Marri Janardhan Reddy: పోలీసు సోదరులారా తస్మాత్ జాగ్రత్త.. ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాం!
- మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్
- పోలీసు సోదరులారా తస్మాత్ జాగ్రత్త
- ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marri Janardhan Reddy Warns Telangana Police: తెలంగాణ పోలీసులపై నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులు సీఎం రేవంత్ రెడ్డికి బానిస అయ్యారని విమర్శించారు. సీఎం గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా.. ఉదయనే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారని ఎద్దేవా చేశారు. కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము అని హెచ్చరించారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మర్రి జనార్దన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
‘పోలీసులు రేవంత్ రెడ్డికి బానిస అయ్యారు. ముఖ్యమంత్రి గురించి సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడినా ఉదయనే వారి ఇంటి ముందు పోలీసులు ఉంటున్నారు. పోలీసు సోదరులను హెచ్చరిస్తున్నా.. కందనూలు ప్రాంతంలో పనిచేసిన ప్రతి ఎస్సై, సీఐ, డీఎస్పీల పేరు రాసి పెట్టుకుంటాము. మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టే పోలీసులు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నావదిలిపెట్టే ప్రసక్తే లేదు. పోలీసులకు హెచ్చరిస్తున్నా.. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కల, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు. రాష్ట్రంలో రాబోయే 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఉండదు’ అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
Also Read: Bhadrachalam Flood Update: శాంతిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద 49 అడుగుల నీటిమట్టం!
‘పోలీసు సోదరులారా.. అనవసరంగా కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చుకోకండి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ కార్యకర్తలుగా పోలీసులు పని చేస్తున్నారు. పోలీసులు తస్మాత్ జాగ్రత్త.. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. న్యాయం ఎటు వైపు ఉంటే అటువైపు మీరు ఉండాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో మాకు స్వేచ్ఛ లేదా?. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరి గురించైనా అసభ్యంగా మాట్లాడకుండా ఏదైనా మాట్లాడొచ్చు’ అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!