CM Revanth Reddy: తెలుగు ప్రజల గుండెల్లో కోటా శ్రీనివాసరావు చిరస్థాయిగా ఉంటారు..
- కోట శ్రీనివాసరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం..
- విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట మృతి సినీ రంగానికి తీరని లోటు..
- కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కోట శ్రీనివాసరావు మృతి సినీ రంగానికి తీరని లోటని తెలిపారు. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం. అలాగే, నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేశారు.750కి పైగా సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో తన నటనతో అలరించాలని గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు మృతి సినీ లోకానికి తీరని లోటని అన్నారు. ఆయన చేసిన పాత్రలు సమాజంలో మార్పు తెచ్చేలా ఉండేవని పేర్కొన్నారు. కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read Also: KOTA : రాజకీయాల్లోను ‘కోట’ ముద్ర.. ఎక్కడ నుండి ఎమ్మెల్యేగా గెలిచారో తెలుసా.?
Also Read
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
- Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
- CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
- HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. 'హ్యామ్' ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
మరోవైపు, నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు మృతి బాధాకరం.. ఆయన మరణం నన్ను వ్యక్తిగతంగా కలిచి వేసిందన్నారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలను ఆయన పోషించారు.. ఆయన ప్రతిభకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గొప్ప నటుడు.. 9 నంది పురస్కారాలు అందుకున్న కోటా.. శాసన సభ్యునిగా ప్రజా సేవలో నిమగ్నం అయ్యారని చెప్పుకొచ్చారు. ఆయన సినీ ప్రయాణంలో పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తూనే, విలన్ గా ముచ్చెమటలు పట్టించి అన్ని వర్గాల ప్రజల ప్రజలను మెప్పించాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై గందరగోళం.. రంగంలోకి సోనియా!
-
Saraswati river: గంగా-యమున మధ్య భూగర్భ నది.. “అదృశ్య సరస్వతి” నదికి ఆనవాళ్లు..
-
Anil Kochhar: అమెరికా యూనివర్శిటీలో సంచలనం.. 176 మంది స్టూడెంట్ లోన్స్ క్లియర్ చేసిన ఇండియన్! ఆయన ఎవరో తెలుసా..
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
The Paradise: బట్టకాల్చి మీదేస్తే ఊరుకోం.. రీషూట్ పుకార్లపై మేకర్స్ స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!