Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ పెంపుతో పాటు హెచ్ఆర్ఏ పెంపుకు ఛాన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే హెచ్ఆర్ఏ పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చిలోనే డీఏను పెంచడంతో అందుకు అనుగుణంగా హెచ్ఆర్ఏ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చివరిసారిగా 2021 జూలైలో పెరిగింది. అప్పుడు డీఏ తొలిసారి 25 శాతం దాటి 28 శాతానికి పెరిగింది. ఇప్పుడు కూడా డీఏను సవరించడంతో కొత్త స్థాయికి చేరుకుంది. దీంతో మళ్లీ హెచ్ఆర్ఏ కూడా పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: Bandi Sanjay : హుజురాబాద్, మునుగోడు, దుబ్బాకలో కాంగ్రెస్కు డిపాజిట్ రాలేదు
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
కొన్ని మీడియాలు తెలుపుతున్న ప్రకారం.. హెచ్ఆర్ఏ త్వరలోనే పెరగనున్నట్లు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు పనే చేసే ప్రదేశాన్ని బట్టి హెచ్ఆర్ ఇస్తారని తెలుపుతున్నారు. x, y, z కేటగిరీలుగా ఈ ప్రదేశాలను విభజించారు. x కేటగిరీ ప్రదేశాల్లో పని చేసే ఉద్యోగులకు హెచ్ ఆర్ ఏ 27 శాతం ఉంటుంది. అలాగే y గ్రూప్ ఉద్యోగులకు ఇది 18 నుంచి 20 శాతంగా ఉంటుంది. ఇక Z గ్రూప్ ఉద్యోగులకు 9 నుంచి 10 శాతం వరకు ఉంటుందని తెలుపుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 3 శాతం వరకు పెరగవచ్చు అని తెలుస్తోంది. x గ్రూప్ ఉద్యోగులకు మూడు శాతం, y గ్రూప్ ఉద్యోగులకు రెండు శాతం, z గ్రూప్ ఉద్యోగులకు ఒక్క శాతం పెరిగే అవకాశముంది. ఈ పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ 27 శాతం నుంచి 30 శాతానికి పెరగనుంది.
Read Also: Om Raut Responds: ఆదిపురుష్ ట్రోలింగ్స్ పై స్పందించిన ఓం రౌత్.. నేను చేసిన తప్పల్లా ఇదే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ ను పెంచుతూ.. ఈ ఏడాది మార్చి 24న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి దీన్ని వర్తింపజేసింది. దీంతో అప్పటి వరకు 38 శాతంగా ఉన్న డీఏ 4 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. డియర్నెస్ అలవెన్స్ , డియర్నెస్ రిలీఫ్ కారణంగా కేంద్ర ఖజానాపై ఖజానాపై ఏటా రూ. 12,815.60 కోట్ల భారం పడనుంది. దీని ద్వారా దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే 69.76 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. డీఏ పెంపు 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిన ఫార్ములర్కు అనుగుణంగా ఉన్నట్లు ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను పెంచిన విషయం తెలిసిందే. ఒడిశా, తమిళనాడు, హర్యానా వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
- Tags
- employees
- Govt
- hra
- increase
- telugu news
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..