‘రాఖీ పౌర్ణమి’ సందర్భంగా టీఎస్ఆర్టిసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయి. రాఖీ పండుగ రోజు ఈ నెల 9న 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి. గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల…
Supreme Court Cancels Telangana MLC Appointments: తెలంగాణ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గవర్నర్ కోటాలో కోదండరామ్, ఆమిర్ అలీఖాన్ ఎమ్మెల్సీల నియామకంను రద్దు చేసింది. కోదండరామ్, అలీఖాన్ నియామకాలను నిలిపివేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇద్దరి నియామకాలను సవాల్ చేస్తూ.. దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఉన్న కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్,…
తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు ఇటీవల కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన వివరించిన ప్రకారం, ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని అవసరమైన అనుమతులు ఇప్పటికే జారీ చేసింది.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్ని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన గుగులోత్ హారిక బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. అయితే సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో సెలైన్ బాటిల్ పెట్టించుకొని బంధువులు బైక్ పై ఖమ్మం హాస్పిటల్ కు బయలుదేరారు. మార్గమధ్యలో అంబులెన్స్ రావటంతో హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం హారిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హారికకు తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయ్ సంరక్షణలో ఉంటున్నట్లు తెలిసింది.…
తెలంగాణలో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కుండపోత వానలతో రాష్ట్రం తడిసి ముద్దైపోయింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరో 72 గంటలు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో ప్రభుత్వయంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యం లో నేడు, రేపు GHMC పరిధిలోని పాఠశాలలకు…
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాల రిలీజ్ సందర్భంగా మన తెలుగు సినీ నిర్మాతల రెండు నాలుకల ధోరణి బయటపడింది. నిజానికి సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదు, సినీ పరిశ్రమ ఇలా అయితే ఇబ్బంది పడుతుంది, థియేటర్లు మూతపడతాయంటూ బాధపడిన నిర్మాతలే ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వార్ * సినిమాని నాగవంశీ రిలీజ్ చేస్తుంటే, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్…
CM Revath Reddy : తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల సూచన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ముందస్తుగా అలర్ట్ చేయాలని సీఎం ఆదేశించారు. “వచ్చే 72 గంటలు అలెర్ట్గా ఉండండి. ఎక్కడ ఏం జరిగినా వెంటనే కంట్రోల్ రూమ్ తో కమ్యూనికేషన్ కొనసాగించండి” అని సూచించారు. అకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున, అవసరమైన హెలికాప్టర్లను…
Multi Level Parking : హైదరాబాద్ వాసులను ఏళ్లుగా ఇబ్బంది పెడుతున్న వాహనాల పార్కింగ్ సమస్యకు త్వరలోనే పరిష్కారం రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో నాంపల్లి హృదయభాగంలో అత్యాధునిక మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఈ సౌకర్యం ప్రారంభమైతే నగర కేంద్ర ప్రాంతంలో పార్కింగ్ సమస్యలకు శాశ్వతంగా చెక్ పడనుంది. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించిన ఈ కాంప్లెక్స్ దేశంలోనే తొలిసారిగా జర్మన్ పాలిస్ పార్కింగ్…