Udayabhanu : యాంకర్ ఉదయభాను సంచలన కామెంట్స్ చేసింది. తెలుగు యాంకరింగ్ ఫీల్డ్ లో భారీగా సిండికేడ్ ఎదిగింది.. రేపు ఈవెంట్ ఉండగా.. చేస్తామో లేదో గంట ముందు వరకు గ్యారెంటీ ఉండదని స్టేజిమీదే తేల్చి చెప్పేసింది. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సుహాస్ హీరోగా వస్తున్న ఓభామ అయ్యోరామ ఈవెంట్ కు ఉదయభాను యాంకరింగ్ చేసింది. ఆమె చాలా ఏళ్ల తర్వాత ఈవెంట్ చేయడంతో ఒకతను మాట్లాడుతూ.. ఉదయ భాను గారు చాలా…
థియేటర్ల బంద్ పిలుపు నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో టాలీవుడ్ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసేందుకు నిర్ణయించారు. అందుకోసం టాలీవుడ్ నుండి ఎవరెవరు వెళ్లాలి అనే దానిపై మీటింగ్స్ కూడా నిర్వహించి కొందరి పేర్లతో లిస్ట్ కూడా రెడీ చేసారు. వారిలో పలువురు ప్రముఖ స్టార్ హీరోలు, నిర్మాతలు దర్శకులు ఉన్నారు. Also Read : HHVM : హరిహర… ఏమిటా…
Allu Aravind : సినీ నిర్మాత అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నడూ ఎలాంటి కేసుల్లో ఇరుక్కోని అరవింద్ సడెన్ గా ఈడీ ముందు హాజరుకావడం సంచలనం రేపింది. ఆయన్ను మూడు గంటల పాలు అధికారులు ప్రశ్నించారు. ఓ బ్యాంక్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నించారు 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్…
ప్రభాస్ స్నేహితులు, సన్నిహితుల ఆధ్వర్యంలో నడుస్తున్న యూవీ క్రియేషన్స్ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సదరు సంస్థ నిర్మించింది. తాజాగా ఈ సంస్థ అదొక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం, ఒక గుర్తు తెలియని వ్యక్తి మా కంపెనీ ప్రతినిధినని చెప్పుకుంటూ నటీమణులను వారి ప్రతినిధులను కలిసి ఫ్రాడ్ ఆఫర్లు ఇస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం: సదరు వ్యక్తికి యూవీ…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనిత అనారోగ్యంతో చనిపోవడంతో తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె అసలు పేరు వైఘారెడ్డి కాగా, ఇద్దరి జాతకాలను బట్టి పేరును మార్చారని అంటారు. మొదటి భార్య అనిత మరణాంతరం దిల్ రాజు ఒంటరిగా ఉంటున్ననేపథ్యంలో అతనికి తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకి ఓ బాబు కూడా…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వచ్చి దాదాపు 6 నెలలు పూర్తవుతుంది. ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ నిలిచింది. ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కూడా అద్భుతంగా ఉండాలని సాదాసీదా కథలను ఎంచుకోకుండా సాలిడ్ ప్రాజెక్టులను మాత్రమే ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు వెంకీ మామ. కొన్నాళ్లపాటు కథలు విన్న ఆయన తర్వాత వెకేషన్ కి బయటికి వెళ్ళాడు. Also Read:Thammudu:…
రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో పర్సంటేజీ విధానం లెక్కన సినిమాలాడించాలా లేక రెంటల్ విధానం లెక్కన ఆడించాలా అనే విషయం మీద కొన్ని ఇబ్బందులు ఎదురైన సంగతి తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్లందరూ ఖచ్చితంగా పర్సంటేజీ విధానంలోనే సినిమాలు ఆడించాలని లేదంటే థియేటర్లో మూసేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పాటు అయింది. Also Read:Icon Movie : బన్నీ వదిలేసిన ‘ఐకాన్’.. కొత్త హీరో అతనేనా..? ఈ కమిటీలో సభ్యులుగా కేఎల్…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో సినీ ఇండస్ట్రీ పెద్దల సమావేశం ఆదివారం నాడు సాయంత్రం 4గంటలకి అమరావతిలో జరగనుంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహించబోతున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సుమారు 35 మంది ప్రముఖులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు, దర్శకులు, నటులు, నటీమణులు పాల్గొననున్నారు. ఈ భేటీలో సినిమాల్లో తమకు ఎదురవుతున్న సమస్యలు, ఏపీలో షూటింగ్లకు పర్మిషన్, లొకేషన్ సమస్యలు, పన్నుల విధానం, సినీ పరిశ్రమ అభివృద్ధి తదితర అంశాలపై…
ఒకప్పుడు సినిమాలను మెయిన్ మీడియా బాగా పుష్ చేసేది. సినిమాల మీద మంచి పాజిటివ్ అభిప్రాయం కలిగేలానే ప్రమోషన్స్ ఉండేవి. కానీ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు పరిస్థితి మారింది. నిర్మాతలు తమకు పుష్ ఇచ్చి సపోర్ట్ చేసిన మీడియా మీద కృతజ్ఞత లేకుండా సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తున్నారు. అందరూ అని అనలేం, కానీ కొంతమంది నిర్మాతలు తమ సినిమా బాగున్నా, బాగోకపోయినా, పెయిడ్ క్యాంపెయిన్లు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో పాపులారిటీ…
తాజాగా, నిన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కొత్త కార్యవర్గ ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించి కొత్త సెక్రటరీ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. అంతేకాక, ఒక హీరో గురించి ప్రస్తావిస్తూ, ఆయన చివరిగా నటించిన సినిమా థియేటర్లలో రెండు కోట్ల రూపాయలు కూడా రాబట్టలేదని, కానీ తర్వాత సినిమాకు 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారని ఆరోపించారు. ఆ హీరో ఎవరో కాదు, సిద్ధు జొన్నలగడ్డ అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.…