Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుతో పాటు హెచ్ఆర్ఏ పెంపుకు ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే హెచ్ఆర్ఏ పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిలోనే డీఏను పెంచడంతో అందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చివరిసారిగా 2021 జూలైలో పెరిగింది. అప్పుడు డీఏ తొలిసారి 25 శాతం దాటి 28 శాతానికి పెరిగింది. ఇప్పుడు కూడా డీఏను సవరించడంతో కొత్త స్థాయికి చేరుకుంది. దీంతో మళ్లీ హెచ్ఆర్ఏ కూడా పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Bandi Sanjay : హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు
Also Read
కొన్ని మీడియాలు తెలుపుతున్న ప్రకారం.. హెచ్ఆర్ఏ త్వరలోనే పెరగనున్నట్లు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు పనే చేసే ప్రదేశాన్ని బట్టి హెచ్ఆర్ ఇస్తారని తెలుపుతున్నారు. x, y, z కేటగిరీలుగా ఈ ప్రదేశాలను విభజించారు. x కేటగిరీ ప్రదేశాల్లో పని చేసే ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ 27 శాతం ఉంటుంది. అలాగే y గ్రూప్ ఉద్యోగులకు ఇది 18 నుంచి 20 శాతంగా ఉంటుంది. ఇక Z గ్రూప్ ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం వరకు ఉంటుందని తెలుపుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 3 శాతం వరకు పెరగవచ్చు అని తెలుస్తోంది. x గ్రూప్ ఉద్యోగులకు మూడు శాతం, y గ్రూప్ ఉద్యోగులకు రెండు శాతం, z గ్రూప్ ఉద్యోగులకు ఒక్క శాతం పెరిగే అవకాశముంది. ఈ పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ 27 శాతం నుంచి 30 శాతానికి పెరగనుంది.
Read Also: Om Raut Responds: ఆదిపురుష్ ట్రోలింగ్స్ పై స్పందించిన ఓం రౌత్.. నేను చేసిన తప్పల్లా ఇదే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ ను పెంచుతూ.. ఈ ఏడాది మార్చి 24న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి దీన్ని వర్తింపజేసింది. దీంతో అప్పటి వరకు 38 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. డియర్నెస్ అలవెన్స్ , డియర్నెస్ రిలీఫ్ కారణంగా కేంద్ర ఖజానాపై ఖజానాపై ఏటా రూ. 12,815.60 కోట్ల భారం పడనుంది. దీని ద్వారా దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 69.76 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములర్కు అనుగుణంగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచిన విషయం తెలిసిందే. ఒడిశా, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
- Tags
- employees
- Govt
- hra
- increase
- telugu news
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!