటపై పాకిస్థాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. “భారత్ సెమీఫైనల్కు చేరుకోదని” అమీర్ గతంలో చేసిన జోస్యం తప్పడంతో నెటిజన్లు అతడిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. పాకిస్థానీ టీవీ షో ‘హార్నా మనా హై’ (Haarna Mana Hai) లో పాల్గొన్న అమీర్, భారత్ పై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
రూ. 4,000 డిస్కౌంట్తో పాటు ఉచిత ఇయర్బడ్స్.. నేటి నుంచి iQOO 15R సేల్ షురూ..!
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
సూపర్ 8లో దక్షిణాఫ్రికాతో ఓటమి తర్వాత భారత్ సెమీస్ చేరదని అమీర్ మాట్లాడిన సంగతి తెలిసిందే. కానీ జింబాబ్వే, వెస్టిండీస్లపై వరుస విజయాలతో భారత్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. దీనిపై అమీర్ స్పందిస్తూ.. క్రికెట్ పరంగా చూస్తే భారత్ ఇంకా మంచి క్రికెట్ ఆడటం లేదని అన్నాడు. ముఖ్యంగా భారత్ ఫీల్డింగ్ ఏమాత్రం బాగోలేదని, మ్యాచ్ లో 3 క్యాచ్లు వదిలేయడమే కాకుండా ఫీల్డింగ్లో కూడా తడబడ్డారని పేర్కొన్నాడు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా మినహా మిగిలిన బౌలర్లందరూ భారీగా పరుగులు ఇచ్చుకున్నారని విమర్శించాడు.
ఇంకా అమీర్ మాట్లాడుతూ.. పెద్ద జట్లపై హార్దిక్ పాండ్యా ఎప్పుడూ రాణించడని, విండీస్తో మ్యాచ్ లో 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడని అమీర్ అన్నాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ గా పేరొందిన వరుణ్ చక్రవర్తి బౌలింగ్ను వెస్టిండీస్ సమర్థవంతంగా ఎదుర్కొందని, సెమీఫైనల్ చేరిన జట్లు స్పిన్నర్లను బాగా ఆడగలవని.. అందుకే భారత్ ఇంకా ఈ టోర్నీలో భారత్ ఫేవరెట్ కాదని అభిప్రాయపడ్డాడు.
Shivam Dube The Finisher: శివమ్ దూబే.. ‘ది టీమిండియా ఫినిషర్’!
ఇక వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో షిమ్రాన్ హెట్ మేయర్ అవుట్ కావడంపై అమీర్ ఒక ‘కాంట్రవర్సీ’ని తెరపైకి తెచ్చాడు. బుమ్రా బౌలింగ్లో సంజూ శాంసన్ క్యాచ్ పట్టగా.. అంపైర్ అవుట్ ఇచ్చాడు. రివ్యూలో బంతి బ్యాట్కు తగిలినట్లు కనిపించినా హెట్ మేయర్ అసంతృప్తి చెందాడు. దీనిపై అమీర్ మాట్లాడుతూ.. “నా దృష్టిలో హెట్ మేయర్ అవుట్ కాదు. అది ఓ వివాదాస్పద నిర్ణయం. ఒకవేళ అతను మరికొంత సేపు క్రీజులో ఉండి ఉంటే వెస్టిండీస్ స్కోరు 220-230కి చేరి ఉంటే.. ఈ సమయానికి భారత్ టోర్నీ నుండి నిష్క్రమించేది” అని వ్యాఖ్యానించాడు. ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా గురువారం జరగనున్న సెమీఫైనల్ పోరులో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన SIR ప్రక్రియ.. గందరగోళం మధ్యే డిజిటలైజేషన్
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..